అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial August 8th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: వివేక్, జానుల ప్రదక్షిణలు.. లక్ష్మీని మిత్రకు గుర్తు చేసిన దేవయాని, ఇచ్చి పడేసిన మనీషా! 

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode ఖుషిని వివేక్‌తో కలిసి ప్రదక్షిణలు చేయించడానికి దేవయాని లక్ష్మీ గొప్పతనం అందరి ముందు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ కాల్ చేసి జున్నుని తీసుకురమ్మని చెప్పిందని అర్జున్ తల్లితో చెప్తాడు. లక్ష్మీకే కష్టాలు అన్నీ వస్తున్నాయని వసుంధర బాధ పడితే అర్జున్ ఏం కాదు అని చెప్తాడు. లక్ష్మీ ఓ వైపు జున్నుని, మరోవైపు లక్కీని ఎలా మ్యానేజ్ చేస్తుందా అని అనుకుంటాడు. తనకి తోడు ఉంటానని అంటాడు. భూదేవికి ఉన్న ఓర్పు లక్ష్మీకి ఉందని లక్ష్మీకి త్వరలోనే మంచి రోజులు రావాలని కోరుకుంటారు. మరోవైపు మిత్ర వాళ్లు గుడికి చేరుకుంటారు. 

జాను: అక్క నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అల్రెడీ నువ్వు ఇక్కడ సంయుక్తలా ఉన్నావ్ మరి జున్ను అమ్మగా ఎలా కనిపిస్తావు.
సంయుక్త: ఏమో జాను ప్రస్తుతానికి ఇక్కడ లక్కీకి జున్నుఅమ్మ లక్ష్మీ కనిపించాలి. అప్పుడే సంయుక్త జున్ను వాళ్ల అమ్మ ఒకరు కాదు అని అర్థమవుతుంది. లక్కీ దగ్గర నా ఫొటోలు ఉన్నాయి కదా అవి సోషల్ మీడియాలో పెడితే మొదటికే మోసం వస్తుంది. అందుకే లక్కీని రెచ్చ గొట్టకుండా మ్యానేజ్ చేస్తున్నా. 
జాను: అది సరే అక్క కానీ నువ్వు జున్ను అమ్మలా కనిపిస్తే ఇంకేమైనా ఉందా జున్ను తల్లే లక్ష్మీ అని అందరికీ అనుమానం వచ్చినా క్లారిటీ వచ్చినా ఇంకేమైనా ఉందా.
సంయుక్త: జాను నేను ఏదో ఒకటి చేస్తా పద.

ఇక గుడిలోకి వెళ్లిన తర్వాత పంతులు 108 ప్రదక్షిణలు చేయమంటే పెళ్లి కూతురు ఖుషి మొండి కేస్తుంది. దాంతో ఆవిడ తల్లి కష్టం తెలియకుండా పెరిగింది కాబట్టి చేయడం లేదని అంటుంది. ఇక మిత్ర భార్య లక్ష్మీ మిత్ర కోసం చాలా చేసిందని మిత్రకు వచ్చే ప్రతీ గండం నుంచి తనే కాపాడేదని దేవయాని ఖుషితో చెప్తుంది. మిత్ర గతంలో తనని లక్ష్మీ కాపాడిన పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటాడు. 

లక్ష్మీ గొప్పతనం గురించి చెప్పొద్దని మనీషా అంటుంది. వివేక్ అయితే అన్నయ్య గురించి వదిన ఎన్ని చేసిందో నీకు తెలీదా అని ప్రశ్నిస్తాడు. ఇక ఆవుని చూసి లక్కీ వెళ్లిపోతుంది. మిత్ర లక్ష్మీ టాపిక్ రావడంతో వెళ్లిపోతాడు. ఇక ఖుషి తల్లి అందర్ని ప్రదక్షిణలు చేస్తారా అని అడుగుతుంది. అందరూ చేయలేమని అనేస్తారు. చివరకి ఖుషి తల్లి జానుని చూసి నీకు డబ్బులు ఇస్తాను మా అమ్మాయికి బదులు నువ్వు ప్రదక్షిణలు చేస్తావా అని అడుగుతుంది. ఇక మంచి పని కోసం చేస్తానని డబ్బులు అవసరం లేదని జాను అంటుంది. 

మిత్ర లక్ష్మీ గురించి దేవయాని అన్న మాటలు తలచుకొని బాధ పడుతుంటాడు. మిత్ర దగ్గరకు సంయుక్త వస్తుంది. ఏమైంది ఎందుకు అలా ఉన్నారు. గతం గుర్తొస్తుందా అని అడుగుతుంది. మిమల్ని అంత ప్రేమించే మీ భార్య మోసం చేసిందని అంటే ఎలా నమ్మారని అడుగుతుంది. ఇక మనీషా దేవయానిని బయటకు తీసుకొచ్చి లక్ష్మీ గురించి ప్రస్తావించి నందుకు క్లాస్ ఇస్తుంది. ఫుల్లుగా సీరియస్ అయిపోతుంది. మీ కొడుకు పెళ్లి అయితే సరిపోతుందా నా పెళ్లి అవ్వొద్దా అని అడుగుతుంది. 

మరోవైపు జాను, వివేక్‌లు కలిసి ప్రదక్షిణలు చేస్తారు. నిన్నూ నన్ను కలపడానికే ఆ దేవుడు ఇలా చేస్తున్నాడని వివేక్‌తో జాను చెప్తాడు. సంయుక్త వాళ్ల దగ్గరకు వచ్చి దేవుడ్ని గట్టిగా కోరుకోమని మీ పెళ్లి జరగుతుందని అంటుంది. ఇంతలో జున్ను వాళ్లు వస్తారు. లక్కీ సంయుక్తతో జున్ను వాళ్లు వచ్చారు జున్ను వాళ్ల అమ్మని పరిచయం చేస్తా రండి ఆంటీ అని లక్కీ అంటుంది. జున్ను దగ్గరకు వచ్చి అమ్మ రాలేదా అని అంటుంది. ఆఫీస్ నుంచి వస్తుందని అంటే లక్కీ తన అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇంతలో లక్ష్మీ లక్కీ దగ్గరకు వస్తుంది. లక్కీ మాత్రం ఏదో జరుగుతుందని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్య మిస్సింగ్, బెనిఫిట్ తమకే అంటోన్న జ్యోత్స్న, విడాకులు కోరిన దీప!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget