అన్వేషించండి

Santhosham Film Awards: ఫోన్ స్విచాఫ్ చేసుకొని వెళ్లిపోయారు - సంతోషం అవార్డ్స్‌లో ఏం జరిగిందో బయటపెట్టిన టీఎఫ్‌సీసీ

గోవాలో నిర్వహించిన సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అయితే ఇందులో పూర్తిగా తన తప్పు లేదని తప్పుకున్న సురేష్‌పై టీఎఫ్‌సీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు విషయాన్ని బయటపెట్టింది.

Suresh Kondeti: మూవీ జర్నలిస్ట్ సురేష్ కొండేటి గోవాలో నిర్వహించిన సంతోషం అవార్డ్స్‌లో కన్నడ స్టార్లకు అవమానం జరిగిందంటూ వస్తున్న వార్తలపై సురేష్ క్లారిటీ ఇచ్చారు. అయితే, ఈ ఘటనపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ సీిరియస్ అయ్యింది. సురేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఖండించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్..
సురేష్ కొండేటి నిర్వహిస్తున్న సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌లో కన్నడ స్టార్లకు అవమానం జరగడంతో శాండిల్‌వుడ్ ఫ్యాన్స్ మొత్తం టాలీవుడ్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలుపెట్టారు. ఈ విమర్శలు టాలీవుడ్‌పై మాత్రమే కాదు.. మెగా ఫ్యామిలీపై, ఆఖరికి చిరంజీవి వరకు వెళ్లాయి. దీంతో ఫిల్మ్ ఛాంబర్‌కు కోపం వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమకు మచ్చ తీసుకొచ్చిన గోవాలోని సంతోషం అవార్డ్స్ నిర్వహణను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (టీఎఫ్‌సీసీ) ఖండించింది.

నిర్వహణ విషయంలో పొరపాట్లు..
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్ మాత్రం తన కుటుంబం వరకు ఈ కాంట్రవర్సీ రాకుండా జాగ్రత్తపడ్డారు. సంతోషం అవార్డ్స్ నిర్వహణ పూర్తిగా సురేష్ కొండేటి బాధ్యత అని అన్నారు. ఈ విషయానికి సంబంధించి టీఎఫ్‌సీసీ లేఖలను కూడా విడుదల చేసింది. టీఎఫ్‌సీసీ సెక్రటరీ కేఎల్ దామోదర్ ప్రసాద్ దీనిపై మాట్లాడుతూ..  అల్లు అరవింద్‌తో పాటు తెలుగు సెలబ్రిటీలు కూడా సంతోషం అవార్డ్స్‌లో పాల్గొన్నారని, నిజంగానే అక్కడ నిర్వహణ బాలేకపోవడంతో సెలబ్రిటీలు ఇబ్బంది పడ్డారని, తామే స్వయంగా ముందుకు వచ్చి పరిస్థితిని మామూలుగా చేసే ప్రయత్నం చేశామని అన్నారు. నిర్వహణ విషయంలో పొరపాట్లు జరగడం సహజమే అంటూ సురేష్ ఇచ్చిన వివరణలో పూర్తిగా నిజాలు లేవని అసలు ఏం జరిగిందన్న విషయాన్ని బయటపెట్టారు దామోదర్ ప్రసాద్.

ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్లిపోయారు..
కరెంటు విషయంలో నిర్వహకులకు పేమెంట్స్ ఇవ్వకపోవడంతో వారు కరెంటును కట్ చేస్తూ ఉన్నారని కేఎల్ దామోదర్ ప్రసాద్ బయటపెట్టారు. అలా జరుగుతున్న సమయంలోనే ఈవెంట్‌ను వదిలేసి సురేష్ కొండేటి ఎక్కడికో వెళ్లిపోయారని, సమస్యలు పరిష్కారం అవ్వకముందే.. గోవా నుంచి హైదరాబాద్ వచ్చేశారని అన్నారు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చిందని తెలిపారు. అందుకే అల్లు అరవింద్‌తో కలిసి అక్కడ పరిస్థితిని మామూలు చేసే ప్రయత్నం చేశారట. అవార్డ్స్ నిర్వహణ సరిగా జరగకపోవడంతో గోవా ప్రభుత్వం కూడా తెలుగు సినీ పరిశ్రమపై, తెలుగు ప్రజలపై ఆగ్రహంతో ఉన్నారని, దీని వల్ల భవిష్యత్తులో షూటింగ్స్ విషయంలో టాలీవుడ్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సందేహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు.

మా కుంటుంబంలో ఎవరికీ అతడు పీఆర్వో కాదు: అల్లు అరవింద్

చాలా వార్తా సంస్థలు సురేష్ కొండేటీ మెగా కుటుంబానికి పీఆర్వోగా వ్యవహరిస్తున్నారని రాయడంతో అల్లు అరవింద్ స్పందించారు. ‘‘అవార్డుల ఫంక్షన్‌ను ఈ సారి గోవాలో నిర్వహించాడు. ఏదో కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అయ్యాడు, చేయలేకపోయాడు. అక్కడికి వెళ్లినవారు ఇబ్బంది పడ్డారు. అయితే, మీడియా మా కుంటుంబానికి చెందిన వ్యక్తులకు పీఆర్ఓ అని రాస్తున్నారు. దీంతో మా పీఆర్ఓకు కాల్ చేసి ఆయన పీఆర్వో అని ఎప్పుడైనా చెప్పారా అని అడిగాను. ఎప్పుడైనా ఫొటోల కోసం, మరేదైనా సందర్భంలో ఆయన్ని కలిసినప్పుడు.. పీఆర్వో అని పేర్కోవడం కరెక్ట్ కాదు. అతను ఇండివిడ్యువల్‌గా ఏదో చేసుకున్నాడు. ఫెయిల్ అయ్యాడు. ఇతర భాషల వారికి కూడా ఇబ్బందులు కలిగాయి. వారు కూడా తెలుగు ఇండస్ట్రీని విమర్శిస్తున్నారు. అది ఒక వ్యక్తి చేసిన తప్పిదం. తెలుగు ఇండస్ట్రీలో మనుషులు ఇంతే అంటూ వారు మాట్లాడాన్ని చూసి బాధపడ్డాను. ఒక వ్యక్తి చేసిన దానికి ఎవరికో ఆపాదించడం మంచిది కాదు. ఆయన మాకుటుంబంలో ఎవరికీ పీఆర్ఓ కాదు. అది ఆయన పర్శనల్ ఫెయిల్యూర్. దాన్ని తెలుగు ఇండస్ట్రీ మీదకు తీసుకురావద్దని కోరుతున్నా’’ అని తెలిపారు. 

Also Read: వారిని ఘోస్ట్‌లా వెంటాడుతుంది, మీ పాదాలకు నమస్కరిస్తా - ‘యానిమల్’పై దర్శకుడిపై ఆర్జీవీ ప్రశంసలు

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget