అన్వేషించండి

Sai Dharam Tej: ప్రమాదం తర్వాత మీడియాలో నాపై వచ్చిన ఆ వార్తలు చూసి చాలా నవ్వుకున్నా: సాయి ధరమ్ తేజ్

‘విరూపాక్ష’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మూవీ విశేషాలతో పాటు యాక్సిడెంట్ సమయంలో జరిగిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు. 

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. 2021 లో ఆయన హైదరాబాద్ లో ఆయన బైక్ యాక్సిడెంట్ కు గురయ్యారు. దీంతో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. చాలా రోజులు విరామం తర్వాత ఆయన మళ్లీ ‘విరూపాక్ష’ సినిమాలో నటించారు. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 21 న పాన్ ఇండియా లెవల్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మూవీ విశేషాలతో పాటు యాక్సిడెంట్ సమయంలో జరిగిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు. 

అతనికి నా నెంబర్ ఇచ్చి ఏ హెల్ప్ కావాలన్నా కాల్ చేయమని చెప్పాను: సాయి ధరమ్ తేజ్

తాను యాక్సిడెంట్ కు గురైనప్పుడు ఆ సమయంలో పక్కనే ఉన్న అబ్దుల్ సయ్యద్ అనే వ్యక్తి చూసి వెంటనే స్పందించాడని అన్నారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో డాక్టర్లు వెంటనే చికిత్స ప్రారంభించారని చెప్పారు. అందుకే తర్వాత అబ్దుల్ సయ్యద్ ను వెతికి థ్యాంక్స్ చెప్పానని అన్నారు. అలాంటి కష్ట సమయంలో మానవత్వంతో స్పందించి తనకు సాయం చేసిన అతనికి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే తన ఫోన్ నెంబర్ ను అబ్దుల్ కు ఇచ్చి ఎలాంటి అవసరం ఉన్నా ఫోన్ చేయమని చెప్పానని తెలిపారు. ఇప్పటికీ అతను తనతో టచ్ ఉన్నాడని చెప్పుకొచ్చారు. 

ఆ సమయంలో వాళ్ల క్రియేటివిటీ చూసి నవ్వొచ్చేది..

తాను యాక్సిడెంట్ కు గురైనపుడు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు రకరకాలుగా వార్తలు రాశారని అన్నారు. చాలా మంది తాను మందు తాగానని, డ్రగ్స్ తీసుకున్నానని రాశారని కానీ తనకు అలాంటి అలవాట్లు లేవని చెప్పారు. తాను ఎలా ఉంటాను అనేది తన ఇంట్లో, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ తెలుసని అన్నారు. ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియకుండా పబ్ కు వెళ్తున్నాడు అని వార్తల్లో రాసేశారని, కానీ తాను ఆ రోజు దేవ కట్టా ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్తున్నానని చెప్పారు. ఆ సమయంలో వాళ్ల క్రియేటివిటీ చూసి నవ్వొచ్చేదని చెప్పుకొచ్చారు. 

బైక్ రైడింగ్ అంటే ఇష్టం, హెల్మెట్ నన్ను కాపాడింది..

తనకు బైక్ రైడింగ్ అంటే ఇష్టమని అన్నారు సాయి ధరమ్ తేజ్. కార్ లు నడపడం కంటే బైక్ రైడ్ కే ఎక్కువ వెళ్తానని చెప్పారు. అందుకే ఆ రోజు కూడా  బైక్ మీద వెళ్లానని చెప్పుకొచ్చారు. బైక్ డ్రైవ్ చేస్తే ఆ కిక్ బాగుంటుందని కానీ అన్ని జాగ్రత్తలు తీసుకునే బైక్ ను డ్రైవ్ చేయాలని సూచించారు. తన విషయంలో కూడా హెల్మెట్ ఉండబట్టే తనకు ప్రాణాపాయం తప్పిందని అన్నారు. అందుకే ప్రతీ ఒక్కరూ బైక్ నడిపేటపుడు హెల్మెట్ తప్పనిసరి అని చెప్పారు. 

Read Also: ఛీ పాడు, ఇవేం ప్రకటనలు? దేశంలో దుమారం రేపిన వివాదాస్పద యాడ్స్ ఇవే - వీటిలో ఉన్న తప్పేంటి?

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget