అన్వేషించండి
Advertisement
Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' సెన్సార్ రివ్యూ!
'సర్కారు వారి పాట' సినిమా రన్ టైమ్ ను 2 గంటల 43 నిమిషాలకు సెట్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పోస్టర్స్, ట్రైలర్ విడుదల కాగా.. అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మే 12న సినిమాను విడుదల చేయబోతున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. రన్ టైమ్ ను 2 గంటల 43 నిమిషాలకు సెట్ చేశారు. ఈ సినిమాకి వచ్చిన సెన్సార్ రివ్యూ అభిమానులను ఖుషీ చేస్తోంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా బ్లాక్ బస్టర్ కంటెంట్ ఉందని.. క్లైమాక్స్ అయితే అద్భుతంగా వచ్చిందని తెలిపారు. యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.
సినిమాలో మహేష్ బాబు పెర్ఫార్మన్స్ అయితే అభిమానులకు ఐఫీస్ట్ అని.. తమన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సెన్సార్ సభ్యులు. మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. మహేష్ బాబు కెరీర్లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
పాలిటిక్స్
ప్రపంచం
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets