(Source: Poll of Polls)
Prabhas: ప్రభాస్ మరో బాలీవుడ్ సినిమా ఒప్పుకున్నారా?
'ఆదిపురుష్' టీజర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర నిర్మాత భూషణ్ కుమార్.. ప్రభాస్ తో మరో సినిమా చేయబోతున్నట్లు చెప్పారు.

వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసేలా...
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... హిందీ ప్రేక్షకులలో ప్రభాస్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకు తగ్గట్టు దేశంలో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో 'ఆదిపురుష్' షోలు వేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇండియా మొత్తం మీద సుమారు 9,500 స్క్రీన్లు ఉన్నాయని చెప్పాలి. అందులో ఆరున్నర వేల స్క్రీన్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్లు! మిగతావి మల్టీప్లెక్స్లు. వాటిలో సుమారు ఎనిమిది వేల స్క్రీన్లలో 'ఆదిపురుష్' విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 'ఆదిపురుష్' రిలీజ్ డే (జనవరి 12న) 35,000 కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ ఇన్సైడ్ టాక్.
'ఆదిపురుష్'ను టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. హిందీలో 'తానాజీ' వంటి హిట్ సినిమా తీసిన ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు.
Also Read: 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్లో 'Disappointed' హ్యాష్ ట్యాగ్!
Also Read: ప్రభాస్, రామ్చరణ్లతో త్రివిక్రమ్ సినిమాలు - రివీల్ చేసిన నిర్మాత!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















