అన్వేషించండి

Tillu Square: అనుపమతో డీజే టిల్లు మార్కు ఫ్లర్టింగ్ - ‘టికెటే కొనకుండా’ అంటూ వస్తున్న ‘టిల్లు స్క్వేర్’!

‘టిల్లు స్క్వేర్’ మొదటి పాట ‘టికెటే కొనకుండా’ జులై 26వ తేదీన విడుదల కానుంది.

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా గతేడాది విడుదల అయిన ‘డీజే టిల్లు’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా విడుదల అయి వసూళ్లలో పెద్ద సంచలనం సృష్టించింది. దాదాపుగా రూ.30 కోట్ల వరకు గ్రాస్‌ను సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా ప్రకటించారు. ‘టిల్లు స్క్వేర్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే క్యాస్ట్ పరంగా ఈ సినిమాలో చాలా మార్పులు చేశారు. హీరోయిన్ నేహా శెట్టి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ వచ్చి చేరింది.

ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను నిర్మాతలు జులై 26వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రోమో ద్వారా ప్రకటించారు. ప్రోమో విషయానికి వస్తే... వాష్ బేసిన్ దగ్గర అనుపమ పరమేశ్వరన్, సిద్ధు జొన్నలగడ్డ షూస్ క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అనుపమ పరమేశ్వరన్‌ని చూసి సిద్ధు ‘మనసు విరిగినట్లుంది ఎక్కడనో.’ అని కామెంట్ చేస్తాడు. వెంటనే అనుపమ సీరియస్‌గా చూస్తుంది. సిద్ధు నవ్వుతూ ‘ఉన్నడా బాయ్‌ఫ్రెండు’ అని అడుగుతాడు. అనుపమ ‘నీకెందుకు’ అని ఎదురు ప్రశ్నించినప్పుడు ‘ఉంటే నా షూ నేను వేసుకుని వెళ్లిపోతా.’ అంటాడు. అనుపమ ‘లేకపోతే’ అన్నప్పుడు ‘నిన్నేసుకుని వెళ్లిపోతా’ అని సమాధానం ఇస్తాడు. ‘ఇప్పుడే కద కలిశాం అప్పుడే ఫ్లర్ట్ చేస్తున్నావా?’ అని అనుపమ అడిగితే ‘ఓపెన్‌గా అంటే నేను చేస్తున్న సంగతి నీకు తెలియాలి కదా... లేకపోతే చేసి ఉపయోగం ఏం ఉంది?’ అంటాడు. వెంటనే మ్యూజిక్ వేసి ‘టికెటే కొనకుండా’ అంటూ సాగే పాటను జులై 26వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

‘డీజే టిల్లు’ సినిమాలో టైటిల్ సాంగ్ ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ పాటను రామ్ మిరియాల ట్యూన్ చేసి, ఆయనే పాడారు. అందుకే ‘టికెటే కొనకుండా’ పాటను కూడా రామ్ మిరియాలతోనే ట్యూన్ చేయించి, ఆయనతోనే పాడిస్తున్నారు. ‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్‌కు లిరిక్స్ అందించిన కాసర్ల శ్యామ్‌తోనే ఈ పాట కూడా రాయిస్తున్నారు.

మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

‘టిల్లు స్క్కేర్’ రిలీజ్ డేట్ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. సినిమా ప్రారంభం అయినప్పుడు 2023 మార్చిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆగస్టు 11వ తేదీన విడుదల కానుందని వార్తలు వచ్చాయి. కానీ చిరంజీవి ‘భోళా శంకర్’ అదే రోజు రిలీజ్ కానుండటంతో సెప్టెంబర్ 15వ తేదీన రానున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ నుంచి షిఫ్ట్ అవుతుందని టాక్ వినిపిస్తుంది.

రామ్, బోయపాటిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టు ‘స్కంద’ అదే రోజు విడుదల కానుంది. దీంతోపాటు రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి 2’, విశాల్, ఎస్‌జే సూర్యల ‘మార్క్ ఆంటోని’ కూడా సెప్టెంబర్ 15వ తేదీన రానున్నాయి. ప్రస్తుతం అక్టోబర్ 6వ తేదీకి ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫస్ట్ సింగిల్ ప్రోమో, పోస్టర్‌లో కూడా విడుదల తేదీని తీసేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
Embed widget