అన్వేషించండి

Jatadhara Movie : మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు

Sudheer Babu : తనకు కృష్ణా నగర్ కష్టాలు తెలియకపోయినా ఫిల్మ్ నగర్ కష్టాలు తెలుసని హీరో సుధీర్ బాబు తెలిపారు. 'జటాధర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కెరీర్, సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

Sudheer Babu Speech In Jatadhara Pre Release Event : ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు మరో సూపర్ నేచరల్ థ్రిల్లర్ 'జటాధర'తో రాబోతున్నారు. శనివారం జరిగిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన తన కెరీర్, సినీ ప్రయాణం గురించి మాట్లాడారు. ఇన్నేళ్లలో తాను ఎప్పుడూ సూపర్ స్టార్ మహేష్ బాబు హెల్ప్ అడగలేదని అన్నారు.

ఎన్నో ఆడిషన్స్

తనను ఓ పాత్ర కోసం రిఫర్ చేయమని తాను ఎప్పుడూ ఎవరినీ అడగలేదని సుధీర్ బాబు తెలిపారు. తాను కృష్ణకు అల్లుడు, మహేష్‌కు బావగా ఉండడం గర్వకారణమని... అయితే, నా 20 సినిమాల్లో సక్సెస్, ఫెయిల్యూర్ వెనుక ఉన్న ఒకే ఒక్క రీజన్ తానేనని చెప్పారు. 'సినిమాలకు రికమెండ్ చేయాలని నేను ఎప్పుడూ నా బావ మహేష్ బాబును అడగలేదు. అందరిలాగే నేనూ ఆడిషన్ ఇచ్చాను. కృష్ణకు అల్లుడు, మహేష్‌కు బావగా ఉండడం ఓ గర్వకారణం. ఓ బాధ్యత.

ఒకానొక టైంలో నటుడు కావాలన్న కోరికను అణచివేయాలనుకున్నా. కానీ ఆగిపోకుండా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టా. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి ఆడిషన్ ఇచ్చాను. ముందు నాతో మాట్లాడిన వాళ్లు కాఫీ ఇచ్చి తర్వాత నో చెప్పేవారు. నాకు కృష్ణా నగర్ కష్టాలు తెలియకపోవచ్చు. కానీ ఫిల్మ్ నగర్‌లో బాధలు తెలుసు. బస్సులో ప్రయాణిస్తూ ఛాన్సెస్ కోసం తిరగడం తెలియకపోవచ్చు. కానీ కారులో కూర్చుని బాధపడడం తెలుసు. ఇది నేను సింపతీ కోసం చెప్పడం లేదు. అలా అనుకుంటే ఫస్ట్ సినిమా అప్పుడే చెప్పేవాడిని.' అని అన్నారు.

Also Read : అలా మొదలైంది... మా తొలి పరిచయం - అల్లు శిరీష్ నయనికల లవ్ స్టోరీ వెనుక నితిన్ వైఫ్

20 మూవీస్... బాధ్యత నాదే...

ఒక్క సినిమా ఛాన్స్ వస్తే చాలు అనుకున్న తాను... ఇప్పటివరకూ 20 సినిమాలు చేశానని చెప్పారు సుధీర్ బాబు. హిట్స్‌కు కానీ, ప్లాప్స్‌కు కానీ పూర్తి బాధ్యత తనదేనని అన్నారు. 'నన్ను అభిమానించే ఒక్కరి కోసమైనా కష్టపడి పని చేస్తా. ఫస్ట్ మూవీలో నా వాయిస్ బాగా లేదన్నారు. దీంతో రోజూ గంటల తరబడి వాయిస్ కల్చర్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నా. ఆ తర్వాత 'చొక్కా విప్పుతాడు, బాడీ చూపిస్తాడు' అనే కామెంట్స్ వచ్చాయి.

దాన్ని దృష్టిలో పెట్టుకుని 'సమ్మోహనం' తీస్తే... సాఫ్ట్ సినిమాలకు సెట్ అవుతాడన్న కామెంట్స్ వినిపించాయి. ఆ తర్వాత 'శ్రీదేవి సోడా సెంటర్' వంచి మాస్ మూవీ చేశా. బాలీవుడ్‌కు వెళ్లాను. విలన్ రోల్ చేశాను. మన నిర్మాతలైనా కాఫీ ఇచ్చారు. బాలీవుడ్‌కు వెళ్తే అది కూడా దొరకదనుకున్నా. కానీ, చాలా బాగా చూసుకున్నారు. అది హ్యాపీగా ఉంది.' అని చెప్పారు.

ఎవరినీ హెల్ప్ అడగలేదు

చాలాసార్లు ఇండస్ట్రీలో నెపోటిజం అనే మాటలు వినిపించాయని... మహేష్ బాబు నాకు బావ అయినా ఆయన్ను ఎప్పుడూ ఓ సినిమాకు రికమెండ్ చేయాలని ఎలాంటి హెల్ప్ అడగలేదని చెప్పారు సుధీర్ బాబు. 'ఏ నిర్మాతను ఒక్క రూపాయి ఎక్కువ అడగలేదు. ఏ దర్శకుడు ఈ ఫైట్ పెట్టండి. ఆ పాట పెట్టండి అని పుష్ చేయలేదు. అవకాశం విలువ నాకు తెలుసు. 20 సినిమాలు దాని సక్సెస్, ఫెయిల్యూర్ వెనుక ఒకే ఒక్కడు. అది కృష్ణ గారి అల్లుడు. మహేష్ బాబు బావ. అది నేనే.' అంటూ పేర్కొన్నారు.

ఇక, సుధీర్ బాబు, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ నేచరల్ థ్రిల్లర్ 'జటాధర'. తెలుగుతో పాటు హిందీ భాషల్లో ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Advertisement

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget