అన్వేషించండి

Guppedanta Manasu August 14th: శైలేంద్ర ప్లాన్ సక్సెస్- డీబీఎస్టీ కాలేజ్ గురించి తప్పుడు ఆర్టికల్, తల్లడిల్లిపోయిన రిషి

Guppedantha Manasu August 14th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. మహేంద్ర-జగతి కూడా తగ్గేలే అన్నట్టే ఢీ అంటే ఢీ కొడుతున్నారు

విశ్వనాథం ఏంజెల్ గురించి బాధపడుతూ ఉంటాడు. ఏంజెల్ ని ధైర్యంగా ఉండమని చెప్పమని వసుధారతో విశ్వం చెప్తాడు. అప్పుడే రిషి వచ్చి ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీస్తాడు.

విశ్వం: నేను లేకపోతే ఏంజెల్ ఒంటరి అయిపోతుంది కదా. ఈరోజు కాకపోతే రేపు, ఎల్లుండి అయినా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే కదా

ఏంజెల్: ఏంటి విశ్వం నన్ను వదిలి వెళ్లిపోతావా?

విశ్వం: నిన్ను ఒకటి అడుగుతాను కాదనకూడదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి

ఏంజెల్: ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ తీసుకొస్తున్నావ్

వసు: జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యం. పిల్లకి పెళ్లి చేయాలని పెద్దవాళ్ళు ఆరాటపడుతూ ఉంటారు. పెళ్ళయిన తర్వాత వాళ్ళు కలిసిమెలిసి ఆనందంగా ఉండటం చూసి మురిసిపోతారు. అప్పుడు వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటారు

Also Read: మాళవిక హత్య జరిగిన చోట వేదకి దొరికిన కీలక ఆధారం- ఆరోజు రాత్రి ఏం జరిగిందంటే?

విశ్వం: నేను ఒంటరి వాడిని కాకూడదని తను పెళ్లి ఆలోచన చేయడం లేదు. నేను నిన్ను ఇన్నాళ్ళూ ఏమి అడగలేదు. ఇది నా కోరిక నెరవేర్చమ్మా. నన్ను ఒక మంచి సంబంధం చూడమంటావా అనేసరికి ఏంజెల్ మౌనంగా వెళ్ళిపోతుంది. తను ఒప్పుకోకపోతే తన జీవితం ఎలా అవుతుందోనని భయంగా ఉంది. తనకి ఒక తోడు ఇవ్వడం నా బాధ్యత.

వసు చేతిలో రిషి చేతిని పెట్టి పట్టుకుని ఏంజెల్ జీవితం మీ చేతుల్లో పెడుతున్నా. తన బతుకు మీరే చక్కదిద్దాలి అని అడుగుతాడు. అందుకు ఇద్దరూ సరే అంటారు. వసు డల్ గా ఇంటికి వస్తుంది. తనని చూసి చక్రపాణి ఏమైందని అడుగుతాడు. విశ్వనాథం గారికి అలా జరిగిందని ఏంజెల్ చాలా భయపడుతుందని చెప్తుంది. సర్ కూడా తన విషయంలో బెంగ పెట్టుకుని కంగారుపడుతున్నారని, అందుకే తనకి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. కానీ తను మాత్రం మౌనంగా పక్కకి వెళ్లిపోతుందని బాధగా చెప్తుంది. కూతురి మాటలు విన్న చక్రపాణి రిషి సర్ ఉన్నారు కదా తనని ఎలాగైనా పెళ్లికి ఒప్పిస్తారని ధైర్యం చెప్తాడు.

రిషి కాలేజ్ లో ప్రిన్సిపాల్ ని కలుస్తారు. మహేంద్ర, జగతి ఫోన్ చేశారని డీబీఎస్టీ కాలేజ్ నుంచి మిషన్ ఎడ్యుకేషన్ సంబంధించి డీటైల్స్ పంపిస్తానని అన్నారు విశ్వనాథం గారికి బాగోలేదని నేనే వద్దని చెప్పానని చెప్తాడు. అప్పుడే ఒకతను వచ్చి పేపర్ ఇస్తాడు. పతనం దిశగా డీబీఎస్టీ కాలేజ్, తగ్గిపోతున్న స్టూడెంట్స్ ప్రవేశాల సంఖ్య అంటూ ఆర్టికల్ వస్తుంది. డీబీఎస్టీ కాలేజ్ గురించి చాలా తక్కువ చేసి రాశారు అది ఎంత వరకు నిజమో తెలియదని అతను అంటాడు. డీబీఎస్టీ కాలేజ్ మూసేయడం ఏంటి? అసలు ఎవరు రాశారు ఇది? ఇదంతా జరుగుతుంటే డాడ్, జగతి మేడమ్ ఏం చేస్తున్నారు. ఈ న్యూస్ వాళ్ళు చూశారా లేదా అని రిషి మనసులో అనుకుంటాడు. దీని గురించి కాలేజ్ లో ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. కాలేజ్ తో తనకున్న జ్ఞాపకాలు తలుచుకుంటాడు.

రిషి: అసలు ఇంత జరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు. మినిస్టర్ మెచ్చుకున్నారు. సొసైటీలో మంచి పేరు వచ్చింది. విద్యారంగంలో కూడా ఎంతో మంది డీబీఎస్టీ కాలేజ్ చూసి మురిసిపోయారు. నేను కలలో కూడ ఊహించలేదు ఇలాంటి ఒక రోజు వస్తుందని

Also Read: కృష్ణ,మురారీలని కలిపేందుకు గౌతమ్ ప్లాన్- తన ప్రేమ గెలుస్తుందనే ఆనందంలో ముకుంద

అప్పుడే పాండ్యన్ బ్యాచ్ వచ్చి మిషన్ ఎడ్యుకేషన్ కోసం కొన్ని ఏరియాస్ లో సర్వే చేశామని చెప్తారు. రిషి పరధ్యానంగా ఉంటే ఏమైందని స్టూడెంట్స్ అడుగుతారు. వాళ్ళ వెనుక వసుధార ఉండటం చూసి ఏదో చెప్పబోయి ఆగిపోతాడు. ఏమైందని వసు పాండ్యన్ వాళ్ళని అడుగుతుంది. ప్రిన్సిపాల్ రూమ్ లో ఈ పేపర్ చూశారు అప్పటి నుంచి ఇలా మూడీగా ఉన్నారని పేపర్ చూపిస్తారు. అందులో న్యూస్ చూసి వసు షాక్ అవుతుంది. అటు మహేంద్ర కూడా ఇదే న్యూస్ ని జగతికి చూపిస్తాడు. అది చూసి కళ్ళు తిరిగి పడబోతుంది.

జగతి: మన కాలేజ్ లో స్టూడెంట్స్ తగ్గిన మాట నిజమే కానీ ఇంత బ్యాడ్ గా రాయడం ఏంటి?

మహేంద్ర: అదే నాకు అర్థం కావడం లేదు

జగతి: అసలు ఇంత కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ బయటకి ఎలా వచ్చింది. ఇది మన స్టాఫ్ లో ఎవరైనా లేదంటే శైలేంద్ర చేసి ఉండవచ్చు.

మహేంద్ర: ఇలా చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు. వెంటనే నేను తెలుసుకుంటాను దీనికి కారణం ఎవరు అనేది

శైలేంద్ర కోపంగా ఆ పేపర్ తీసుకొచ్చి టేబుల్ మీద జగతి ముందు విసిరి ఏంటి పిన్ని ఇది అని సీరియస్ గా అడుగుతాడు.

జగతి: నేను అదే అడుగుతున్నా

శైలేంద్ర: ఏంటి తిరిగి నన్ను ప్రశ్నిస్తున్నారు. ఇది మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించినది కాదు కాలేజ్ కి సంబంధించింది. నేను కాలేజ్ బోర్డ్ మెంబర్ ని. దీని గురించి ఎవరెవరో ఫోన్ చేసి అడుగుతున్నారు నాకు తల కొట్టేసినట్టుగా ఉంది

మహేంద్ర: ఎవరు ఫోన్ చేశారు. అసలు నువ్వు ఇక్కడ బోర్డ్ మెంబర్ అని ఎవరికీ తెలియదు. ఇక నీకు ఫోన్ చేసి అడుగుతారా? చెప్తే నమ్మేలా ఉండాలి

శైలేంద్ర: వాటితో నాకు సంబంధం లేదు ముందు మీరు దీనికి సమాధానం చెప్పండి బాబాయ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget