Guppedanta Manasu Serial Today August 10th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: ఎంజేల్ తో పెళ్లికి ఒప్పుకున్న మను – రిషిని చంపేస్తానన్న శైలేంద్ర
Guppedanta Manasu Today Episode: కాలేజీ బోర్డు మీటింగ్ లో తనను ఎండీ ప్రకటించిన తర్వాత రంగాను చంపేస్తానని శైలేంద్ర చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu Serial Today Episode: మహేంద్రను ఒంటరిగా వదిలిపెట్టి అక్కడి నుంచి దూరంగా ఎందుకు వచ్చారని అనుపమను వసుధార అడుగుతుంది. అయితే దేవయానికి మను తండ్రి ఎవరన్నది తెలిసిందని, అది అడ్డం పెట్టుకొని తనను బ్లాక్మెయిల్ చేసిందని వసుధారతో చెబుతుంది అనుపమ. ఆ నిజం బయటపడకూడదనే మనును దూరంగా తీసుకొచ్చానని చెప్తుంది అనుపమ. తాను చేసి పొరపాటు వల్లే దేవయానికి నిజం తెలిసిపోయిందని వసుధార బాధపడుతుంది. ఇదంతా మా తలరాత దానికి నువ్వేం చేస్తావని వసుధారతో అంటుంది అనుపమ.
వసుధార: మేడం ఇక మను గారికి మహేంద్ర సారే తన తండ్రి అని నిజం చెప్పండి.
అనుపమ: మనుకు నిజం తెలిస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయో, మహేంద్రకు ఏమవుతుందో నీకు అర్థం కావడం లేదు వసుధార.
వసుధార: అలాంటివేమి జరగవు మేడం. మీరు అనవసరమైన భయాలు పెట్టుకోకుండా మనుగారికి నిజం చెప్పండి.
అని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే వారి మాటలు మను వింటాడు. తన తండ్రి ఎవరో శైలేంద్ర, దేవయానిలకు కూడా తెలిసిందని తనకు మాత్రమే ఇంకా తెలియలేదని బాధపడతాడు. తన తండ్రి గురించి ఎవరిని అడగాల్సిన అవసరం లేదని ఏం చేయాలో క్లారిటి వచ్చిందని మనసులో అనుకుంటాడు. మరోవైపు ఒంటరిగా ఉన్న రిషి దగ్గరకు శైలేంద్ర వస్తాడు.
శైలేంద్ర: నువ్వు రిషిలా నటించమంటే.. జీవిస్తున్నవా? వసుధారను తిడితే నాకే వార్నింగ్ ఇస్తావా?
రిషి: అదేం లేదు సార్ గారండి.. వసుధారను నమ్మించేందుకే అలా చేశాను.
శైలేంద్ర: సరే కాలేజీలో బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో నువ్వు.. నన్ను ఎండీగా ప్రకటించాలి. నా పని పూర్తి కాగానే మిగిలిన డబ్బులు ఇచ్చి నిన్ను మీ ఊరికి పంపిస్తాను.
రిషి: పని పూర్తవ్వగానే నన్ను ఏం చేయవని గ్యారెంటీ ఏంటి?
శైలేంద్ర: నేను ఉండగా నిన్ను ఎవరూ ఏం చేయలేరు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుపెడతాను.
రిషి: అవును ఎండీ సీట్ అంటే ఎందుకు అంత ఇష్టం నీకు.
శైలేంద్ర: ఎండీ సీట్ చేపట్టాలనేది నా జీవితాశయం. డీబీఎస్టీ సామ్రాజ్యంలో రాజుగా ఉండాలన్నది నా కల, కాలేజీలో నా మాట శాసనంగా మారాలన్నది నా కోరిక.
అంటూ రిషి,జగతి, వసుధార ఇలా ఒక్కొక్కరు తన కలకు అడ్డుగా నిలుస్తూ వచ్చారని ఆగిపోతాడు. అయితే మహేంద్ర ఫ్యామిలీని నాశనం చేసింది నువ్వేనా? అని రిషి అడగ్గానే లేదని సొంత ఫ్యామిలీని ఎవరైనా నాశనం చేసుకుంటారా? అంటూ ఎదురు ప్రశ్నిస్తాడు శైలేంద్ర. కాలేజీ గవర్నమెంట్ హ్యాండోవర్ కాకుండా ఉండాలనే నీకు డబ్బులు ఇస్తూ ఈ నాటకం ఆడుతున్నానని చెప్తాడు. మరోవైపు మనం పెళ్లి చేసుకుందామా? అని మనును అడుగుతుంది ఎంజేల్. అయితే తనకు వారం రోజుల టైం కావాలని.. నా నిరీక్షణకు వారం రోజుల్లో ఫలితం దక్కనుందని తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామంటాడు మను. మరోవైపు దేవయాని, శైలేంద్ర మాట్లాడుకుంటుంటారు.
దేవయాని: రంగా, రిషి కాదని తెలిస్తే మన పరిస్థితి ఏంటి? వసుధారతో రంగా కలిసి ఉండటం చూస్తే కంపరంగా అనిపిస్తుంది.
శైలేంద్ర: అలాంటి భయం ఏం పెట్టుకోవద్దు మామ్. ఒకవేళ రంగా దొరికిపోయే పరిస్థితి వస్తే వాడిని నేనే లేపేస్తాను.
ధరణి: ఏవండి రంగా అంటే ఎవరండి?
శైలేంద్ర: రంగా నా ఫ్రెండ్.. అయినా ఇక్కడ నీకేం పని వెళ్లు బయటకు
అంటూ ధరణిని తిట్టి బయటకు పంపిస్తాడు శైలేంద్ర. ఇంతలో మను శైలేంద్రకు ఫోన్ చేస్తాడు. శైలేంద్ర ఫోన్ లిప్ట్ చేయడు. తర్వాత మహేంద్ర, వసుధార, రిషి తమ ఇంటికి వస్తారు. ఇంట్లో జగతి ఫోటో చూసిన మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Before You Go
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్గ్రౌండ్ తెలుసా?
ట్రెండింగ్ వార్తలు






















