అన్వేషించండి

Pawan Kalyan: పవన్ కోట్లలో ఒక్కడు... అప్పుడు త్రివిక్రమ్ చెబితే వైసీపీకి అర్థం కాలేదు, ఇప్పుడు ఘోరంగా బోల్తా కొట్టింది

ఏపీలో వైసీపీ ఘోర పరాజయం వెనుక పవన్ కళ్యాణ్ పోరాట పటిమ ఉంది. జగన్ సామ్రాజ్యాన్ని పాతాళానికి తొక్కేస్తానని చెప్పి అన్నంత పని చేశారు. ఆ రేంజ్ గురించి త్రివిక్రమ్ అప్పుడు చెబితే ఎవరికీ అర్థం కాలేదు.

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఘోర పరాజయం మూట కట్టుకుంది. ఐదేళ్ల క్రితం 151 నియోజకవర్గాలలో విజయం సాధించి అధికారంలో వచ్చిన ఆ పార్టీ... ఇప్పుడు సింగిల్ డిజిట్‌ కంటే ఒక్క సీటు ఎక్కువకు పరిమితం కావడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశ నిస్పృహలలోకి నెట్టే అంశం. గత ఎన్నికలకు, ఇప్పటికీ ఏం మారింది? అంటే... ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పాలి. వైసీపీ పరాజయంలో ఆయన పాత్ర ఎంతో ప్రముఖమైనది.

వైసీపీ కేర్ చెయ్యలేదు కానీ పవన్ గట్టి దెబ్బ కొట్టాడు
పదవిలో ఉన్న ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను ఎప్పుడూ కేర్ చెయ్యలేదు. ఆయన్ను ప్రత్యర్థిగా పరిగణించలేదు. ఆయనది తమ స్థాయి కాదన్నట్టు వ్యవహరిస్తూ వచ్చింది. పైగా, పవన్ వ్యక్తిగత జీవితాన్ని పలు సందర్భాల్లో హేళన చేస్తూ వచ్చింది. తమకు, టీడీపీకి మధ్య ఆటలో అరటి పండులా తీసేసింది. అదృష్టం బాలేనప్పుడు అరటి పండు తిన్నా సరే పన్ను ఇరుగుతుందని ఓ సినిమాలో డైలాగ్ ఉంది. పన్ను విరగడం కాదు... ఫ్యానుకు ఎన్నికల్లో పవర్ షాక్ తగిలింది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినది చేతల్లో చూపించారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు. టీడీపీ, బీజేపీని ఒక్కటి చెయ్యడం కోసం తమ పార్టీ సీట్లు కొన్నిటిని త్యాగం చేశారు. వైసీపీకి గట్టి దెబ్బ కొట్టారు.

పవన్ రేంజ్ త్రివిక్రమ్ అప్పుడే చెప్పారు...
కానీ వైసీపీతో పాటు చాలా మందికి అర్థం కాలేదు!
పవన్ కళ్యాణ్ ఆప్త మిత్రుల్లో దర్శకుడు త్రివిక్రమ్ ఒకరు. సినిమా వేడుకల్లో పవన్ గురించి ఆయన గొప్పగా చెబుతుంటే స్నేహితుడు కనుక తప్పక చెబుతున్నారని సరిపెట్టుకున్నారు కొందరు. అతిగా పొగుడుతున్నారని ట్రోల్స్ చేసిన జనాలు సైతం ఉన్నారు. అయితే... పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటనేది త్రివిక్రమ్ కొన్నేళ్ల క్రితం జరిగిన 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పారు.

''చెయ్యి ఎత్తగానే జనం ఆగిపోయే శక్తి ఎక్కడో కోట్లలో ఒక్కడికి ఇస్తాడు దేవుడు. ఇటు వైపు వెళ్ళమని చెయ్యి చూపిస్తే అక్కడ ఏముందని కూడా ఆలోచించకుండా పరుగు పెట్టి వెళ్లేంత ప్రేమ, అభిమానం సంపాదించుకునే శక్తి ఎక్కడో కోట్లలో ఒక్కడికి ఇస్తాడు. అలాంటి కోట్లలో ఒక్కడు... పేరు మీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు'' అని 'కాటమరాయుడు' వేడుకలో త్రివిక్రమ్ చెప్పారు. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూస్తే అది నిజమని నమ్మక తప్పదు. ఎందుకంటే...

ఏపీలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఆ సమయంలో ఓటమి చవి చూశాయి. తదనంతర పరిణామాల నేపథ్యంలో రెండు పార్టీల శ్రేణులు కలవడం అసాధ్యమని వైసీపీ భావించింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాపు సామాజిక వర్గానికి మాత్రమే నాయకుడిగా ప్రాజెక్ట్ చేసే ప్రయత్నాలు చేసింది. ముద్రగడ వంటి నాయకులను తమ పార్టీలో చేర్చుకుని పవన్ మీద విమర్శలు చేయించాయి. తద్వారా కాపు ఓటు బ్యాంకు పూర్తిగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి వెళ్లకుండా చేయవచ్చని పథకం రచించింది. తెలుగుదేశం పార్టీ అధినేత కమ్మ సామాజిక వర్గం కనుక రెండు వర్గాలు ఏకం కాకుండా చూడాలని చూసింది వైసీపీ. అయితే... తనపై నమ్మకం పెట్టుకుని ఓటు వేయమని పవన్ చేసిన విజ్ఞప్తిని ప్రజలు గౌరవించారు. మరోవైపు టీడీపీ నేతల నుంచి సహకారం లభించింది.

Also Readఅల్లు అర్జున్ రాంగ్ స్టెప్ వేసినందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా? 'పుష్ప 2'ను పవన్ ఫ్యాన్స్ చూస్తారా? మెగా మద్ధతు ఉంటుందా?

'ఆర్ఆర్ఆర్'లో రెండు సామాజిక వర్గాలకు చెందిన హీరోలు కలిసి నటించినా సరే, తామిద్దరం స్నేహితులమని చెప్పినా సరే సోషల్ మీడియాలో అభిమానులు మధ్య మాటల యుద్ధం తప్పలేదు. ఎన్నికలు వచ్చేసరికి ఆ మనస్పర్థలు పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా కూటమికి ఓటు వేసేలా చేశారు పవన్ కళ్యాణ్. ఆయన చెయ్యి ఎత్తి చెప్పిన మాటలకు ప్రజలు విలువ ఇచ్చారు. ఆయన మీద అభిమానంతో ఓట్లు వేశారు. అప్పుడు త్రివిక్రమ్ చెబితే వైసీపీకి అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఘోరంగా బోల్తా కొట్టింది.

Also Readజనసేనాని పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కంగ్రాట్స్ - ట్రోల్ చేస్తున్న మెగా & జనసేన ఫ్యాన్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
Womens Day Special: భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
Womens Day Special: భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
Nikhil Maliyakkal - Chinni Serial: 'చిన్ని' సీరియల్‌లో కావ్యతో పాటు నిఖిల్ కూడా... మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్
'చిన్ని' సీరియల్‌లో కావ్యతో పాటు నిఖిల్ కూడా... మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్
Indira Mahila Shakti: కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
Donald Trump: ఇప్పటికే బాగా ఆలస్యమైంది, మూడో ప్రపంచ యుద్ధం రావడం కన్ఫామ్: డొనాల్డ్ ట్రంప్
ఇప్పటికే బాగా ఆలస్యమైంది, మూడో ప్రపంచ యుద్ధం రావడం కన్ఫామ్: డొనాల్డ్ ట్రంప్
AP News: ఓర్వకల్లు నోడ్‌‌కు మహర్ధశ, హైదరాబాద్- బెంగుళూరు కారిడార్‌లో భాగం చేస్తూ నోటిఫికేషన్ జారీ
ఓర్వకల్లు నోడ్‌‌కు మహర్ధశ, హైదరాబాద్- బెంగుళూరు కారిడార్‌లో భాగం చేస్తూ నోటిఫికేషన్ జారీ
Embed widget