![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Venu Swamy about NTR: ఎన్టీఆర్ జాతకంలో దోషం, 2030 వరకు ఆ పని చేయకూడదు - వేణు స్వామి
Venu Swamy: స్టార్ జ్యోతిష్యుడు వేణు స్వామి.. ఎన్టీఆర్ జాతకం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందులో దోషం ఉందని, ఆ విషయం గురించి ఎన్టీఆర్ తల్లితో కూడా మాట్లాడానని అన్నారు.
![Venu Swamy about NTR: ఎన్టీఆర్ జాతకంలో దోషం, 2030 వరకు ఆ పని చేయకూడదు - వేణు స్వామి Venu Swamy reveals interesting things about ntr horoscope Venu Swamy about NTR: ఎన్టీఆర్ జాతకంలో దోషం, 2030 వరకు ఆ పని చేయకూడదు - వేణు స్వామి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/161cce66a45e2e33a94ab77f774ec9101703916515382802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Venu Swamy about NTR: సినీ సెలబ్రిటీలు జాతకాలను, జ్యోతిష్యాన్ని నమ్ముతారో లేదో తెలియదు కానీ.. వారి ఫ్యాన్స్ మాత్రం జాతకం పేరుతో వేణు స్వామి చెప్పే చాలా విషయాలను నమ్ముతారు. వేణు స్వామి అంటే ఒకప్పుడు మామూలు జ్యోతిష్యుడు అయ్యిండొచ్చు. కానీ గత కొంతకాలంగా కేవలం సినీ సెలబ్రిటీల పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి సంచలన విషయాలు బయటపెడుతూ.. స్టార్ జ్యోతిష్యుడు అయిపోయారు. ఇప్పటికే ఎన్టీఆర్ గురించి కూడా పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి.. తన జాతకంలోని దోషం గురించి చెప్పిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్పై వ్యాఖ్యలు..
నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సమయంలో వారిద్దరూ ఎక్కువకాలం కలిసి ఉండరని వేణు స్వామి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగానే వీరిద్దరూ కొన్నేళ్లకు విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ సమయంలో వేణు స్వామి ఇచ్చిన స్టేట్మెంట్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అప్పటినుండి ఎవరో ఒక సినీ సెలబ్రిటీపై ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు వేణు స్వామి. ఇప్పటికే ఎన్టీఆర్ గురించి కూడా పలుమార్లు మాట్లాడారు. ఇక తాజాగా ఎన్టీఆర్ తల్లిని తాను కలిశానని, తన జాతకంలో ఉన్న దోషం గురించి చర్చించానని వేణు స్వామి చెప్పిన మాటలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎవ్వరికీ తెలియదు..
వేణు స్వామి.. ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లినప్పుడు ఎన్టీఆర్ తల్లి శాలినిని కలిసినట్టు గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తారక్ జాతకంలో తాను గమనించిన పలు సంచలన విషయాలను ఆమెతో పంచుకున్నానని బయటపెట్టారు. అయితే తారక్ జాతకం తనకు పూర్తిగా తెలియకుండానే బాగుందని ఎలా చెప్తున్నారంటూ శాలిని ప్రశ్నించారట. అయితే ఎన్టీఆర్ జాతకం గురించి తనకు అన్నీ తెలుసని, ఆఖరికి జాతకంలో ఉన్న దోషం గురించి కూడా తనకు తెలుసని శాలినితో చెప్పారట వేణు స్వామి. ఆ విషయం వినగానే.. ఆ దోషం గురించి తనకు, ఎన్టీఆర్కు, సీనియర్ ఎన్టీఆర్కు తప్పా ఎవరికీ తెలియదని, తమకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయారట శాలిని.
జయలలిత జాతకంతో ఎన్టీఆర్ జాతకానికి పోలికలు..
ఇక ఎన్టీఆర్, జయలలిత జాతకాలు దాదాపు ఒకటే అని.. ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో రాణిస్తారని శాలినితో చెప్పారట వేణు స్వామి. కానీ 2030 వరకు తారక్ను రాజకీయాల్లోకి రానివ్వకండి అని తన తల్లికి సలహా ఇచ్చానని వేణు స్వామి బయటపెట్టారు. అయితే ఎన్టీఆర్ జాతకంలో దోషం ఉందని చెప్పారు కానీ ఆ దోషం ఏంటనే విషయాన్ని ఆయన బయటపెట్టలేదు. ఇంతకు ముందు కూడా ఎన్టీఆర్కు రాజయోగం పట్టబోతుంది అంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలను కూడా ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. కానీ తారక్ పుట్టుకలో, జాతకంలో ఉన్న దోషం ఏమయ్యిండొచ్చు అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జాతకంలోని దోషం గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read: కళ్యాణ్ రామ్ సినిమాకు కలెక్షన్లు తగ్గాయి, ఆ కామెంట్స్ ఫలితమేనా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)