అన్వేషించండి

Prashant Varma: కృష్ణ కృష్ణా... 'గల్లా'పెట్టెలో డబ్బు గల్లంతు - ప్రశాంత్ వర్మకు, ‌బుర్రాకు అంత ఇవ్వడం వర్తేనా?

Devaki Nandana Vasudeva: సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందించిన సంగతి తెలిసిందే. ఆ కథకు ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా?

తెలుగు సినిమా చరిత్రలో‌ ఓ సినిమాకు మాటలు రాసినందుకు గాను కోటి రూపాయల పారితోషికం అందుకున్న మొదటి రచయితగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రికార్డ్ సృష్టించారు. మరి, ఓ కథకు రెండు కోట్లు అందుకున్న రైటర్ ఎవరో తెలుసా? ప్రశాంత్ వర్మ. అవును... 'దేవకీ నందన వాసుదేవ' చిత్రానికి కథ ఇచ్చినందుకు గాను ఆయనకు రెండు కోట్ల రూపాయల పారితోషికం అందిందని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖబర్. మరి అంత ఇవ్వడం వర్తేనా? అంటే...‌‌‌ కాదు వర్మ కాదు అంటోంది ఇండస్ట్రీ. 

హాలీవుడ్ ట్విస్ట్... మైథాలజీ టచ్...
ఇలా చేశావ్ ఏంటి ప్రశాంత్ వర్మ!
'దేవకీ నందన వాసుదేవ' విడుదలకు ముందు ప్రశాంత్ వర్మ కథ ఇచ్చిన సినిమా అంటూ విపరీతంగా ప్రచారం చేశారు. మైథాలజీ నేపథ్యంలో కంసుడు, కృష్ణుడు అంటూ సినిమా తీయడంతో జనాలలో కూడా ఆసక్తి ఏర్పడింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'హనుమాన్' సినిమా భారీ విజయం కూడా ఆయన మీద పబ్లిసిటీ చేయడానికి ఒక రీజన్ అయ్యింది. కట్ చేస్తే... సినిమా బిగ్గెస్ట్ మైనస్సుల్లో ఒకటిగా కథ కూడా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 

ప్రశాంత్ వర్మ రాసిన కథలో కొత్తదనం లేదు... ఒక్క ట్విస్ట్ తప్ప. తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఆమెను కష్టాల కడల నుంచి బయట పడేయడానికి యుద్ధం చేయడానికి సిద్ధమైన హీరోలను తెలుగు ప్రేక్షకులు చాలామంది చూశారు. ఈ సినిమా కూడా అంతే! అయితే, ఇటువంటి రొటీన్ రొట్ట కొట్టుడు కమర్షియల్ కథకు మైథాలజీ టచ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ... ఆ విషయంలో కూడా స్వేచ్ఛను తీసేసుకున్నారు. 

What happened to Monday అని 2017లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా వచ్చింది. హాలీవుడ్ సినిమాలో ట్విస్ట్ తీసుకుని, దానికి కృష్ణుడు - కంసుడు అంటూ తనకు తోచిన రీతిలో కథ రాసేశారు ప్రశాంత్ వర్మ. పురాణాల ప్రకారం కంసుడికి, కృష్ణుడు మేనల్లుడు అవుతాడు. కానీ ప్రశాంత్ వర్మ రాసిన కథలో కంస రాజు మేనకోడలిని కృష్ణ ప్రేమిస్తాడు. పురాణాలను తనకు నచ్చినట్టు మార్చేశారు. ఆ ఒక్క ట్విస్ట్ తప్ప సినిమా కథలో ఎగ్జైట్ చేసే పాయింట్ మరొకటి లేదు. దాంతో ఆయనకు రెండు కోట్లు ఇవ్వడం వర్త్ కాదు వర్మ అని ఇండస్ట్రీలో ఆఫ్ ది రికార్డ్ డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. ఈ తరహా కథలు అయితే 33 కాదు 3 ఉన్నా సరే ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తారనే విషయాన్ని ప్రశాంత్ వర్మ గమనించడం మంచిది. 

'దేవకీ నందన వాసు దేవ' చిత్రానికి కథ ఇచ్చినందుకు ప్రశాంత్ వర్మ రెండు కోట్ల రూపాయలు తీసుకుంటే... అగ్ర రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు రాసినందుకు కోటి రూపాయలు తీసుకున్నారు అని టాక్. కామెడీ టాక్ జబర్దస్త్ ఆటో రాంప్రసాద్ రాశారు. జబర్దస్త్ స్కిట్స్ కంటే ఘోరంగా ఉన్న ఆ పంచ్ డైలాగ్స్ పేలలేదు. అది పక్కన పెడితే... ఎమోషనల్ డైలాగుల్లో బుర్రా రాసినవి అర్థంకాక బుర్ర‌ పట్టుకున్నారు జనాలు. రైటర్లకే మూడు కోట్ల కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చిన ఈ సినిమాకు... మూడు కోట్ల రూపాయలలో 10% అంటే... 30 లక్షల కూడా మొదటి రోజు రాలేదు. ఆ మాటకు వస్తే థియేటర్లకు ఎదురు డబ్బులు కట్టారని, సినిమా చూసేందుకు జనాలు రాకపోయినా సరే రెంట్ కట్టాలి కనుక నిర్మాత చేత డబ్బులు వదిలాయని గుసగుస.

Also Readమహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు... మొదటి రోజే షోస్ క్యాన్సిల్, కలెక్షన్స్‌ అయితే మరీ ఘోరం

ఈ 'దేవకీ నందన వాసుదేవ' ఫలితం చూసిన తర్వాత ప్రశాంత్ వర్మతో పాటు హీరో అశోక్ గల్లా కూడా కళ్ళు తెరిచే కంటెంట్ ఉన్న కథలను జనాలకు అందించాలని గుర్తిస్తే మంచిది. లేదంటే మళ్లీ ఇటువంటి డిజాస్టర్లు వస్తాయి. దర్శకుడు అర్జున్ జంధ్యాల సైతం గురువు బోయపాటి తరహాలో యాక్షన్ సీన్లు తీయడం స్క్రీన్ మీద రక్తపాతాలు సృష్టించడం మానేసి... ఆడియన్స్ పల్స్ ఏమిటి? అనేది గమనించి సినిమాలు తీయడం ఉత్తమం. హీరోలు అందరికీ, కథలు అన్నింటికీ రక్తపాతాలు పనికి రావు.

Also Readదేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Embed widget