అన్వేషించండి

వెంకయ్యనాయుడుకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి అన్యాయం చేశారు : రజనీ కాంత్

రజనీకాంత్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు అంతగా ఇష్టం లేదని అన్నారు.

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంచి వాక్ చాతుర్యం కలిగిన నాయకుడు. ఆయన మాటలు అందర్నీ ఆలోచించేలా ఉంటాయి. విమర్శలకు, వివాదాలకు దూరంగా ఉండే నాయకుల్లో వెంకయ్య నాయుడు పేరు ముందు ఉంటుంది. అలాంటి నాయకుడిపై సూపర్ స్టార్ రజనీకాంత్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య నాయుడుకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు అంతగా ఇష్టం లేదని అన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో రజనీ అన్న మాటలు చర్చనీయాంశమైయ్యాయి. ఈ వార్త ప్రస్తుతం అటు రాజకీయంగానూ ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. 

ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇటీవల  చెన్నై లోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేసన్ రజతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అలాగే సూపర్ స్టార్ రజనీ కాంత్ ఇద్దరూ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ వెంకయ్యనాయుడు పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య నాయుడు కి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు అంతగా నచ్చలేదన్నారు. ఆయన ఇంకా కొన్ని రోజులు కేంద్ర మంత్రి పదవి లో కొనసాగి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచి నాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేశారు అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి గా ఉంటే బాగుండేదని, ఉప రాష్ట్రపతి పదవికి ఎలాంటి అధికారాలు ఉండవంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన రాజకీయంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారని, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త నుంచి రాజకీయాల్లోకి వచ్చి గొప్ప నాయకుడిగా ఎదిగారని అన్నారు. కేంద్ర మంత్రిగా, ఉప రాష్ట్రపతి గా చేసి ఆయన రాజకీయాల నుంచి త్వరగా దూరమయ్యారని వ్యాఖ్యానించారు. 

మూత్రపిండాల సమస్య వల్లే..

ఈ సందర్బంగా రజనీకాంత్ తాను రాజకీయాలకు ఎందుకు దూరం అయ్యారో చెప్పారు. తాను మూత్రపిండా సమస్య వల్లే రాజకీయాలకు దూరం అవ్వాల్సి వచ్చిందన్నారు రజనీ. తను చికత్స పొందుతున్నప్పుడే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నానని, అయితే డాక్టర్లు బహిరంగ సభల్లో పాల్గొనకూడదు అని చెప్పారని అందుకే తాను దూరంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ఇవన్నీ చెప్తే భయపడుతున్నాడు అంటారని అందుకే ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదని చెప్పుకొచ్చారు రజనీ. 

రజనీకాంత్ మంచి నటుడు: వెంకయ్య నాయుడు

ఇదే కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఈ సందర్బంగా సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి పలు వ్యాఖ్యలు చేశారాయన. రజనీ కాంత్ మంచి నటుడని అన్నారు. రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తారని తెలిసినపుడు వద్దని చెప్పానని అన్నారు. ఆరోగ్యం బాగుండాలంగే రాజకీయాలకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చానని చెప్పారాయన. ప్రజలకు సేవ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయని, రాజకీయాలు ఒక్కటే మార్గం కాదని చెప్పానన్నారు. అయితే తాను రాజకీయాల్లోకి వచ్చేవారిని నిరుత్సాహపరచడం లేదన్నారు. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని అన్నారు. రాజకీయాలకు యువత అవసరం చాలా ఉందన్నారు. క్రమశిక్షణ, అంకిత భావం, నిజాయితీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలన్నారు. అప్పుడే మంచి చేయగలమని చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Biker Trailer : రేస్ ఈజ్ రెస్పెక్ట్... వార్ ఆన్ వీల్స్ - శర్వానంద్ బైకర్ ట్రైలర్ వచ్చేసింది
రేస్ ఈజ్ రెస్పెక్ట్... వార్ ఆన్ వీల్స్ - శర్వానంద్ బైకర్ ట్రైలర్ వచ్చేసింది
Mrunal Thakur : చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ - గ్లోబల్ స్టార్‌తో స్టెప్పులేసే బ్యూటీ ఎవరో తెలుసా?
చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ - గ్లోబల్ స్టార్‌తో స్టెప్పులేసే బ్యూటీ ఎవరో తెలుసా?
Niharika Konidela : హీరోగా అకీరా ఎంట్రీ - మెగా డాటర్ నిహారిక కొణిదెల రియాక్షన్
హీరోగా అకీరా ఎంట్రీ - మెగా డాటర్ నిహారిక కొణిదెల రియాక్షన్
Anchor Suma : సుమ బర్త్ డే స్పెషల్ - రాజీవ్ కనకాల ట్వీట్ వైరల్... ఫేమస్ యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సుమ బర్త్ డే స్పెషల్ - రాజీవ్ కనకాల ట్వీట్ వైరల్... ఫేమస్ యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget