అన్వేషించండి

Pushpa 2: 'పుష్ప 2' నుంచి డీఎస్పీని తప్పించిన బన్నీ - సుక్కు? లాస్ట్ మినిట్‌లో వస్తున్న తమన్?

Pushpa 2 Music Director: పుష్ప 2 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అంటే చిన్న పిల్లాడు సైతం దేవి శ్రీ ప్రసాద్ పేరు చెబుతారు. కానీ, ఇప్పుడు ఆయన బదులు వేరే సంగీత దర్శకుడు సినిమాను టేకప్ చేస్తున్నారని సమాచారం.

దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం లేని సుకుమార్ (Sukumar) సినిమాను ఊహించుకోలేం! లెక్కల మాస్టర్ నుంచి క్రియేటివ్ జీనియస్ వరకు సుక్కు పేరు తెచ్చుకోవడంలో డీఎస్పీ మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. అయితే, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని టాలీవుడ్ టాక్.‌ సుకుమార్ దర్శకుడిగా పరిచయమైన 'ఆర్య' నుంచి 'పుష్ప' వరకు అన్ని సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కానీ, 'పుష్ప 2' విషయానికి వచ్చేసరికి వేరొక సంగీత దర్శకుడు వచ్చారని యూనిట్స్ సన్నిహిత వర్గాల నుంచి వినపడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

దేవి శ్రీ బదులు తమన్ వస్తున్నారా? అజనీషా?
'పుష్ప' సినిమాలో పాటలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు... అందరికీ తెలుసు. ముఖ్యంగా సమంత సందడి చేసిన ప్రత్యేక గీతం 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ'తో పాటు 'శ్రీవల్లి', 'దాక్కో దాక్కో మేక' సైతం ప్రేక్షకులు చేత స్టెప్పులు వేయించింది. 'పుష్ప' సినిమాకు గాను దేవి శ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. అటువంటి డీఎస్పీని తీసి మరొక సంగీత దర్శకుడిని 'పుష్ప 2' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడానికి తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 

Thaman to compose the background music for Pushpa 2?: తమన్ లేదా అజనీష్ లోకనాథ్...‌‌ వాళ్ళిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయట. మ్యాగ్జిమమ్ తమన్ ఖరారు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. లేదంటే కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ రావొచ్చని అంటున్నారు. తెలుగులో సాయి దుర్గా తేజ్ 'విరూపాక్ష', 'మంగళవారం'తో పాటు కన్నడ హిట్స్ 'కాంతార', 'విక్రాంత్ రోణ'కు ఆయన మ్యూజిక్ అందించారు. 

అసలు దేవి శ్రీతో గొడవ ఎందుకు వచ్చింది?
దర్శకుడు, సంగీత దర్శకుడిగా కంటే సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ మధ్య స్నేహం ఎక్కువ. సినిమాలతో సంబంధం లేని, సినిమాలకు అతీతమైన బంధం వాళ్ళది. తాను కథ మాత్రమే చెబుతానని ఎటువంటి పాటలు కావాలి? ఎటువంటి నేపథ్య సంగీతం కావాలి? అనేది ఎప్పుడూ దేవి శ్రీకి చెప్పనని, తన కథకు అనుగుణంగా అద్భుతమైన బాణీలు, నేపథ్య సంగీతం ఇస్తాడని సుకుమార్ పలు సందర్భాలలో చెప్పారు. అటువంటి స్నేహితులు మధ్య 'పుష్ప 2' విషయంలో ఎందుకు గొడవ వచ్చింది? అనేది పరిశ్రమ వర్గాలకు సైతం అంతు పట్టని విషయం.

Also Read: సిటాడెల్ హనీ బన్నీ రివ్యూ: Amazon Prime Video ఓటీటీలో సమంత వెబ్ సిరీస్ - ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?


హైదరాబాద్ సిటీలో ఇటీవల దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ మ్యూజిక్ కాన్సర్ట్ కోసం రెండు వారాల కంటే ఎక్కువ సమయం కేటాయించడం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అలాగే దర్శకుడు సుక్కుకు నచ్చలేదట. పైగా దేవిశ్రీ చేసిన రీ రికార్డింగ్ బాలేదని చెప్పడంతో వాళ్ల మధ్య మనస్పర్థలు వచ్చాయని ఇండస్ట్రీ గుసగుస. 

తప్పనిసరి పరిస్థితుల్లో దేవి శ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసారని చెబుతున్నారు. ఆయన చేతిలో ఏమీ లేదని... గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలు నేపథ్యంలో సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో కొత్త సంగీత దర్శకుడు వచ్చి సినిమాను అర్థం చేసుకుని నేపథ్య సంగీతం ఇవ్వడం టఫ్ టాస్క్. రిజల్ట్ మీద అది ఎటువంటి ప్రభావం చూపుతుందో?

Also Read: కేతికా శర్మలో మరీ ఇంత అందమా... ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వైరల్ ఫొటోస్ చూశావా మామా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
UPSC IFS 2025: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
Chandrababu on Lokesh: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget