అన్వేషించండి

రజినీకాంత్ వివాదంలో టాలీవుడ్ స్పందనేంటి? ఆయన బెస్ట్ ఫ్రెండ్ మౌనమేలా?

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో సీనియర్ హీరో రజినీకాంత్ ప్రసంగంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపై ఆయన చిరకాల మిత్రుడు మంచు మోహన్ బాబు సైలెంట్ గా ఉండటం హాట్ టాపిక్ గా మారింది.

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలతో కాకుండా ఇప్పుడు రాజకీయాలతో వార్తల్లో నిలిచారు. నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రజనీ.. లెజండరీ నటుడి గొప్పదనం గురించి మాట్లాడారు. అక్కడి వరకూ బాగానే ఉంది కానీ.. పనిలో పనిగా పక్కనే ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని విజనరీ లీడర్, విజన్ 2047తో ముందుకు సాగుతున్నాడంటూ పొగడ్తల వర్షం కురిపించడమే ఆయన్ను ఓ వర్గం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొనేలా చేసింది.  

విజయవాడ వేదికగా చంద్రబాబు గురించి రజినీ కాంత్ మాట్లాడిన మాటలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికారిక వైఎస్సార్ పార్టీ దారుణమైన విమర్శలు చేస్తోంది. ఆయన అలా మాట్లాడడంపై ఏపీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఏపీ రాజకీయాల గురించి ఏం తెలుసని.. పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడారని అన్నారు. రాజకీయాల గురించి మాట్లాడే అర్హత రజనీకి లేదని, ఎన్టీఆర్‌ కు చంద్రబాబు వెన్నుపోటు పొడవడంతో రజినీ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. 

చంద్రబాబు గురించి ఎన్టీఆర్ గతంలో మాట్లాడిన వీడియోలను రజినీకాంత్‌ కు పంపిస్తామని.. ఆయన వ్యాఖ్యలతో దివంగత ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. ఓ అడుగు ముందుకేసి రజినీ తమిళనాడులో హీరో కావొచ్చుగానీ ఇక్కడ కాదని.. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ నీతులు చెబితే వినే స్థితిలో తాము లేమంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. రజినీని విమర్శించిన వారిలో సినీ ఇండస్ట్రీకి చెందిన రోజా, పోసాని కృష్ణ మురళి వంటి వారు కూడా ఉన్నారు. రజినీ ప్రసంగంపై వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శలు చేస్తుంటే.. ఫ్యాన్స్ , టీడీపీ నాయకులు తలైవాకి మద్దతుగా నిలిచారు. అయితే ఈ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎవరూ స్పందించకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

రజినీకాంత్‌ పై విమర్శలు చేసినందుకుగాను, ఆయనకు వైకాపా నేతలు క్షమాపణలు చెప్పాలంటూ అభిమానులు ట్విటర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు. #YSRCPApologizeRajini అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో కామెంట్లు పెడుతూ ట్రెండ్ చేశారు. రజినీ ఎవరినీ కించపరచనప్పటికీ అలా ఎలా ట్రోల్ చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు సైతం వైఎస్సార్‌సీపీ విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంపై రజనీ చిన్న విమర్శ చేయకపోయినా, వైఎస్సార్‌సీపీ ఆయనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తోందన్నారు. సమాజంలో ఎంతో గౌరవం ఉండే లెజెండరీ పర్సనాలటీపై ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం బాధ కలిగిస్తుందని అన్నారు. అయితే ఇంత జరుగుతున్నా అటు కోలీవుడ్ ప్రముఖులు కానీ, ఇటు టాలీవుడ్ పెద్దలు కానీ ఈ వ్యవహారంపై స్పందించలేదు. రజినీకి చిరకాల మిత్రుడిగా చెప్పుకునే మోహన్ బాబు కూడా సైలెంట్ గా ఉన్నారేంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుకు రజినీకాంత్ కు మధ్య ఎన్నో ఏళ్ళ నుంచి మంచి అనుబంధం కొనసాగుతోంది. తమ మధ్య ఫ్రెండ్ షిప్ గురించి ఇద్దరూ అనేక సందర్భాల్లో వెల్లడించారు. అయితే ఇప్పుడు రజినీపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నా, మోహన్ బాబు మాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో తన స్నేహితుడికి డైలాగ్ కింగ్ ఎందుకు సపోర్ట్ గా నిలవలేదని.. అలా సైలెంట్ గా ఉండటంలో అర్థమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తన స్నేహితుడిని అంత దారుణమైన మాటలు అంటుంటే ఆయన ఎలా తట్టుకోగలుగుతున్నారని అంటున్నారు.

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో మంచు ఫ్యామిలీకి బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ కుటుంబానికి చెందిన విరానికా రెడ్డిని మంచు విష్ణు పెళ్లి చేసుకున్నాడు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున తండ్రీకొడుకులు ప్రచారం కూడా చేశారు. అందుకే ఇప్పుడు రజినీ వివాదంపై మోహన్ బాబు మౌనం వహిస్తున్నారని ఓ వర్గం నెటిజన్లు అంటున్నారు. ఈ విషయంపై మాట్లాడితే, పరోక్షంగా జగన్ ప్రభుత్వంపై వైసీపీ నాయకులపై కామెంట్స్ చేసినట్లు అవుతుందని నిశబ్దంగా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. మిగతా సినీ ప్రముఖులు సైతం ఈ కారణం చేతనే రజినీ కాంత్ వ్యవహారంలో స్పందించడం లేదనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఏపీ మంత్రుల నోటికి టాలీవుడ్ కూడా బెదిరిపోతోందని అర్థమవుతోంది. తోటి నటుడిపై దారుణమైన విమర్శలు చేస్తుంటే మద్దతుగా నిలిచే దమ్ము మన రీల్ హీరోలకు లేదంటూ నెటిజనులు విమర్శిస్తున్నారు.

Also Read: తెలుగులో ఏకైక సూపర్ స్టార్ చిరంజీవి - రజనీపై పోసాని సెటైర్లు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget