అన్వేషించండి

Mahesh Babu: దుబాయ్‌లో ఖరీదైన విల్లా కొనుగోలు చేసిన మహేశ్ బాబు?

తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్న ప్రిన్స్ మహేశ్ బాబు.. దుబాయ్ లో ఓ ఖరీదైన, విలాసవంతమైన విల్లా కొనుగోలు చేశారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mahesh Babu : సూపర్ మహేష్ బాబు విదేశీ టూర్లు గురించి మనకు తెలిసిందే. కొంచెం గ్యాప్ దొరికినా ఆయన విదేశాలకు చెక్కేస్తారు. ఇప్పుడు కూడా ఆయన పిల్లలతో హాలీడేస్‌ను ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఆయన గురించి ఓ బజ్ వైరల్ అవుతోంది. మహేష్ దుబాయ్‌లో ఏకంగా ఓ ఖరీదైన విల్లాను కొనేశారని, ఇకపై ఆయన ఖాళీ దొరికితే అక్కడే ఫ్యామిలీతో గడపనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై మహేశ్ బాబు గానీ, ఆయన కుటుంబసభ్యులు, ఆయన సన్నిహితులు గానీ ధృవీకరించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద చర్చ నడుస్తోంది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. మహేష్ బాబు దుబాయ్‌లోని సముద్ర తీర ప్రాంతంలో ఒక ప్రముఖ బిల్డర్ నుంచి ఓ అద్భుతమైన విల్లాను కొనుగోలు చేశారట. ఈ విల్లా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉందని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి మహేష్ బాబు దుబాయ్ వెళ్ళినట్లు సమాచారం. దీనికి రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విల్లా ఖరీదు ఎంతనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. విల్లా ఉన్న ప్రాంతం, బిల్డర్ కు ఉన్న పాపులారిటీని బట్టి చూస్తే మహేశ్ బాబు.. ఈ విల్లా కోసం భారీగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 

భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన స్టార్ హీరోస్ ఇండియాలోని వివిధ ఆస్తులపై పెట్టుబడి పెట్టడం ఇప్పుడు సాధారణమే. కానీ విదేశాల్లోని ఆస్తులపై పెట్టుబడి పెట్టడం అనేది ఇటీవల ట్రెండవ్వుతోన్న సరికొత్త సంప్రదాయం. హిందీ, మలయాళ నటీనటులు ఇప్పటికే దుబాయ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. కొందరు క్రీడాకారులు కూడా అక్కడ కోట్లు విలువ చేసే విల్లాలను కొనుగోలు చేశారు. చెప్పాలంటే.. మన ఇండియాలో ప్రతి సెలబ్రిటీ అక్కడ ఏదో ఒక చోట ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నటీనటులతో పోల్చితే.. టాలీవుడ్ నుంచి దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టిన సెలబ్రిటీలు చాలా తక్కువే. అందుకే, మహేష్ బాబుకు అక్కడ విల్లాను కొనుగోలు చేస్తున్నరనే సమాచారం అంతగా వైరల్ అవుతోంది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో మహేష్ బాబు ఒకరు. అంతే కాదు ఇప్పటికే భారీ ఫాలోయింగ్‌ను మూటగట్టుకున్న ఆయన.. విపరీతమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇటీవలే ఆయన నటించిన 'సర్కారు వారి పాట' ఘనవిజయం సాధించగా.. ప్రస్తుతం డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్ బాబు ఏకంగా రూ. 65 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇది అతని మునుపటి రెమ్యూనరేషన్ కన్నా రూ. 50 కోట్లు ఎక్కువ అని సమాచారం.

ప్రస్తుతం మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజా సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. మహేష్ తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 11న టైటిల్ అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ కాగా... ఎఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు. 

Read Also: లగ్జరీ కార్లు, ఖరీదైన బైకులు, అజిత్ లైఫ్ స్టైల్ చూస్తే ఆశ్యర్చపోవాల్సిందే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget