అన్వేషించండి

Poonam Kaur: వాళ్లకు మహిళలను వేధించడం అలవాటే - ‘జల్సా’ రూమర్లకు చెక్ పెట్టిన నటి పూనమ్ కౌర్!

గీతాంజలి మృతి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రంగుపులుముకుంది. ఆమె మరణానికి కారణం మీరంటే మీరంటూ టీడీపీ, వైసీపీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Poonam Kaur About Geethanjali Death: అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటీమణి పూనమ్ కౌర్. టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో పలు సినిమాల్లో నటించింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. నెమ్మదిగా సినిమాలకు దూరం అయ్యింది. సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ అయ్యింది. తరచుగా పలు వివాదాస్పద అంశాలను టచ్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో గీతాంజలి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో ‘జల్సా’ సినిమా వివాదంపైనా స్పందించింది.

ఏపీలో గీతాంజలి మృతిపై రాజకీయ దుమారం   

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గీతాంజలి అనే మహిళ మృతి సంచలనం అయ్యింది. కొద్ది రోజుల క్రితం ఆమెకు జగన్ సర్కారు ఆమెకు ఇంటి పట్టా అందజేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, జగన్ ప్రభుత్వంలో తన కుటుంబానికి చాలా మేలు జరిగిందని చెప్పుకొచ్చింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత గీతాంజలి చనిపోయింది. దీంతో ఆమె మృతి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తల దారుణమైన కామెంట్ల కారణంగానే ఆమె చనిపోయిందంటూ వైసీపీ టార్గెట్ చేసింది. ఆమె రైలు ప్రమాదంలో చనిపోతే, తమపై అభాండాలు వేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.

గీతాంజలికి న్యాయం జరగాలి!  

తాజాగా గీతాంజలి మరణంపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. గీతాంజలికి న్యాయం జరగాలని కోరారు. “అసలు ఆమె మరణం విషయంలో ఏం జరిగింది? గీతాంజలి ఎందుకు చనిపోయే పరిస్థితి వచ్చింది? ఓ పార్టికి చెందిన ఆన్‌ లైన్‌ ట్రోలర్స్‌ కారణంగానే ఆమె చనిపోయిందా? అనే విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి అమ్మాయిల మీద పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం ఓ పార్టీ వారికి అలవాటు. దయచేసి గీతాంజలి మృతికి కారణం అయిన వారిని కఠినంగా శిక్షించండి. ఆమె పిల్లలకు న్యాయం చేయండి” అని పూనమ్‌ ట్వీట్‌ చేసింది.

అవన్నీ కట్టు కథలే!

అటు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ తరచుగా ఘాటు విమర్శలు చేస్తుంది. అందుకే పవన్ అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తారు. అంతేకాదు, ‘జల్సా’ సినిమాలో అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఆమె వారిపై విమర్శలు చేస్తుందని ఆరోపించారు. తాజాగా ‘జల్సా’ ఆరోపణలపైనా ఆమె స్పందించారు. “అవన్నీ పుకార్లు మాత్రమే. నేను ఇంత వరకు సినిమా అవకాశాల కోసం ఎవరినీ అడుక్కోలేదు. కేవలం నటన మీదే ఆధారపడి లేను. ప్రత్యామ్నాయ జీవన మార్గాలు కూడా చూసుకున్నాను. నేను నటించిన సినిమాల కంటే వదులుకున్న సినిమాలే ఎక్కువ. కొంత మంది చేసే అర్థం లేని విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని తన అభిమానులను పూనమ్ కోరింది.

Read Also: అమిత్ షాతో ‘హనుమాన్’ టీం భేటీ, ఆ విషయం చర్చకు రాలేదట!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mouni Roy Divorce: డబ్బు వాడుకున్నాడు... మోసం చేశాడు... మౌనీ రాయ్ విడాకుల వెనుక కారణాలు అవేనా?
డబ్బు వాడుకున్నాడు... మోసం చేశాడు... మౌనీ రాయ్ విడాకుల వెనుక కారణాలు అవేనా?
Actor Ali: అలీ విశ్వరూపం... చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో కొత్త మూవీ షురూ
అలీ విశ్వరూపం... చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో కొత్త మూవీ షురూ
Nani Paradise: పుకార్లకు చెక్ పెట్టిన ప్యారడైజ్ టీమ్... గట్టిగా ఇచ్చిపడేసిన నాని & కో
పుకార్లకు చెక్ పెట్టిన ప్యారడైజ్ టీమ్... గట్టిగా ఇచ్చిపడేసిన నాని & కో
Sandigdham Movie: 'సందిగ్ధం'లో ఎంత మంది ఆర్టిస్టులున్నారో చూశారా? జబర్దస్త్ నుంచి ఎవరెవరున్నారంటే?
'సందిగ్ధం'లో ఎంత మంది ఆర్టిస్టులున్నారో చూశారా? జబర్దస్త్ నుంచి ఎవరెవరున్నారంటే?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget