అన్వేషించండి

49 లక్షల బడ్జెట్, 2 వేల కోట్ల వసూళ్లు - బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మూవీ గురించి మీకు తెలుసా?

ఒక్కోసారి చిన్న చిత్రాలు అతి పెద్ద విజయాలను అందుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి సినిమా గురించే. కేవలం రూ. 49 లక్షలతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 2 వేల కోట్లు వసూళు చేసింది.

సినిమా పరిశ్రమలో కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతాయి. వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ గా మిగులుతాయి. తక్కువ బడ్జెట్ తో తీసిన చిత్రాలు వందల కోట్ల రూపాయలు వసూళు చేసిన సందర్భాలు ఉన్నాయి. బడ్జెట్ ఎంత అనేదానికంటే కంటెంట్ లో దమ్ముంటే, బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపడం ఖాయం. అలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఓ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్లను సాధించింది. దిగ్గజ మేకర్స్ ను సైతం అబ్బుర పరిచింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో? దాని కథ ఏంటో? ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

‘ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్’ అద్భుతం

1990వ దశకంలో హారర్, థ్రిల్లర్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న సమయం అది. ఈ టైమ్ లో డేనియల్ మైరిక్, ఎడ్వార్డో సాంచేజ్ కలిసి ఓ సినిమాను తెరకెక్కించారు. దాని పేరు ‘ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్’.  సినిమా కథ ముగ్గురు యువకుల చుట్టూ తిరుగుతుంది. ఓ ప్రాజెక్టు పని మీద ఈ ముగ్గురు ఓ అటవీ ప్రాంతానికి వెళ్తారు. ఆ ముగ్గురు ఎమయ్యారో తెలియదు. వాళ్లు కనిపించకుండా పోయిన ఏడాదికి వారి కెమెరాలు దొరుకుతాయి. ఆ కెమెరాల్లో ఉన్న వీడియోల ద్వారా వారు ఏమయ్యారో తెలుస్తుంది. అదే సినిమా కథ. హీతర్ డేన్యూ, మైఖేల్ విలియమ్స్, జోషువా లియోనార్డ్  అద్భుత నటనతో ఆకట్టుకున్నారు.    

రూ. 49 లక్షల బడ్జెట్, రూ. 2 వేల కోట్ల వసూళు  

‘ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్’ చిత్రాన్ని 1999 జనవరి 23న సండెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించారు. ఆ తర్వాత  జూలై 14న న్యూయార్క్ లో విడుదల చేశారు. జూలై 30న అమెరికా అంతటా విడుదల అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభించింది.  రూ. 49 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం రూ. 2 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అమెరికాతో పాటు పలు దేశాల్లో విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుత ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా అందుకున్న విజయాన్ని చూసి హేమాహేమీ దర్శక నిర్మాతలే ఆశ్చర్యపోయారు. చక్కటి కథ ఉంటే ప్రేక్షకులు సినిమాలను అద్భుతంగా ఆదరిస్తారు అనేందుకు ఈ చిత్రం ఓ ఉదాహారణగా చెప్పుకోవచ్చు.

అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో..

ప్రస్తుతం ‘ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్’ సినిమా ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. చూడని వాళ్లు చూడాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.

Read Also: అప్పుడు తండ్రి, ఇప్పుడు కూతురు - ఆత్మహత్యలపై విజయ్ ఆంటోని ఏం మాట్లాడారంటే?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Family Stars Season 2 - ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
Mahaprabhu Jagannath Release Date : మహాప్రభు జగన్నాథ్‌ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
మహాప్రభు జగన్నాథ్‌ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Gedela Raju OTT : రెండు ఓటీటీల్లో రఘు కుంచె కొత్త మూవీ - పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో రఘు కుంచె కొత్త మూవీ - పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Eknath Harika New House : కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget