అన్వేషించండి
Advertisement
Simha Koduri: 'దొంగలున్నారు జాగ్రత్త' ఫస్ట్ లుక్ చూశారా?
హీరో 'దొంగలున్నారు జాగ్రత్త' అనే మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు హీరో శ్రీసింహ.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు శ్రీసింహ.. 'యమదొంగ' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమై.. 'మత్తువదలరా' సినిమాతో హీరోగా మారారు. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకొని తన టాలెంట్ నిరూపించుకున్నారు. ఆ తరువాత నటించిన 'తెల్లవారితే గురువారం' సినిమా ఏవరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇప్పుడు ఈ హీరో 'దొంగలున్నారు జాగ్రత్త' అనే మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్, గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో సతీష్ త్రిపుర అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈరోజు శ్రీసింహ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు.
రోడ్డు, మ్యాప్స్, కారు, సీసీ టీవీ కెమెరా వీటన్నింటీ మధ్య గట్టిగా అరుస్తూ కనిపించారు శ్రీసింహ. ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో తమిళనటుడు సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నారు. కాల భైరవ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తుండగా.. యశ్వంత్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఇక కీరవాణి తన సినిమా పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. తన కుమారుడి సినిమా కథల ఎంపిక విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఆయన ఓకే చేసిందేనట. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఓటీటీ-వెబ్సిరీస్
రాజమండ్రి
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets