![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Guppedantha Manasu March 8th Episode: కాలేజ్ కి బై చెప్పిన వసు , ఎండీ సీట్లో శైలేంద్ర - మను ఇవ్వబోయే ట్విస్ట్ ఏంటి - గుప్పెడంతమనసు మార్చి 8 ఎపిసోడ్!!
Guppedantha Manasu Today Episode: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
![Guppedantha Manasu March 8th Episode: కాలేజ్ కి బై చెప్పిన వసు , ఎండీ సీట్లో శైలేంద్ర - మను ఇవ్వబోయే ట్విస్ట్ ఏంటి - గుప్పెడంతమనసు మార్చి 8 ఎపిసోడ్!! Guppedantha Manasu Serial March 8th Episode 1019 Written Update Today Episode Guppedantha Manasu March 8th Episode: కాలేజ్ కి బై చెప్పిన వసు , ఎండీ సీట్లో శైలేంద్ర - మను ఇవ్వబోయే ట్విస్ట్ ఏంటి - గుప్పెడంతమనసు మార్చి 8 ఎపిసోడ్!!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/fe24d67445cd46c5ee747f402ade47481709864621342217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Guppedantha Manasu March 8th Episode: (గుప్పెడంతమనసు మార్చి 8th ఎపిసోడ్)
వసుధార, మను ఫొటోస్ కాలేజీ మొత్తం అంటిస్తాడు రాజీవ్. ఆ ఫొటోస్ చూసి అందరూ షాక్ అవుతారు. అనుపమతో పాటూ కాలేజ్ లెక్చరర్స్ కూడా మనుని నిలదీస్తారు. మీకు తెలియకుండా ఇవి కాలేజిలోకి ఎలా వచ్చాయంటూ ఫైర్ అవుతారు. మను తనకేం తెలియదని చెప్పినా కానీ వారు పట్టించుకోరు. మీ ఇద్దరి మధ్యా ఏదో రిలేషన్ ఉందంటారు. నోర్ముయ్ అని అరుస్తుంది వసుధార...
వసుధార: అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు బుద్ధుందా... నేను కాలేజీ ఎండీ, మను బోర్డ్ మెంబర్. మేం ఏదో కాలేజీ పని మీద వెళ్లినప్పుడు గిట్టనివాళ్లు మాపై బురదజల్లడానికి ఈ ఫొటోలు తీశారు
లెక్చరర్స్: మీరు చేసేది అంత చేసి మాపై ఎందుకు అరుస్తున్నారంటూ రివర్స్ అటాక్ చేస్తారు. స్టూడెంట్స్, కాలేజీ భవిష్యత్తు గురించి ఆలోచించే మీరు ఇలా తప్పు చేయడం బాగాలేదు
వసుధార: ఇదంతా అబద్ధం
లెక్చరర్స్: మీరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో మాకు అర్థం కావడం లేదు. రిషి ఆత్మశాంతి కోసం సంతాప సభ ఏర్పాటుచేస్తే, నేను బతికి ఉన్నానంటే రిషి బతికి ఉన్నట్లే అని చెప్పి సంతాపసభను అడ్డుకున్నారు, రిషి ప్రాణామైతే ఇదేమిటి అని వసుధారను నిలదీస్తారు. ఇప్పుడు రిషిపై వసుధారకు ఉన్న ప్రేమ ఏమైంది, చచ్చిపోయిందా, దారితప్పిందా? ఉన్నతమైన పదవుల్లో ఉంటూ ఇలాంటి తప్పుడు పనులు ఎలా చేస్తారు . స్టూడెంట్స్ అందరికి మీరు రోల్మోడల్, మీ జీవితం చాలా మందికి స్ఫూర్తి, అలాంటి మీరే ఇలాంటి పనులు చేస్తే ఎలా
ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది...
లెక్చరర్స్: వసుధార, మను మధ్య ఉన్న ప్రేమ నిజమని లెక్చరర్స్ స్టూడెంట్స్ కన్ఫామ్అవుతారు. వసుధార కోసమే మను యాభై కోట్లు ఇచ్చాడంటూ నిందలు వేస్తారు. బంగారం లాంటి రిషిని మోసం చేశారని, ఆయన గౌరవాన్ని, డీబీఎస్టీ కీర్తి ప్రతిష్టలకు భంగం తెచ్చిపెట్టారంటూ వసుధారపై ఫైర్ అవుతారు. ఎండీ పదవికి అర్హులు కాదని, ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు. మీ లాంటి వాళ్ల చేతుల్లో కాలేజీ ఉంటే పతనం కావడం ఖాయమంటారు
Also Read: కొత్త జంట పోస్టర్స్ రచ్చ , దేవయానికి షాకిచ్చిన శైలేంద్ర - గుప్పెడంతమనసు మార్చి 7 ఎపిసోడ్!
శైలేంద్ర: వసుధార నిప్పు ఆమె తప్పుచేసిందంటే నమ్మను. మను కావాలనే ఇదంతా చేశాడని స్టూడెంట్స్, లెక్చరర్స్ను నమ్మిస్తాడు. నువ్వు ఇంత నీచుడివని ముందే పసిగట్టాల్సిందని మనుపై ఫైర్ అవుతాడు. మను వల్లే వసుధార దోషిగా మారిందని చెబుతాడు. ఈ పోస్టర్స్ వెనుక మీరే ఉన్నారని అనుమానంగా ఉందని అంటారు. అందరూ కలిసి మనుదే తప్పని తేల్చేస్తారు.
వసుధార: మీరు ఇలా నమ్మకద్రోహం చేస్తారని అనుకోలేదని అంటూ మను చెంప పగలగొడుతుంది. తాను ఎండీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తుంది . రిషి సార్ గౌరవం నిలబెట్టడానికి, కాలేజీ పేరు ప్రతిష్టలకు భంగం కలగకుండా ఉండాలనే తాను రాజీనామా చేస్తున్నట్లు చెబుతుంది. తనకు అవమానం జరిగిన ఈ కాలేజీలోకి ఇక ఎప్పటికీ అడుగుపెట్టనని వసుధార కోపంగా వెళ్లిపోతుంది.
వసుధారకు నచ్చజెప్పేందుకు మహేంద్ర, అనుపమ ప్రయత్నించినా ఫలితం ఉండదు...
వసు నిర్ణయంతో శైలేంద్ర ఆనందిస్తాడు
గట్టి దెబ్బ కొట్టావు నిన్ను వదలనని శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు మను
వసుధార ఎండీ పదవికి రాజీనామా చేయడంతో ఆ బాధ్యతల్ని శైలేంద్ర చేపట్టేందుకు రెడీ అవుతాడు. మూహూర్తం పెట్టేసుకుంటాడు ఎండీ సీట్లో కూర్చునేందుకు ఈ సీట్ పై చేయి వేసి మురిసిపోతాడు... నేను సాధించాను అని గట్టిగా అరుస్తాడు...
డ్రైవర్ కంగారుగా బ్రేక్ వేయడంతో ఉలిక్కిపడతాడు శైలేంద్ర
కల బాగున్నా తాను ఎండీ సీట్లో కూర్చోలేకపోయానని శైలేంద్ర అనుకుంటూ..కలను చెడగొట్టినందుకు ధరణిపై ఫైర్ అవుతాడు...
ధరణి: మీరు కలలో సాధించింది రియల్గా జరగదని, పగటి కలలు నెరవేరవని ధరణి క్లాస్ ఇస్తుంది.
Also Read: అవమానించి ఆనందించారు కానీ ఆ తర్వాత ఆమె ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఊహించలేకపోయారు!
నిజంగానే ముహూర్తం
పంతులుకు ఫోన్ చేసిన శైలేంద్ర ఎండీ సీట్లో కూర్చోవడానికి తనకు మంచి ముహూర్తం పెట్టాలని, దోషం లేకుండా పూజ చేయాలని చెబుతాడు. పూజలు వద్దని చెప్పినా శైలేంద్ర వినడు. ఎండీ సీట్ కోసం శైలేంద్ర ఏదో కుట్ర చేశాడని ధరణి అనుమానపడుతుంది. వసుధారకు ఫోన్ చేసి హెచ్చరించాలని అనుకుంటుంది. కానీ ధరణి చేతుల నుంచి ఫోన్ లాక్కుంటాడు శైలేంద్ర.
మరోవైపు కాలేజీలో అంటించిన పోస్టర్స్ చూసి మహేంద్ర, అనుపమ కంగారు పడుతుంటారు.... అప్పుడే వసుధార కాలేజీలోకి అడుగుపెడుతుంది. కాలేజీ నిండా తన పోస్టర్స్ అంటించడం చూసి షాకవుతుంది.
ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది...
Also Read: మహా శివరాత్రి పూజ , అభిషేకం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఉపవాస నియమాలు - మరెన్నో వివరాలు సమగ్రంగా
గుప్పెడంత మనసు మార్చి 09 శనివారం ఎపిసోడ్ లో అసలు విషయం బయటపడుతుంది...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)