అన్వేషించండి

Mahesh Babu: దుబాయ్‌లో ఖరీదైన విల్లా కొనుగోలు చేసిన మహేశ్ బాబు?

తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్న ప్రిన్స్ మహేశ్ బాబు.. దుబాయ్ లో ఓ ఖరీదైన, విలాసవంతమైన విల్లా కొనుగోలు చేశారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mahesh Babu : సూపర్ మహేష్ బాబు విదేశీ టూర్లు గురించి మనకు తెలిసిందే. కొంచెం గ్యాప్ దొరికినా ఆయన విదేశాలకు చెక్కేస్తారు. ఇప్పుడు కూడా ఆయన పిల్లలతో హాలీడేస్‌ను ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఆయన గురించి ఓ బజ్ వైరల్ అవుతోంది. మహేష్ దుబాయ్‌లో ఏకంగా ఓ ఖరీదైన విల్లాను కొనేశారని, ఇకపై ఆయన ఖాళీ దొరికితే అక్కడే ఫ్యామిలీతో గడపనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై మహేశ్ బాబు గానీ, ఆయన కుటుంబసభ్యులు, ఆయన సన్నిహితులు గానీ ధృవీకరించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద చర్చ నడుస్తోంది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. మహేష్ బాబు దుబాయ్‌లోని సముద్ర తీర ప్రాంతంలో ఒక ప్రముఖ బిల్డర్ నుంచి ఓ అద్భుతమైన విల్లాను కొనుగోలు చేశారట. ఈ విల్లా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉందని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి మహేష్ బాబు దుబాయ్ వెళ్ళినట్లు సమాచారం. దీనికి రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విల్లా ఖరీదు ఎంతనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. విల్లా ఉన్న ప్రాంతం, బిల్డర్ కు ఉన్న పాపులారిటీని బట్టి చూస్తే మహేశ్ బాబు.. ఈ విల్లా కోసం భారీగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 

భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన స్టార్ హీరోస్ ఇండియాలోని వివిధ ఆస్తులపై పెట్టుబడి పెట్టడం ఇప్పుడు సాధారణమే. కానీ విదేశాల్లోని ఆస్తులపై పెట్టుబడి పెట్టడం అనేది ఇటీవల ట్రెండవ్వుతోన్న సరికొత్త సంప్రదాయం. హిందీ, మలయాళ నటీనటులు ఇప్పటికే దుబాయ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. కొందరు క్రీడాకారులు కూడా అక్కడ కోట్లు విలువ చేసే విల్లాలను కొనుగోలు చేశారు. చెప్పాలంటే.. మన ఇండియాలో ప్రతి సెలబ్రిటీ అక్కడ ఏదో ఒక చోట ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నటీనటులతో పోల్చితే.. టాలీవుడ్ నుంచి దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టిన సెలబ్రిటీలు చాలా తక్కువే. అందుకే, మహేష్ బాబుకు అక్కడ విల్లాను కొనుగోలు చేస్తున్నరనే సమాచారం అంతగా వైరల్ అవుతోంది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో మహేష్ బాబు ఒకరు. అంతే కాదు ఇప్పటికే భారీ ఫాలోయింగ్‌ను మూటగట్టుకున్న ఆయన.. విపరీతమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇటీవలే ఆయన నటించిన 'సర్కారు వారి పాట' ఘనవిజయం సాధించగా.. ప్రస్తుతం డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్ బాబు ఏకంగా రూ. 65 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇది అతని మునుపటి రెమ్యూనరేషన్ కన్నా రూ. 50 కోట్లు ఎక్కువ అని సమాచారం.

ప్రస్తుతం మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజా సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. మహేష్ తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 11న టైటిల్ అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ కాగా... ఎఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు. 

Read Also: లగ్జరీ కార్లు, ఖరీదైన బైకులు, అజిత్ లైఫ్ స్టైల్ చూస్తే ఆశ్యర్చపోవాల్సిందే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget