అన్వేషించండి

JD Chakravarthy: కషాయం పేరుతో విషం ప్రయోగం, జేడీ చక్రవర్తి హత్యకు కుట్ర!

నటుడు జేడీ చక్రవర్తి సంచలన విషయాలు వెల్లడించాడు. తనను చంపేందుకు స్లో పాయిజన్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. ఏకంగా 8 నెలల పాటు తన మీద విష ప్రయోగం జరిగిందన్నాడు.

జేడీ చక్రవర్తి గురించి పెద్దగా పరిచయం అసవరం లేదు. ఆర్జీవీ గ్యాంగ్ లో జేడీ ఒకరు. ఆయన తెరకెక్కించిన పలు సినిమాల్లో నటించాడు. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా ఎన్నో పాత్రల్లో కనిపించాడు. నేచురల్ యాక్టింగ్ తో తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఓటీటీలోకి అడుగు పెట్టాడు. పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు.

జేడీ చక్రవర్తిపై విష ప్రయోగం

కాసేపు జేడీ చక్రవర్తి సినిమాల గురించి పక్కన పెడితే, ఆయన మాట్లాడే మాటలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇంట్రెస్ట్ కలిగించేలా ఉంటాయి. ఆయన చెప్పే ప్రతి విషయం ఎదుటివారిలో క్యూరియాసిటీ కలిగిస్తాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తనపై హత్యాయత్నం జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను చంపేందుకు  స్లో పాయిజన్ ఇచ్చినట్లు చెప్పాడు. అదీ ఏకంగా 8 నెలల పాటు ఇచ్చారని చెప్పుకొచ్చాడు. “వాస్తవానికి నాకు ఎలాంటి బ్యాడ్ హాబిట్స్ లేవు. కొంత కాలంగా క్రితం నాకు ఉన్నట్టు ఉండి శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టం గా ఉండేది” అన్నారు.   

తన ఆరోగ్య సమస్య గురించి పలువురు డాక్టర్ల దగ్గరకు వెళ్లినా వాళ్లు ఏం తేల్చలేకపోయారని జేడీ చక్రవర్తి తెలిపారు. “తనకు ఆరోగ్య సమస్య తలెత్తగానే చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లాను. ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ చూపించుకున్నాను. అయినా, నా సమస్యకు పరిష్కారం దొరకలేదు. నా పరిస్థితి చూసి కష్టమే అన్నారు. అప్పుడు నా ఫ్రెండ్, నిర్మాత శేషురెడ్డి నాకు మంచి వైద్యం ఇప్పించారు.  డాక్టర్‌ నాగార్జున దగ్గరకు తీసుకెళ్లి నా సమస్య చెప్పారు. ఆయన పరీక్షలు నిర్వహించి డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నావు అడిని అడిగాడు. నాకు ఆ అలవాటే లేదని చెప్పాను. కానీ నాకు తర్వాత అర్థం అయ్యింది. నా శరీరంలోకి మత్తు పదార్థాలు ఎలా వెళ్లాయో” అని చెప్పారు.

కషాయం పేరుతో స్లో పాయిజన్

కషాయం పేరుతో తనకు స్లో పాయిజన్ ఇచ్చారని చక్రవర్తి తెలిపారు. “నేను ఎడిటింగ్‌ చేస్తున్న సమయంలో నాకు కషాయం తాగే అలవాటు ఉండేది. ఓసారి నాతో ఉన్న నిర్మాత ఖాసీం కషాయం తాగుతానని చెప్పాడు. సరే అని తనకు ఇప్పించాను. ఆ కషాయం తాగి తను ఆస్వస్థకు గురయ్యాడు. ఇదే విషయాన్ని కషాయం తయారు చేసిన వ్యక్తికి చెప్పాను. నీ కోసం తయారు చేసిన కషాయం వేరేవాళ్లు ఎందుకు ఇచ్చావని తిట్టాడు. చివరకు హాస్పిటల్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే, సుమారు 8 నెలల పాటు నా మీద విష ప్రయోగం జరిగింది. నేను రోజూ తీసుకున్న కషాయమే విషం అని వెల్లడి అయ్యింది. దాని కారణంగానే నాకు శ్వాస సంబంధ సమస్యలు వచ్చాయి. అయితే, విష ప్రయోగం చేసిన వ్యక్తులు ఎవరు? వారికి ఆ అవసరం ఏంటి? అనే విషయాన్ని మాత్రం జేడీ చెప్పలేదు.

ఫూల్స్ చేయడానికే విష ప్రయోగం కథ చెప్పాడా?

జేడీ చక్రవర్తి నిజానికి ఉన్న విషయాలకంటే, లేని వాటిని ఉన్నట్లుగా చెప్పడంలో దిట్ట. గతంలో తేజ పెళ్లి గురించి సంచనల విషయాలు చెప్పాడు. ఆయన ప్రేమ పెళ్లిలో సినిమాల్లో మాదిరి ట్విస్టులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ విషయం గురించి మాట్లాడిన తేజ, జేడీ చెప్పిన మాటలన్నీ అవాస్తవం అని తేల్చి చెప్పారు. అటు గతంలో ఓసారి తనకు హాలీవుడ్ డైరెక్టర్ స్పీల్ బర్డ్ ఓ సినిమాలో అవకాశం ఇచ్చాడని చెప్పాడు. అది కూడా జస్ట్ జనాలను ఫూల్స్ చేయడానికి చెప్పిందేనని కొద్ది రోజుల్లోనే అర్థం అయ్యింది. ఇప్పుడు చెప్పిన స్లో పాయిజన్ కథ కూడా అంతే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.    

Read Also: ‘కుదిరినప్పుడు రండి’ - ఏఏఏ సినిమాస్‌కు నాగబాబును ఆహ్వానించిన అల్లు అరవింద్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు

వీడియోలు

Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam
Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
Virat Kohli:విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
AP CM Chandrababu: పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
Guntur Latest News:గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
Embed widget