అన్వేషించండి

JD Chakravarthy: కషాయం పేరుతో విషం ప్రయోగం, జేడీ చక్రవర్తి హత్యకు కుట్ర!

నటుడు జేడీ చక్రవర్తి సంచలన విషయాలు వెల్లడించాడు. తనను చంపేందుకు స్లో పాయిజన్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. ఏకంగా 8 నెలల పాటు తన మీద విష ప్రయోగం జరిగిందన్నాడు.

జేడీ చక్రవర్తి గురించి పెద్దగా పరిచయం అసవరం లేదు. ఆర్జీవీ గ్యాంగ్ లో జేడీ ఒకరు. ఆయన తెరకెక్కించిన పలు సినిమాల్లో నటించాడు. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా ఎన్నో పాత్రల్లో కనిపించాడు. నేచురల్ యాక్టింగ్ తో తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఓటీటీలోకి అడుగు పెట్టాడు. పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు.

జేడీ చక్రవర్తిపై విష ప్రయోగం

కాసేపు జేడీ చక్రవర్తి సినిమాల గురించి పక్కన పెడితే, ఆయన మాట్లాడే మాటలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇంట్రెస్ట్ కలిగించేలా ఉంటాయి. ఆయన చెప్పే ప్రతి విషయం ఎదుటివారిలో క్యూరియాసిటీ కలిగిస్తాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తనపై హత్యాయత్నం జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను చంపేందుకు  స్లో పాయిజన్ ఇచ్చినట్లు చెప్పాడు. అదీ ఏకంగా 8 నెలల పాటు ఇచ్చారని చెప్పుకొచ్చాడు. “వాస్తవానికి నాకు ఎలాంటి బ్యాడ్ హాబిట్స్ లేవు. కొంత కాలంగా క్రితం నాకు ఉన్నట్టు ఉండి శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టం గా ఉండేది” అన్నారు.   

తన ఆరోగ్య సమస్య గురించి పలువురు డాక్టర్ల దగ్గరకు వెళ్లినా వాళ్లు ఏం తేల్చలేకపోయారని జేడీ చక్రవర్తి తెలిపారు. “తనకు ఆరోగ్య సమస్య తలెత్తగానే చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లాను. ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ చూపించుకున్నాను. అయినా, నా సమస్యకు పరిష్కారం దొరకలేదు. నా పరిస్థితి చూసి కష్టమే అన్నారు. అప్పుడు నా ఫ్రెండ్, నిర్మాత శేషురెడ్డి నాకు మంచి వైద్యం ఇప్పించారు.  డాక్టర్‌ నాగార్జున దగ్గరకు తీసుకెళ్లి నా సమస్య చెప్పారు. ఆయన పరీక్షలు నిర్వహించి డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నావు అడిని అడిగాడు. నాకు ఆ అలవాటే లేదని చెప్పాను. కానీ నాకు తర్వాత అర్థం అయ్యింది. నా శరీరంలోకి మత్తు పదార్థాలు ఎలా వెళ్లాయో” అని చెప్పారు.

కషాయం పేరుతో స్లో పాయిజన్

కషాయం పేరుతో తనకు స్లో పాయిజన్ ఇచ్చారని చక్రవర్తి తెలిపారు. “నేను ఎడిటింగ్‌ చేస్తున్న సమయంలో నాకు కషాయం తాగే అలవాటు ఉండేది. ఓసారి నాతో ఉన్న నిర్మాత ఖాసీం కషాయం తాగుతానని చెప్పాడు. సరే అని తనకు ఇప్పించాను. ఆ కషాయం తాగి తను ఆస్వస్థకు గురయ్యాడు. ఇదే విషయాన్ని కషాయం తయారు చేసిన వ్యక్తికి చెప్పాను. నీ కోసం తయారు చేసిన కషాయం వేరేవాళ్లు ఎందుకు ఇచ్చావని తిట్టాడు. చివరకు హాస్పిటల్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే, సుమారు 8 నెలల పాటు నా మీద విష ప్రయోగం జరిగింది. నేను రోజూ తీసుకున్న కషాయమే విషం అని వెల్లడి అయ్యింది. దాని కారణంగానే నాకు శ్వాస సంబంధ సమస్యలు వచ్చాయి. అయితే, విష ప్రయోగం చేసిన వ్యక్తులు ఎవరు? వారికి ఆ అవసరం ఏంటి? అనే విషయాన్ని మాత్రం జేడీ చెప్పలేదు.

ఫూల్స్ చేయడానికే విష ప్రయోగం కథ చెప్పాడా?

జేడీ చక్రవర్తి నిజానికి ఉన్న విషయాలకంటే, లేని వాటిని ఉన్నట్లుగా చెప్పడంలో దిట్ట. గతంలో తేజ పెళ్లి గురించి సంచనల విషయాలు చెప్పాడు. ఆయన ప్రేమ పెళ్లిలో సినిమాల్లో మాదిరి ట్విస్టులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ విషయం గురించి మాట్లాడిన తేజ, జేడీ చెప్పిన మాటలన్నీ అవాస్తవం అని తేల్చి చెప్పారు. అటు గతంలో ఓసారి తనకు హాలీవుడ్ డైరెక్టర్ స్పీల్ బర్డ్ ఓ సినిమాలో అవకాశం ఇచ్చాడని చెప్పాడు. అది కూడా జస్ట్ జనాలను ఫూల్స్ చేయడానికి చెప్పిందేనని కొద్ది రోజుల్లోనే అర్థం అయ్యింది. ఇప్పుడు చెప్పిన స్లో పాయిజన్ కథ కూడా అంతే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.    

Read Also: ‘కుదిరినప్పుడు రండి’ - ఏఏఏ సినిమాస్‌కు నాగబాబును ఆహ్వానించిన అల్లు అరవింద్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget