By: ABP Desam | Updated at : 23 Apr 2023 02:38 PM (IST)
Image Credit: Karthik Varma Dandu/Twitter
తెలుగు రాష్ట్రాల్లో ‘విరూపాక్ష’ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో ప్రేక్షకుల రెస్పాన్స్ను స్వయంగా చూసేందుకు థియేటర్కు వెళ్లిన ‘విరూపాక్ష’ సినిమా దర్శకుడికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది.
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ‘విరూపాక్ష’ మూవీ ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ షో నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ‘విరూపాక్ష’ టీమ్ సంబరాల్లో మునిగిపోయింది. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. సాయి ధరమ్ తేజ్ సెకండ్ ఇన్నింగ్స్కు ఆరంభం అదిరిందంటూ పండగ చేసుకుంటున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం సాయి ధరమ్ తేజ్, ‘విరూపాక్ష’ చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. ఇతర సెలబ్రిటీల నుంచి కూడా మాంచి రెస్పాన్స్ వస్తోంది. పాజిటివ్ టాక్ వల్ల కలెక్షన్లు కూడా బాగున్నాయి. రెండు రోజుల్లో రూ.10.58 కోట్ల వరకు వసూళ్లు సాధించింది ఈ మూవీ.
ప్రేక్షకుల రెస్పాన్స్ను స్వయంగా చూద్దామని దర్శకుడు కార్తీక్ వర్మ దండు శుక్రవారం నిర్మాత బీవీఎన్ఎస్ ప్రసాద్ కలిసి హైదరాబాద్లోని పలు థియేటర్లు చుట్టేశారు. ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన చూసి దర్శకనిర్మాతలిద్దరూ చాలా సంబరపడ్డారు. అయితే, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. గుర్తుతెలియని వ్యక్తి థియేటర్లో కార్తీక్ ఫోన్ కొట్టేశాడు. నిర్మాత పర్శు కూడా పోయిందని తెలిసింది. ఆ దీంతో కార్తీక్, ప్రసాద్ తలపట్టుకున్నారు. మరి, ఆ ఫోన్ దొరికిందా లేదా అనేది మాత్రం తెలియాలేదు. ఇప్పటివరకు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం. వీరిద్దరు ఐమాక్స్ థియేటర్తోపాటు సంధ్య, శ్రీరాములు థియేటర్లకు వెళ్లారు. దీంతో ఫోను, పర్శులు ఎక్కడ పోయాయనేది తెలియరాలేదు.
మేనల్లుడి తాజా సినిమా సక్సెస్ కావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. చిరంజీవి సతీమణి సురేఖ సాయి ధరమ్ తేజ్ కు కేక్ తినిపించి శుభాకాంక్షలు చెప్పింది. ‘విరూపాక్ష’కు పాజిటివ్ టాక్ రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రంతో ఆయన మళ్లీ హిట్ ట్రాక్ లో వెళ్లడం ఆనందంగా ఉందని తెలిపింది. “’విరూపాక్ష’ గురించి చక్కటి రిపోర్టులు వస్తున్నాయి. నేను వాటిని చూసి చాలా సంతోషంగా ఉన్నాను. సాయి ధరమ్ తేజ్ మంచి సక్సెస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చావు. మీ చిత్రాన్ని అందరూ అభినందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నీ సినిమాని ప్రేక్షకులు మెచ్చుకోవడంతో పాటు వారి ఆశీస్సులు అందించడం హ్యాపీ ఉంది. మీ మొత్తం టీమ్ కు హృదయ పూర్వక అభినందనలు” అని చిరంజీవి ట్వీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ‘విరూపాక్ష’ సక్సెస్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘‘డియర్ సాయి ధరమ్ తేజ్, ‘విరూపాక్ష’ గ్రాండ్ సక్సెస్ పట్ల హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అంటూ అభినందన లేఖ పంపించారు.
Also Read : సల్మాన్ మార్కెట్ పదేళ్ళు వెనక్కి - ఫస్ట్ డే మరీ ఇంత ఘోరమా!?
Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?
Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు
Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్లోకి కోరమాండల్ ఎక్స్ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్
Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?
Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?