అన్వేషించండి

Gruhalakshmi September 21st: లాస్య రీ ఎంట్రీ - సామ్రాట్ కంపెనీ సీఈఓగా తులసి బాధ్యతలు తీసుకుంటుందా!

Gruhalakshmi Serial September 21st Episode : రత్నప్రభ దంపతుల ఎంట్రీతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Gruhalakshmi Serial September 21st Episode :నందు దగ్గరకి వచ్చిన పరంధామయ్య వాళ్ళు హనీ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందని అడుగుతారు. నిర్లక్ష్యంగా ఉంటే తులసికి ప్రమాదం జరుగుతుంది. ఆ ఇంట్లో వాళ్ళు తులసి మీద అనుమానపడుతున్నారు. ఆస్తి కోసం హనీకి దగ్గర అవుతుందని డిసైడ్ అయ్యారు. తనని ఆ ఇంటి వైపు రాకుండా చూసుకోమని బెదిరించారని చెప్తాడు. ఈ విషయం తులసికి చెప్పాలి కదా అంటే చెప్తే గొడవ పడి హనీని ఇంటికి తీసుకొస్తుంది. అప్పుడు గొడవ మరీ పెద్దది అవుతుందని నందు అంటాడు. ఏదో ఒక కారణం చెప్పి ముందు తనని ఆ ఇంటికి వెళ్ళకుండా ఆపాలని అంటాడు. దివ్య ఒంటరిగా కూర్చుని విక్రమ్ జానూ మీద సీరియస్ అయి తన తలకి కట్టు కట్టిన విషయం తలుచుకుని మురిసిపోతుంది. భర్త మనసులో తానే ఉన్నానని సంతోషపడుతుంది. అప్పుడే విక్రమ్ వస్తే ముద్దులతో అభిషేకం చేసి రుణం తీర్చుకోవాలని అనుకుంటుంది. ట్యాబ్లెట్స్ వేసుకోమని ఇస్తాడు.

విక్రమ్: నీలా మనసులో ఒకటి పెట్టుకుని మరొకటి చూపించడం నాకు రాదు

దివ్య: దెబ్బ తగిలినప్పుడు చూపించిన ప్రేమ నిజమే కదా

విక్రమ్: అనుమానమే లేదు. గతాన్ని తలుచుకుని పాఠాలు నేర్చుకున్నా

Also Read: తండ్రిని చూసి విలవిల్లాడిపోయిన కావ్య - దొంగల్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన రాజ్!

దివ్య: నా మీద నీకు ప్రేమ ఉంది. నీకు తెలియకుండానే అది బయటకి వచ్చింది ఒప్పుకో

విక్రమ్: విలువ లేని చోట ప్రేమ ఉండి ఏం లాభం మర్చిపో

ఇద్దరూ కాసేపు ప్రేమ గురించి వాదించుకుంటారు. తన మీద మాత్రం నమ్మకం లేదని విక్రమ్ తెగేసి చెప్పేస్తాడు. సామ్రాట్ ఇంటికి మేనేజర్ వస్తాడు. ఏంటి పని అని అడుగుతాడు. రత్నప్రభ వచ్చి మేనేజర్ ని పిలిపించింది తనేనని అంటుంది.

రత్నప్రభ: ఈరోజు నుంచి ధనుంజయ్ కంపెనీ సీఈఓ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆర్డర్ రెడీ చేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి

పెద్దాయన: అందుకు తొందర ఏముంది

ధనుంజయ్: మీ మనసులో ఏముందో చెప్పండి

రత్నప్రభ: ఒక కంపెనీ సీఈఓ లేకుండా ఎన్ని రోజులు ఉంటుంది. సామ్రాట్ ఏమైనా బతికి వస్తాడా? వెంటనే ఆర్డర్ రెడీ చేయండి. మీరు ఏ హక్కుతో ధనుంజయ్ సీఈఓ కాకుండా అడ్డుపడాలని అనుకుంటున్నారు. బుద్ధిగా మేం చెప్పినట్టు నడుచుకుంటే మీకు మాకు మంచిది. కాదు కూడదు అంటే కోర్టుకి వెళ్ళి లీగల్ గా ఆస్తి దక్కించుకుంటాం. హనీ అడ్డం లేకపోతే ఈ ఆస్తి మొత్తం మాకు వస్తుంది. ఇప్పుడు హనీ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయని బెదిరిస్తారు.

తులసి హనీ గురించి ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంది. హనీ విషయంలో ఇంకెప్పుడు నందు మాట విననని అంటుంది. ఒక్క పూట హనీకి ఫోన్ చేయకపోతే ఏమౌతుందని అనసూయ అంటుంది. కానీ తన మనసు మాత్రం హనీ చుట్టూనే ఉంటుందని తులసి చెప్తుంది. తండ్రి పోవడంతో హనీ ఒంటరిది అవ్వచ్చు కానీ చూసుకోవడానికి తన వాళ్ళు ఉన్నారు. మనం ఎక్కువగా దిగులు పడాల్సిన పని లేదని అనసూయ తులసికి నచ్చజెప్పడానికి చూస్తుంది. కానీ తులసి మాత్రం హనీ పాట పాడుతూనే ఉంటుంది. కేఫ్ కి వెళ్తూ హనీకి టిఫిన్ ఇచ్చేసి వెళ్దామని అంటుంది. నందు వాళ్ళు ఎన్ని చెప్పిన కూడా తులసి మాత్రం వినిపించుకోదు. తులసికి నిజం చెప్పేయాల్సిందేనని  పరంధామయ్య అంటాడు. లాస్య తలనొప్పి వదిలిందని అనుకుంటే వీళ్ళు తగులుకున్నారు ఏంటా అని అనసూయ అంటుంది.

అప్పుడే చాలా రోజుల తర్వాత లాస్య కనిపిస్తుంది. చీకటి గదిలో కూర్చుని ఉంటే భాగ్య వస్తుంది.

Also Read: రసవత్తరంగా మారిన కథనం- ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్న కృష్ణ, ముకుంద

భాగ్య: నిన్ను మోసం చేసింది నీ చుట్టు ఉన్న పరిస్థితులు. దొరికిన దానితో సంతోషపడకుండా అతి ఆశకి పోయావ్. ఇప్పుడు మా ఇంట్లో తలదాచుకుంటున్నావ్

లాస్య: వెళ్లిపొమ్మని అంటావా?

భాగ్య: నువ్వు చేయాల్సిన యుద్దం నా మీద కాదు

లాస్య: త్వరలోనే తులసిని దెబ్బ కొడతాను

కాసేపు భాగ్య లాస్యని నాలుగు దెప్పిపొడుపు మాటలు మాట్లాడి వెళ్ళిపోతుంది. జానూ బ్యాగ్ సర్దుకుని వచ్చేసరికి రాజ్యలక్ష్మి కంగారుగా ఎక్కడకని అంటుంది. ఎందుకు వెళ్లడమని అంటుంది. తను వెళ్లిపోతుంటే విక్రమ్ అడ్డుపడతాడు. అప్పుడే దివ్య వస్తుంది.

జానూ: నన్ను ఏమైనా అనాల్సినవి మిగిలిపోయాయా? ఏమైనా ఉంటే అనేసేయ్.. నిన్న నువ్వు అన్న మాటలతో చచ్చిపోయింది

విక్రమ్: సోరి, ఆ క్షణంలో నువ్వు చేసింది తప్పని అనిపించింది అందుకే అరిచాను  

దివ్య: తప్పు చేశాడు కాబట్టి అరిచాడు అందులో తప్పేముంది

విక్రమ్: ఇది మా ఇద్దరి మధ్య వ్యవహారం

తరువాయి భాగంలో..

సామ్రాట్ బాబాయ్ తులసి దగ్గరకి వస్తుంటే తనని కలవనివ్వకుండా నందు పక్కకి తీసుకెళ్తాడు. ధనుంజయ్ సామ్రాట్ కంపెనీ బాధ్యతలు తీసుకుంటున్నాడని తులసికి చెప్పాలని అంటాడు. కానీ నందు మాత్రం ఈ విషయంలో తులసిని లాగొద్దని చెప్తాడు. ఆ ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే తులసి ప్రాణాలు తీస్తానని బెదిరించారని నందు నిజం చెప్పేస్తాడు. వాళ్ళ మాటలు తులసి వినేస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget