అన్వేషించండి

Kangana Ranaut: రామ్ లీలా మైదానంలో రావణ దహణం, సరికొత్త చరిత్ర సృష్టించిన కంగనా రనౌత్, కానీ ఓ అపశ్రుతి!

ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో జరిగిన దసరా ఉత్సవాల్లో నటి కంగనా రనౌత్ కు అరుదైన గౌరవం దక్కింది. 50 ఏండ్లలో తొలిసారి ఓ మహిళ రావణ దహానాన్ని చేసింది. కానీ, ఓ అపశ్రుతి చోటు చేసుకుంది.

ప్రతి ఏటా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రధాన మంత్రి సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. దేశ ప్రధాని, రాష్ట్రపతి, లేదంటే ఎవరైనా సెలబ్రిటీ ఈ వేడుకల్లో పాల్గొని రావణ దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఈసారి వేడుకల్లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పాల్గొన్నారు.  50 ఏళ్ల చరిత్రలో ఓ మహిళా సెలబ్రిటీ రావణ దహనం చేయడం ఇదే తొలిసారి.  

రావణ దహనానికి ముందు అపశ్రుతి

రామ్ లీలా మైదానంలో రావణ దహనానికి ముందు చిన్న అపశ్రుతి జరిగింది. కంగనా రనౌత్ రావణ దహనం చేయడానికి కొద్ది సేపటి ముందు, రావణుడి దిష్టి బొమ్మ కింద పడింది. వెంటనే కమిటీ సభ్యులు అలర్ట్ అయ్యారు. వెను వెంటనే తిరిగి ప్రతిష్టించారు. ఆ తర్వాత ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కంగనా బాణం విసిరి రావణుడి బొమ్మను దహనం చేశారు.

కంగనాను ఎందుకు ఆహ్వానించారంటే?

వాస్తవానికి ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనాల్సి ఉంది. అయితే, 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయన చాలా బిజీగా ఉన్నారు. పార్టీ విజయం కోసం చేపట్టాల్సిన చర్యలపై పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కంగనా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు, తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించ నేపథ్యంలో,  ఈ సారి రావణ్ దహన్‌ కార్యక్రమానికి రామ్ లీల కమిటీ కంగనాను ఆహ్వానించింది. ఆమెతో పాటు మరికొందరు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.   

మహిళా బిల్లుకు మద్దతుగా రామ్ లీలా కమిటీ నిర్ణయం

గత నెలలో పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపుతూ కమిటీ కంగనాను ఆహ్వానించినట్లు లవ్ కుశ్ రామ్‌లీలా కమిటీ అధ్యక్షుడు సింగ్ తెలిపారు. “సినిమా స్టార్స్ తో పాటు రాజకీయ నాయకులు, ప్రతి ఏటా మా కార్యక్రమానికి వీఐపీలుగా వస్తుంటారు. గతంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు.  అజయ్‌ దేవగన్‌, జాన్‌ అబ్రహం కూడా వచ్చారు. గత సంవత్సరం  ప్రభాస్ రావణ్ దహన్ చేశారు. 50 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వేడుకలో తొలిసారి ఓ మహిళ రావణ్ దహన్ చేసింది. లవ్ కుశ్ రాంలీలా కమిటీ  మహిళలకు సమాన హక్కులను కోరుకుంటోంది. ప్రస్తుతం ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఇంకా వాళ్లు బాగా రాణించాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు దేశం, సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది" అని సింగ్ అభిప్రాయపడ్డారు.

సంతోషం వ్యక్తం చేసిన కంగనా

ఇక రావణ్ దహణ్ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల నటి కంగనా రనౌత్ సంతోషం వ్యక్తం చేసింది. “50 ఏళ్ల నుంచి వేడుక జరుగుతుంది. కానీ, రావణ్‌ దహన్‌ వేడుకను ఓ మహిళ చేయడం ఇదే మొదటిసారి. ఆ అవకాశం నాకు లభించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని చెప్పారు. ఇక కంగనా నటించిన ‘తేజస్‌’ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. సర్వేష్ మేవారా ఈ సినిమాను తెరకెక్కించారు. రోనీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read Also: మావారి కంటే ఆయనే బెస్ట్, దీపికా కామెంట్స్‌కు రణవీర్ షాక్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Embed widget