అన్వేషించండి

Shankar: 'వేల్పరి' నవలతో శంకర్ ప్లాన్, మూడు భాగాలుగా సినిమా - హీరో ఎవరంటే?

శంకర్ మరో భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

'బాహుబలి' సినిమా తరువాత సౌత్ నుంచి ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయి. దర్శకులు యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. సౌత్ లో ఉన్న అగ్ర దర్శకుల్లో శంకర్(Shankar) ఒకరు. ఇప్పటివరకు ఆయన ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు తీశారు. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్(Kamal Haasan)తో 'ఇండియన్2'(Indian2), రామ్ చరణ్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

ఈ సినిమాల తరువాత శంకర్ మరో భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తమిళ ఇతిహాస నవల 'వేల్పరి'ని వెండితెర మీదకు తీసుకురానున్నారు శంకర్. బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా దీన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. నిజానికి రణవీర్ సింగ్ తో 'అపరిచితుడు' రీమేక్ చేయాలనుకున్నారు శంకర్. 

కానీ ఇప్పుడు ఆయన ఆలోచన మారింది. 'వేల్పరి' నవలను తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఎవరూ తీయలేని విధంగా ఈ సినిమాను రూపొందించాలనుకుంటున్నారు. ఈ సినిమా ఒక విజువల్ వండర్ అవుతుందని టాక్. విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీగా ఖర్చు పెట్టబోతున్నారు. ఈ సినిమాతో యాక్షన్ సన్నివేశాల్లో ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేయాలనుకుంటున్నారు. 

'వేల్పరి' కథ చాలా పెద్దది. మొత్తం కథని ఒకే సినిమాలో చూపించడం కష్టమవుతుంది. అందుకే దీన్ని మూడు భాగాలుగా చిత్రీకరించాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు.. మరి దీనిపై అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి. ప్రస్తుతమైతే శంకర్ తను కమిట్ అయిన రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు.  

RC15 కోసం శంకర్ భారీ ఈవెంట్:

చరణ్ సినిమాకి సంబంధించి భారీ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు శంకర్. హైదరాబాద్ లేదా.. ముంబైలలో ఈ ఈవెంట్ జరగనుంది. దీనికి పాన్ ఇండియా లెవెల్ లో కొందరు గెస్ట్ లను తీసుకురాబోతున్నారు. ఇప్పటివరకు అయితే కన్నడ స్టార్ యష్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిథులుగా కన్ఫర్మ్ అయ్యారు. ఈ లిస్ట్ లో మరింత మంది జాయిన్ కానున్నారు. ఎవరూ ఊహించని రేంజ్ లో ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బయటకు రాకుండానే ఈ పాన్ ఇండియా సినిమా బిజినెస్ క్రేజీగా జరుగుతోంది. సినిమా ఓవర్సీస్ హక్కులను సుమారు రూ.15 కోట్లు పెట్టి దక్కించుకుంది ఓ సంస్థ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేట్రికల్ హక్కుల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు. 
 

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘ఆదిపురుష్’ విడుదల వాయిదా, తేదీ ప్రకటించిన ఓం రౌత్ - రీషూట్ కోసమేనా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ranveer Singh (@ranveersingh)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget