అన్వేషించండి

Khusbhu On Air India: చెన్నై ఎయిర్ పోర్టులో చేదు అనుభవం, ఎయిర్ ఇండియాపై ఖుష్బూ ఆగ్రహం

ప్రముఖ నటి ఖుష్భూకు చెన్నై ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. కాలి గాయంతో బాధపడుతున్న తనకు ఎయిర్ ఇండియా సిబ్బంది కనీసం వీల్ చైర్ అందించలేకపోయారని మండిపడ్డారు.

సినీనటి, రాకీయనాయకురాలు ఖుష్భూ, ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టులో తనకు కనీస సౌకర్యాలు కల్పించడంతో విఫలం అయ్యారంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఖుష్భూ కాలికి ఇటీవల గాయం అయ్యింది. ఇప్పటికీ గాయం పూర్తి స్థాయిలో నయం కాలేదు. అయినా, సినిమా, పార్టీ వ్యవహారాల నేపథ్యంలో నిత్యం ప్రయాణాలు కొనసాగిస్తూనే ఉన్నారు.  తాజాగా తను వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి ఉండటంతో చెన్నై ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అక్కడే తను అసలు సమస్య మొదలయ్యింది.

కనీసం వీల్ చైర్ లేదా?-ఖుష్బూ ఆగ్రహం

గాలి గాయంతోనే ఎయిర్ పోర్టులోకి వెళ్లారు. తనకు వీల్ చైర్ కావాలని ఎయిర్ ఇండియా సిబ్బందికి చెప్పారు. కానీ, అక్కడ వీల్ చైర్ అందుబాటులో లేదు. దీంతో చాలా సేపు ఆమె ఇబ్బంది పడ్డారు. అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ట్విట్టర్ వేదికగా తనకు జరిగిన చేదు అనుభవాన్ని వివరించారు. ఎయిర్ ఇండియా సంస్థకు కనీసం వీల్ చైర్ ఏర్పాటు చేసే స్థోమత లేదా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

ఖుష్బూకు క్షమాపణలు చెప్పిన ఎయిర్ ఇండియా

అక్కడ ఖుష్బూకు వీల్‌చైర్‌ అందుబాటులో లేదు. దీంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. తన అసంతృప్తిని ట్విట్టర్‌ ద్వారా వ్యక్తం చేశారు. అందులో ఎయిర్‌ ఇండియా సంస్థకు వీల్‌చైర్‌ ఏర్పాటు చేసే స్థోమత లేదా? అంటూ ప్రశ్నించారు. “ఎయిర్ ఇండియా దగ్గర బేసిక్ వీల్ చైర్ లేదా? నేను కాలి నొప్పితో వీల్ చైర్  కోసం సుమారు అరగంట పాటు వెయిట్ చేశాను. ఆ తర్వాత వేరే విమాన సంస్థ నుంచి వీల్‌ చైర్‌ తీసుకొచ్చి తనను లోపలికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరిస్తారని భావిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ఖుష్భూ కు జరిగిన ఇబ్బందికి చింతిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ సంఘటనపై నటి కుష్బూకు క్షమాపణ తెలుపుతూ ట్విట్ చేసింది. ‘‘మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ విషయాన్ని చెన్నై విమాన నిర్వాహకులకు తెలియజేస్తాం’’ అని వెల్లడించింది.  

వరుస వివాదాల్లో ఎయిర్ ఇండియా

గత కొంత కాలంగా ఎయిర్ ఇండియా సంస్థ పలు వివాదాల్లో చిక్కుకుంటోంది. ప్రయాణికురాలిపై తోటి ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన సంఘటన సంచలనం కలిగించింది. గత ఏడాది నవంబర్‌ 26న నూయ్కార్‌ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో శంకర్‌ మిశ్రా తనపై మూత్ర విసర్జన చేశాడని బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఎయిర్‌ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ).  గత ఏడాది పారిస్‌- ఢిల్లీ విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలను రిపోర్ట్‌ చేయనందుకుగానూ ఎయిర్‌ ఇండియాకు డిజిసిఎ రూ.10 లక్షల జరిమానా విధించింది. డిసెంబరు 6న ఓ ప్రయాణీకుడు మద్యం మత్తులో వాష్ రూమ్ లో  పొగతాగుతూ  విమాన సిబ్బందికి పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు రూ.10 లక్షల జరిమానా పడింది. వారం వ్యవధిలోనే ఎయిర్‌ ఇండియా రెండుసార్లు జరిమానా కట్టాల్సి వచ్చింది. తాజాగా  ఎయిర్‌ ఇండియా విమానంలో వడ్డించిన భోజనంలో రాళ్లు వచ్చాయంటూ ఓ మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఎయిర్‌లైన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 8న ఈ ఘటన జరిగింది.   

Read Also: హ్యాపీ బర్త్ డే కామెడీ కింగ్, లెక్చరర్ టు టాప్ కమెడియన్ - బ్రహ్మానందం గురించి ఆసక్తికర విషయాలు మీకోసం!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Indian Railways: అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
Top Selling Hatchback: నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Embed widget