అన్వేషించండి

Jagadhatri Serial Today May 12th: జగద్ధాత్రి సీరియల్: జేడీ,కేడీని చంపేందుకు అవినాష్‌ వేసిన ప్లాన్ ఎలా బెడిసికొట్టింది? కార్తిక్‌ను కేడీ ఎలా చంపాడు?

Jagadhatri Serial Today Episode May12th: జేడీ,కేడీని చంపేందుకు అవినాష్‌ వేసిన ప్లాన్ ఎలా బెడిసికొట్టింది..? కార్తిక్‌ను కేడీ ఎలా చంపాడు...?

Jagadhatri Serial Today Episode: వీరశంకర్‌ వార్నింగ్ ఇచ్చి వెళ్లడంతో సుధాకర్ అయోమయంలో ఉంటాడు. అప్పుడు బాబాయి దగ్గరకు వచ్చిన కౌశికి ఏం చేద్దామనుకుంటున్నారని అడుగుతుంది. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చేసిన తప్పును ఇప్పటికైనా సరిదిద్దుకోమని చెబుతుంది. అయినా కేదార్ ఆస్తికోసం మన దగ్గరకు రాలేదని...మన ప్రేమ కోసమే వచ్చాడని చెబుతుంది. సరైన  నిర్ణయం తీసుకోమని చెబుతుంది. ఇంతలో నిషిక, వైజయంతి అక్కడికి వస్తారు.మామయ్యగారికి చాటుగా ఏం చెబుతున్నావని అంటుంది.

ఇక్కడ చాటుగా చేయాల్సిన పనులేవీ ఉండవని...ఈ ఇంటికి వచ్చి ఇన్నేళ్లవుతున్నా నీకు  ఇక్కడి పద్ధతులు ఏం అలవాటు కాలేదని మండిపడుతుంది. అయితే ఇప్పుడు ఆ కేదార్‌గాడిని ఇంటి వారసుడిగా తీసుకొస్తారా అని యువరాజు ప్రశ్నిస్తాడు. ఈ మొత్తం ఆస్తికి నేనే వారసుడినని చిన్నప్పటి నుంచి చెప్పి పెంచారని ఇప్పుడు సడెన్‌గా ఎవడికో కట్టబెట్టి నాకు సెకండ్ ప్లేస్ ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. పరిస్థితులు అర్థం చేసుకోమని కౌషికి చెబుతుంది.

ఇప్పుడు ఆ వీరశంకర్‌ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని...వాటిని తీసుకుని ఆయన మీడియా ముందుకు వెళ్తే మన పరువే పోతుందని చెబుతుంది ఆ సాక్ష్యాలు లేకుండా చేస్తానని యువరాజు అనగా....కౌషికి తమ్ముడిపై మండిపడుతుంది. నువ్వు చేసిన పని వల్లే ఇప్పుడు కనీసం ఆయన్ను క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయామని చెబుతుంది.ఆయన ఇంటికి వచ్చిన రోజే మనం అబద్ధం చెప్పకుండా మన పరిస్థితి ఇదని చెప్పి ఉంటే ఆయన విని ఉండేవాడని కోప్పడుతుంది. మీరు వాడిని కొడుకుగా ఒప్పుకుంటే నేను చచ్చిపోతానని వైజయంతి బెదిరిస్తుంది. నేనే ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటానని మీరు అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని సుధాకర్‌ అందరినీ పంపించేస్తాడు.

వీరశంకర్‌తోపాటు మహల్‌లో ఉన్న జగధాత్రి, కేదార్‌కు సాధూ ఫోన్‌ చేస్తాడు.  మినిస్టర్‌ రాయుడు ఏదో జాతరకు వెళ్తున్నాడని...ఆయన అక్కడ ప్రమాదం ఉందని చెప్పి మీ ఇద్దరినీ  సెక్యూరిటీగా పంపించమంటూ పై నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడని చెబుతాడు. ఇదేదో కావాలని చేస్తున్నట్లు ఉందని...మీ ఇద్దరినీ చంపడానికి ప్లాన్ ఏదైనా వేసి ఉంటాడని చెబుతాడు. మీరు జాతరకు వెళ్లొద్దని చెబుతాడు.మనం వెళ్తేనే కదా సార్ వాడి ప్లాన్ ఏంటో తెలుస్తుందని జేడీ అంటుంది. మేం జాగ్రత్తగానే వెళ్లి వస్తామని అంటుంది. మనం బయటకు వెళ్తే...ఆ యువరాజు సాక్ష్యాలు కోసం తాతయ్యను ఏమైనా చేస్తాడేమోనని కేదార్ భయపడతాడు. కానీ వీరశంకర్‌ నాకు ఏం కాదులే మీరు వెళ్లిరండని చెబుతాడు. సాక్ష్యాలు ఎక్కడ దాచిపెడదామని ఆలోచిస్తుండగా...హాల్‌లో అమ్మ ఫొటో వెనకపెడదామని అప్పుడే యువరాజు చూడడని చెబుతాడు. అయితే అక్కడే పనిమనిషిగా ఉన్న యువరాజు మనిషి ఇదంతా విని యువరాజుకు చేరవేస్తాడు.

జాతరకు వచ్చిన మినిష్టర్‌ను చూసి జేడీ వార్నింగ్‌ ఇస్తుంది. కనీసం కొడుకుని విదేశాలకు పంపించినా ప్రాణాలు దక్కేయని అంటుంది.ఇప్పుడు అనవసరంగా మా చేతిలో చావబోతున్నాడని చెప్పి వెళ్లిపోతుంది. మీనన్‌తో కలిసి గుడికి వచ్చిన అవినాష్‌కు తండ్రి ఫోన్ చేసి పారిపొమ్మని చెబుతాడు. ఆ జేడీని చంపేవరకు నేను ఎక్కడికి వెళ్లనని అవినాష్ అంటాడు . షార్ప్‌షూటర్‌తో ముందు కేడీని చంపి....ఏడుస్తున్న జేడీని చంపాలని ప్లాన్ వేస్తారు.షూటర్‌ కాల్చిన బుల్లెట్ కేడీకి తగలకుండా పక్కకు పోతుంది.

వెంటనే గుర్తించిన జేడీ అక్కడి నుంచి భర్తను తీసుకుని వెళ్లిపోతుంది. అవినాష్‌ దగ్గరకు వెళ్లి నువ్వు మరీ ఇంత పిరికివాడివి అనుకోలేదని రెచ్చగొడుతుంది.అసలు మేం మిమ్మల్ని చంపాలనుకుంటే ఎప్పుడో చంపేవాళ్లమని అవినాష్ అంటాడు. మా టార్గెట్ మీరు కాదని జనం అని అంటాడు. ఇక్కడ మరికాసేపట్లో బాంబు పేలి పెద్ద ఎత్తున జనం చావబోతున్నారని చెబుతాడు. ఇంతకలో అవినాష్ ఫ్రెండ్‌ కార్తిక్ భయపడి వాళ్లతో పెట్టుకోవద్దని అంటాడు.నీకు అంత భయం ఉంటే విదేశాలకు వెళ్లిపొమ్మని పాస్‌పోర్టు ఇస్తాడు. బాంబు ఎక్కడ ఉందో కనిపెట్టేందుకు జేడీ,కేడీ వెళ్తారు. ఇంతలో కార్తీక్ భయపడి కారులో పారిపోతుంటాడు. అయితే కేడీ  ఆ బాంబు ఎక్కడ ఉందో కనిపెట్టి పారిపోతున్న కార్తీక్ కారులో పడేస్తాడు. అంతే బాంబు పేలి కార్తిక్ తునాతునకలవుతాడు.

మరిన్ని తెలుగు సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today June 30th: 'గోదావరి' సీరియల్: వేలంపాట దగ్గరకు వెళ్లి గొడవ చేసిన జాను..! జానుని తోసేసిన అధికారులు!
'గోదావరి' సీరియల్: వేలంపాట దగ్గరకు వెళ్లి గొడవ చేసిన జాను..! జానుని తోసేసిన అధికారులు!
Nindu Manasulu Serial Today June 30th: నిండు మనసులు: బామ్మ గెటప్‌లో ఇరగదీసిన ప్రేరణ.. వరుణ్ ఆచూకీ తెలిసినట్లేనా!
నిండు మనసులు: బామ్మ గెటప్‌లో ఇరగదీసిన ప్రేరణ.. వరుణ్ ఆచూకీ తెలిసినట్లేనా!
Gundeninda Gudigantalu June 30th Episode: సుమతి ప్రేమలో అరుణ్, విద్యపై రోహిణి నిఘా, బాలు మీనా ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రుతి - గుండెనిండా గుడిగంటలు జూన్ 30 ఎపిసోడ్!
సుమతి ప్రేమలో అరుణ్, విద్యపై రోహిణి నిఘా, బాలు మీనా ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రుతి - గుండెనిండా గుడిగంటలు జూన్ 30 ఎపిసోడ్!
Karthika Deepam 2 Serial Today June 30th: కార్తీకదీపం 2 సీరియల్: సీఈఓ బాధ్యతలు తీసుకున్న దీప.. దీప అసిస్టెంట్‌గా జ్యోత్స్న! దీపని వదినా అన్న సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: సీఈఓ బాధ్యతలు తీసుకున్న దీప.. దీప అసిస్టెంట్‌గా జ్యోత్స్న!
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Kajal Aggarwal: కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
Embed widget