అన్వేషించండి

Viswam Teaser: శ్రీను వైట్ల మార్క్ కామెడీతో 'విశ్వం' టీజర్ - వైఎస్ జగన్‌ను వాడేసిన గోపీచంద్

Gopichand New Movie: గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న 'విశ్వం' సినిమా టీజర్ విడుదలైంది. వైట్ల మార్క్ కామెడీ, గోపీచంద్ యాక్షన్‌తో కూడిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

మాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా రూపొందుతున్న స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'విశ్వం' (Viswam Movie). శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్‌ అధినేత వేణు దోనేపూడితో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు. శ్రీను వైట్ల మార్క్ కామెడీ, గోపీచంద్ నుంచి ఆడియన్స్ ఆశించే యాక్షన్... రెండిటితో రూపొందిన ఈ టీజర్ ఎలా ఉందో ఓ లుక్ వేయండి. 

గీతా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప ఏమీ తెలియదు!
శ్రీను వైట్ల అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది 'వెంకీ' సినిమాలో ట్రైన్ సీక్వెన్స్. అందులో ఫన్ భలే ఉంటుంది. అటువంటి సీక్వెన్స్ 'విశ్వం' సినిమాలో ఉందని ఆయన ముందుగా చెప్పారు. 'ది జర్నీ ఆఫ్ విశ్వం' గ్లింప్స్‌లోనూ ట్రైన్ సీక్వెన్స్ గురించి హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ కామెడీ టీజర్‌లో కనిపించింది.

'నీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసా?' అని గోపీచంద్ అడిగితే... 'నాకు గీతా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప మరే ఆర్ట్స్ తెలియదు' అని వీటీవీ గణేష్ సమాధానం ఇచ్చారు. అక్కడ టైమింగ్ కుదిరింది. ఈ తరహా పంచ్ డైలాగులు సినిమాలో ఎన్ని ఉన్నాయో మరి!? టీజర్ మొత్తం మీద హైలైట్ అంటే వైఎస్ జగన్ డైలాగును గోపీచంద్ చెప్పడం. 'కొట్టారు... తీసుకున్నాం! రేపు మాకూ టైమ్ వస్తుంది. మేమూ కొడతాం' అని వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన డైలాగును హీరో చేత చెప్పించారు శ్రీను వైట్ల. విచిత్రం ఏమిటంటే... జగన్ అధికారంలో ఉన్నప్పుడు సినిమా మొదలైంది. ఆయన ప్రతిపక్షంలోకి వచ్చిన సమయంలో టీజర్ విడుదలైంది. 

గోపీచంద్ యాక్షన్ గురించి ఆడియన్స్ అందరికీ తెలుసు. అయితే, ఆ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ కొత్తగా కనిపించింది.  ఇందులో గోపీచంద్ సరసన కావ్య థాపర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

అక్టోబర్ 11న 'విశ్వం' విడుదల
Viswam Movie Release Date: టీజర్ విడుదల చేయడంతో పాటు 'విశ్వం' రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. అక్టోబర్ 11న థియేటర్లలోకి ఈ సినిమాను తీసుకు వస్తామని చెప్పారు. 

Also Read'బిగ్ బాస్ 8'లోకి కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ... హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్ బ్యాగ్రౌండ్ ఇదే


గోపీచంద్, కావ్య థాపర్, 'వెన్నెల' కిశోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కొల్లి సుజిత్ కుమార్ - ఆదిత్య చెంబోలు, కూర్పు: అమర్ రెడ్డి కుడుముల, రచయితలు: గోపీ మోహన్ - భాను అండ్ నందు - ప్రవీణ్ వర్మకళా దర్శకుడు: కిరణ్ కుమార్ మన్నె, ఫైట్ మాస్టర్: రవి వర్మ - దినేష్ సుబ్బరాయన్, నిర్మాణ సంస్థలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - చిత్రాలయం స్టూడియోస్, ఛాయాగ్రహణం: కేవీ గుహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, క్రియేటివ్ నిర్మాత: కృతి ప్రసాద్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సమర్పణ: దోనేపూడి చక్రపాణి, నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ - వేణు దోనేపూడి, దర్శకత్వం: శ్రీను వైట్ల.

Also Readకృష్ణకు పోటీగా 'బిగ్ బాస్ 8'లోకి వచ్చిన ముకుంద... మిస్ మైసూర్ to షో... యష్మీ గౌడ లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని విషయాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget