News
News
X

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

రాఖీ సావంత్ తల్లి జయ భేదా తుది శ్వాస విడిచారు. 73 జయ అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పించారు.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తల్లి జయ భేద చనిపోయారు. 73 సంవత్సరాల జయ ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. డోమెట్రియల్ క్యాన్సర్‌తో ఆమె గత కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని రాఖీ సావంత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “ఈ రోజు మా అమ్మ చనిపోయింది. నేను సర్వస్వం కోల్పోయినట్లు భావిస్తున్నాను. నువ్వు నన్ను వదిలేశావు. ఇకపై నా మాట ఎవరు వింటారు? ఎవరు నన్ను హగ్ చేసుకుంటారు? నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి? మిస్ యు అమ్మా” అంటూ తన బాధను వెల్లగక్కింది. ఈ మేరకు హాస్పిటల్ బెడ్ పక్కన కూర్చొని ఏడుస్తున్న వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసింది.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

జయ మృతి పట్ల బాలీవుడ్ సెలబ్రిటీల సంతాపం

రాఖీ సావంత్ వీడియో చూసి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. జయ మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జయ మరణం పట్ల నటుడు జాకీ ష్రాప్ స్పందించారు. “మా అమ్మానాన్న, సోదరుడిని కోల్పోయిన బాధ నీలోనూ కనిపిస్తోంది. వారి ఆత్మ ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది” అని వెల్లడించారు. రాఖీ సావంత్ తల్లి మరణంపై పవిత్ర పునియా, రష్మీ దేశాయ్, రిధిమా పండిట్, అంకిత్ తివారీ, నిషా రావల్, మనయతా దత్ సహా పలువురు నటీనటులు స్పందించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. భగవంతుడు అన్ని వేళలా  రాఖీ కుటుంబానికి అండగా ఉండాలని ఆకాంక్షించారు.    

ఓషివారా మున్సిపల్ క్రిస్టియన్ స్మశాన వాటికలో అంత్యక్రియలు

ఇక రాఖీ సావంత్ తల్లి జయ భేద అంత్య క్రియలు ఇవాళ (ఆదివారం) ముంబైలో జరిగాయి.  “నా ప్రియమైన తల్లి ఆకస్మిక మరణం పొందింది. ఈ విచారకర సమయంలో మీకు ఓ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఆమె కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని మీలో చాలా మందికి తెలుసు. ఆమె చనిపోయిందని చెప్పడానికి నేను చాలా విచారిస్తున్నాను. ఆమె అంత్య క్రియలు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతాయి. అంధేరి  వెస్ట్ ఓషివారాలోని మున్సిపల్ క్రిస్టియన్ స్మశాన వాటికలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం” అని తెలిపింది.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

ఎండోమెట్రియల్ క్యాన్సర్ తో జయ మృతి- దీపక్ నంజోషి

రాఖీ సావంత్ తల్లి జయ (73)  శనివారం రాత్రి 9 గంటలకు చనిపోయారని క్రిటికేర్ ఏషియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ దీపక్ నంజోషి తెలిపారు. "రాఖీ సావంత్ తల్లికి ఎండోమెట్రియల్ క్యాన్సర్ నాల్గవ దశలో ఉంది. ఇది మెదడు, ఊపిరితిత్తులు, కాలేయానికి వ్యాపించింది. ఆమెను 15 రోజుల క్రితం హాస్పిటల్ కు తీసుకొచ్చారు. ఆమెను ఇంతకుముందు మరొక ఆసుపత్రిలో చికిత్స చేశారు. వాళ్లు ఇక్కడకు రిఫర్ చేశారు" అని డాక్టర్ వెల్లడించారు.

Read Also: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

Published at : 29 Jan 2023 01:37 PM (IST) Tags: Rakhi Sawant Rakhi Sawant Mother Jaya Bheda Rakhi Sawant Mother Dead

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ

Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ

Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?

Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?

Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక

Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

టాప్ స్టోరీస్

TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

TSPSC Issue :   తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌