అన్వేషించండి

Daggubati Suresh Babu: టికెట్ ధరల పెంపుతో సినిమాలకు ప్రేక్షకులు దూరం - నిర్మాత సురేష్ బాబు ఏమన్నారు?

టికెట్ ధరల పెంపుకన్నా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ముఖ్యం అన్నారు నిర్మాత సురేష్ బాబు. ధరల పెంపు కారణంగా ప్రేక్షకులు సినిమాలకు దూరం అవుతున్నట్లు వెల్లడించారు.

Daggubati Suresh Babu About Ticket Prices: సినిమా టికెట్ల ధరల పెంపుపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు కీలక విషయాల వెల్లడించారు. సినిమా టికెట్ల ధర పెంపు కారణంగా చాలా మంది ప్రేక్షకులు సినిమాలకు దూరం అవుతున్నారని చెప్పారు. టికెట్ల ధరల పెంపుపై ఫోకస్ పెట్టడం కంటే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

తక్కువ ధర ఉంటేనే సామాన్యులు సినిమాలు చూస్తారు!

టికెట్ల ధరల పెంపు గురించి ఓ నేషనల్ మీడియా సంస్థ నిర్వహించిన ఎగ్జిబిటర్ల ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేష్ బాబు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. “తమిళనాడులో సినిమా టికెట్ల రేట్లు ఇప్పటికీ నియంత్రణలో ఉంటాయి. అక్కడ టికెట్ గరిష్ట ధర రూ. 190. తెలుగులోనూ ధరల పరిమితి ఉంది. కానీ, స్టార్ హీరోల సినిమాల టికెట్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం వేధిస్తుంది. ధరల పెంపు కారణంగా త్వరగా లాభాలు వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. అలా ధరలు పెంచడం మంచిదా? కాదా? అనే విషయంలో చాలా అభిప్రాయాలు ఉన్నాయి. టికెట్ ధర ఓసారి రూ. 500 ఉంటుంది. మరోసారి రూ. 100 ఉంటుంది. తక్కువ ధర ఉన్నప్పుడే సామాన్యులు సినిమాలు చూస్తారు. ఎక్కువ ధరల కారణంగా లాభాలు వస్తాయని భావించడం కంటే సామాన్యులు సినిమాలకు దూరం అవుతున్నారే విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని సురేష్ బాబు వెల్లడించారు.

Read Also: ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’లకు మైత్రీ క్రేజీ డీల్ - బాలీవుడ్‌లో ఇంక జాతరే!

ధరలు ఎక్కువగా ఉండకూడదు- సురేష్ బాబు

సినిమా టికెట్ల ధరలు ఎక్కువగా ఉండకూడదనేది తన అభిప్రాయం అన్నారు సురేష్ బాబు. “టికెట్ ధరలు ఎక్కువగా ఉండకూడదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ప్రజల కోసం చాలా ఖర్చుతో సినిమా తీస్తున్నాం. సినిమా అనేది ఒక అనుభవం. కానీ, ఇప్పుడు మనిషి ఆ అనుభవం ఆచరణీయమైనదేనా? అని ఆలోచిస్తున్నాడు. అందుకే, ఎక్కువ ధరలు పెట్టి థియేటర్లలో సినిమాలు చూడట కంటే, కొద్ది రోజులు ఆగితే ఓటీటీలో చూడవచ్చు అనే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే, ఇప్పటికైనా టికెట్ల ధరల పెంపు విషయంలో మేకర్స్ మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది” అని సురేష్ బాబు తెలిపారు.   

పెరుగుతున్న ధరలతో సినిమాలకు ప్రేక్షకులు దూరం

పెరుగుతున్న టికెట్ ధరల కారణంగా చాలా మంది ప్రేక్షకులు సినిమాలకు దూరం అవుతున్నారని పలువురు చిత్ర నిర్మాతలు అభిప్రాయపడ్డారు. ఓటీటీల విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో మున్ముందు సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా టికెట్ ధరల విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాణ ఖర్చులు తగ్గించుకుంటూనే ప్రేక్షకులకు టికెట్ ధరలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్ ప్రేక్షకులు సినిమాకు వచ్చినప్పుడే మౌత్ పబ్లిసిటీ పెరుగుతుందన్నారు. వీలైనంత వరకు మాస్ ప్రేక్షకులు సినిమాలకు వచ్చేలా చూసుకోవాలని మేకర్స్ కు సురేష్ బాబు సూచించారు.    

Read Also: మెగా వర్సెస్ నందమూరి వర్సెస్ అక్కినేని, ఈ సంక్రాంతి క్లాష్ తో బాక్స్ ఆఫీసు మోత మోగాల్సిందే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
FOMO: వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
Embed widget