అన్వేషించండి

Guppedanta Manasu Serial Today May 20th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: శైలేంద్రను చంపేస్తానన్న రాజీవ్ – మను కోసం కన్నీరు పెట్టుకున్న అనుపమ

Guppedanta Manasu Today Episode : నిన్ను చంపేస్తానంటూ మను.. శైలేంద్రకు గన్ ఎక్కిపెట్టినట్లు శైలేంద్ర కలగనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఫన్నీగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode : మనును తీసుకుని ఇంటికి వచ్చిన మహేంద్ర, వసుధారలను చూసి అనుపమ హ్యాపీగా ఫీలవుతుంది. కానీ ఎవరితోనూ అనుపమ మాట్లాడదు. దీంతో వసుదార ఇంకా మౌనంగా ఉంటారేంటి మేడమ్‌ అని అడుగుతుంది. దీంతో తను మాట్లాడకున్నా నా మనసుకు వినిపిస్తుందని మను అంటాడు. ఈ గుండెకు ఆవిడ ప్రేమ, కోపం, ఆవేశం, బాధ అన్ని ఎమోషన్స్ తెలుస్తాయి. ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం తప్పా అని మను అంటాడు.  అనుపమ ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తుండిపోతుంది.

మను: మేడమ్ మీరు నా గురించి వర్రీ కాకండి. నేను బాగానే ఉన్నాను. మీ ఆశీస్సులు ఉన్నంతవరకు బాగానే ఉంటాను కూడా. వసుధార మేడమ్ నేను మీలాంటి మంచి మనిషిని చూడలేదు. మీ హెల్ఫ్ ఈ జన్మలో మర్చిపోను.

వసు: నేను చేసింది ఏం లేదు. మీకు సపోర్ట్‌ గా ఉన్నాను. ఈ విషయంలో ముందుండి నడిపించింది మీ నాన్నగారే మిమ్మల్ని దత్తత తీసుకుని మావయ్య గారు తండ్రి స్థానంలోకి రావాలనుకున్నారు కదా.

మహేంద్ర: అమ్మ వసుధార నువ్వేం తప్పు మాట్లాడలేదమ్మా. ఎందుకు తటపటాయిస్తున్నావ్. మనును నా కొడుకులాగే చూస్తున్నాను.

అని మహేంద్ర అంటాడు. మరోవైపు శైలేంద్రను సీరియస్‌గా చూస్తుంటాడు రాజీవ్‌.

శైలేంద్ర: ఏంటీ బ్రదర్ అలా సీరియస్‌గా చూస్తున్నావ్. నువ్వెలా జైలు నుంచి వచ్చావ్

రాజీవ్‌: రాలేననుకున్నావా. నాకు జైలు కొత్తేం కాదు. అందులో నుంచి తప్పించుకోవడం కూడా కొత్త కాదు.

శైలేంద్ర: అసలు అలా నువ్ పట్టుబడతావని అనుకోలేదు. షాక్ అయ్యాను. బయటకు తీసుకొద్దామనుకున్నాను

రాజీవ్‌: నాటకాలు ఆపు భయ్యా. నాకు అంతా తెలుసు. అయినా ఒక మోసగాడిని ఇంకో మోసగాడు మోసం చేయడం ఏంటీ భయ్యా

అంటూ రాజీవ్‌ గన్‌ తీసి శైలేంద్రకు గురిపెడతాడు. నన్ను ఇలా ఎవరు మోసం చేయలేదు. ఇక నిన్ను క్షమించేదే లేదు. ఇప్పుడే నిన్ను చంపేస్తానని రాజీవ్‌ అనడంతో శైలేంద్ర భయంతో ఎండీ సీటు కోసం అలా చేశానని.. తనను క్షమించమని రాజీవ్‌ కాళ్లపై పడతాడు. తీరా చూస్తూ శైలేంద్ర ధరణి కాళ్లపై పడి  ఈ ఒక్కసారి వదిలిపెట్టమని అడుక్కుంటుంటాడు. ఇంతలో ఫణీంద్ర రేయ్‌ శైలేంద్ర ఏం చేస్తున్నావు అనగానే తేరుకుని శైలేంద్ర షాక్‌ అవుతాడు.

ఫణీంద్ర: ఏం తప్పు చేశావురా. ఎందుకు తన కాళ్లు పట్టుకుని బతిమిలాడుతున్నావ్. ఎందుకు ప్రాణ భిక్ష పెట్టమంటున్నావ్

దేవయాని: ఛీ ఛీ.. అసలు నువ్ మనిషివేనా. నువ్ ఎంత పెద్ద తప్పు చేస్తే మాత్రం భార్య కాళ్లు పట్టుకోవడం ఏంట్రా.

ధరణి: మీరు చాలా మంచి వారండి. మీరు ఇలా చేయడం నాకు చాలా నచ్చింది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా కాళ్లు పట్టుకోవచ్చు

అని  చెప్పి అందరూ వెళ్లిపోతారు. మరోవైపు వసుధారకు అనుపమ థ్యాంక్స్ చెబుతుంది. మనును బయటకు తీసుకురావడం కోసం నీ ప్రాణాలు ఫణంగా పెట్టావ్ అని అనుపమ అంటుంది.

వసు: మనును బయటకు తీసుకురావడం నా బాధ్యత అని చెప్పాను కదా మేడమ్‌.

అనుపమ: నీ రుణం జన్మలో తీర్చుకోలేనిది. నేను ఎన్నో కష్టాలు పడ్డాను. కానీ, గుండెలవిసేలా బాధపడింది రెండే రెండే సార్లు. ఒకటి మనును అమ్మ అని పిలవకని చెప్పినప్పుడు. రెండోది తనను పోలీసులు తీసుకెళ్లినప్పుడు.

అని అనుపమ చెప్తుంటే పక్కనుంచి వింటున్న మను ఎమోషనల్‌గా ఫీలవుతాడు. నాబిడ్డకు తండ్రి ఎవరో చెప్పలేని దౌర్భాగ్యురాలిని అని అనుపమ అంటుంది. మీ వేదన గురించి నాకు అర్థమవుతోంది మేడం.. మీరు తనని ఎంతగా ప్రేమిస్తున్నారో తను కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నాడు. అని వసుధార అంటుంది. తర్వాత శైలేంద్ర, మనుకు కాల్ చేసి నిన్ను బయటకు తీసుకొచ్చాను కదా మన డీల్‌ గుర్తింది కదా? మర్చిపోయారేమో గుర్తు చేద్దామని కాల్ చేశాను. అని మనును ఎక్కడున్నావు అని అడుగుతాడు. మహేంద్ర వాళ్ల ఇంట్లో ఉన్నానని మను చెప్పగానే వీన్ని ఎలాగైనా అక్కడి  నుంచి వెళ్లిపోయేలా చేయాలని లేదంటే మను గాడి మనుసు మార్చేస్తారని శైలేంద్ర మనుసులో అనుకుని  మీరు అక్కడ ఉండకండి వెంటనే బయటకు వచ్చేయండి అని శైలేంద్ర అంటే.. ఎందుకు అని మను అడుగుతాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

ALSO READ: ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగ్‌కు విమర్శకులూ సైలెంట్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget