By: ABP Desam | Updated at : 10 Oct 2021 06:11 PM (IST)
ప్రకాష్ రాజ్, మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు 3 గంటలకు ముగిసాయి. వాస్తవానికి ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటలకే ముగియాలి. కానీ, రిగ్గింగ్ ఆరోపణలు రావడంతో సుమారు గంటసేపు పోలింగ్ ఆపేశారు. కొంతమంది తారలు విమానాల్లో వస్తున్నారని, చేరుకోడానికి ఆలస్యమవుతుందని చెప్పడంతో 3 గంటల వరకు సమయాన్ని పొడిగించారు. మురళీ మోహన్, మోహన్ బాబు సమక్షంలో మధ్యాహ్నం 3.30 నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది.
ఈసారి గతంలో ఎన్నడూ లేనంతగా ఓట్లు పోలైనట్లు తెలిసింది. ‘మా’లో మొత్తం 905 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 883 మందికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంది. మరో 60 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తారు. ఆదివారం పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 605 ఓట్లు పోలయ్యాయి. వీటిని కలుపుకుంటే.. మొత్తం 665 ఓట్ల పడినట్లు లెక్క. గతంతో పోల్చితే.. ఈ సారి పోలింగ్ ఘననీయంగా పెరిగింది. 2019లో జరిగిన ఎన్నికల్లో 472 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అప్పట్లో అధ్యక్షుడిగా బరిలోకి దిగిన నరేష్కు 268 ఓట్లు దక్కాయి. ప్రత్యర్థి శివాజీ రాజాకు 199 ఓట్లు పడ్డాయి. దీంతో నరేష్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
కనిపించని స్టార్ హీరోలు: ఈ ఎన్నికలకు పలువురు స్టార్ హీరోలు దూరంగా ఉన్నారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, వెంకటేష్తోపాటు నితిన్ నాగచైతన్య, రానా తదితర హీరోలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి రాలేదు. ఇలియానా, అనుష్క రకుల్, హన్సిక, త్రిష తదితరులు కూడా ఓటు వేయలేదు. షూటింగులో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసినట్లు తెలిసింది.
ఇదీ మా చరిత్ర: తమిళనాడు నుంచి తెలుగు నేలపై అడుగుపెట్టిన సినీ రంగం కొన్నాళ్లు పెద్ద మనుషులు లేకుండానే సాగింది. టాలీవుడ్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఒక్క వేదిక కూడా ఉండేది కాదు. తమ మొరను వినే పెద్ద దిక్కు లేదా అంటూ కళాకారులు కుమిలిపోతున్న రోజుల్లో.. నేనున్నా అంటూ పుట్టిందే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) పుట్టింది. ఒకప్పుడు హూందాగా మొదలైన సేవలు.. ఆ తర్వాత లుకలుకలతో అంతర్గత కలహాలతో వర్గాలుగా విడిపోయారు. అయితే, ఇన్నాళ్లూ ఇంట్లోనే కొట్టుకున్న సభ్యులు.. ఇప్పుడు రోడ్డున పడ్డారు. పంతాలు, ఆదిపత్యం కోసం ఘన చరిత్రకు గ్రహణం పట్టిస్తున్నారు.
పోలీస్ డిపార్ట్మెంట్కు సాయం చేసేందుకు 1993లో తెలుగు తారలంతా విశాఖపట్నంలో క్రికెట్ ఆడి నిధులు సమకూర్చారు. అనంతరం విశాఖ నుంచి హైదరాబాద్కు విమానంలో తిరిగివస్తున్న సమయంలో చిరంజీవి, మురళీ మోహన్లకు మూవీ ఆర్టిస్టుల సమస్యలను తీర్చేందుకు ఒక సంఘం ఉంటే బాగుంటుందనే ఆలోచన కలిగింది. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సీనియర్ నటులతో చర్చించి.. ‘మా’కు జీవం పోశారు. 1993, అక్టోబరు 4వ తేదీన ‘మా’ అసోసియేషన్ ఏర్పాటైంది. సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ.. రెబల్ స్టార్ కృష్ణం రాజులను ముఖ్య సలహాదారులుగా ఎంపిక చేశారు. ఫిల్మ్ నగర్లోని రామానాయుడు నిర్మించిన సొసైటీ భవనంలోని ఓ గదిలో ‘మా’ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
Also Read: ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!
Also Read: మోనార్క్ Vs మంచు: ‘మా’ పోరుపై ఉత్కంఠ.. విజయావకాశాలు అతడికే ఎక్కువట!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్
Godse Movie Release Date: సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ మారింది!
Major Movie: 'మేజర్' నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ - విన్నారా?
Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు
Anil Ravipudi: ఎన్టీఆర్ తో సినిమా - అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత
LSG vs KKR: తొలి వికెట్కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు