అన్వేషించండి

Baahubali The Epic: 'బాహుబలి: ది ఎపిక్' రన్ టైంపై రూమర్స్ - భల్లాల దేవుడి రియాక్షన్ ఇదే

Rana Daggubati: 'బాహుబలి: ది ఎపిక్' రన్ టైంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో రూమర్స్ వస్తుండగా... రానా సైతం రియాక్ట్ అయ్యారు. మూవీ నిడివి ఎంత ఉన్నా తనకు ఆనందమేనన్నారు.

Rana Reaction On Baahubali The Epic Run Time: తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'బాహుబలి' మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసింది. ఈ హిస్టారికల్ ఎపిక్ రీ రిలీజ్ కాకుండా రెండు పార్టులను ఒకే పార్టుగా విడుదల చేస్తామని దర్శక ధీరుడు రాజమౌళి ప్రకటించినప్పటి నుంచీ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ మూవీ రన్ టైం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది.

4 గంటలా... 5 గంటలా...

ఈ మూవీ రన్ టైం 4 గంటలు కాదు 5 గంటలు అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కొందరు మీమర్స్ ట్రోలింగ్స్ కూడా చేశారు. తాజాగా... దీనిపై రానా రియాక్ట్ అయ్యారు. 'బాహుబలి' భల్లాల దేవుని పాత్రలో ఆయన అద్భుతమైన నటనతో మెప్పించారు. 'ఈ మూవీ రన్ టైమ్ ఎంత ఉన్నా నాకు చాలా ఆనందం. ఎందుకంటే ఈ ఏడాదిలో నేను ఏ మూవీలోనూ యాక్ట్ చేయకుండానే నాకు బ్లాక్ బస్టర్ రానుంది. నిడివి ఎంత అనేది నాకు కూడా క్లారిటీ లేదు.

కొందరు 4 గంటలు అంటున్నారు. ఇంకొందరు 5 గంటలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంత రన్ టైం ఉంటే చూస్తారా! అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. ఈ మూవీ రన్ టైం కేవలం రాజమౌళికి మాత్రమే తెలుసు. నాకైతే ఆయన ఏం చెప్పలేదు. ఆయన చెబితేనే రన్ టైం ఎంత అనేది తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ రన్ టైం క్లారిటీ రావొచ్చు.' అని స్పష్టం చేశారు.

త్వరలోనే రానా కొత్త మూవీ

ఇటీవల 'రానా నాయుడు 2' వెబ్ సిరీస్‌లో కనిపించారు రానా. ఓ వైపు నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఆయన నిర్మించిన 'కొత్తపల్లిలో ఒకప్పుడు' మూవీ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన... మంచి కథతో మూవీ రూపొందించామని అన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్ ట్రెండ్ అవుతోంది. తాను త్వరలోనే మరో కొత్త మూవీతో రాబోతున్నట్లు చెప్పారు. 

Also Read: అతనితో లవ్‌లో బ్యూటీ తాన్య రవిచంద్రన్ - లిప్ లాక్‌తో కన్ఫర్మ్ చేసేసిందిగా...

ప్రభాస్, రానా ప్రధాన పాత్రలో నటించిన 'బాహుబలి' రిలీజ్ అయి పదేళ్లు పూర్తైన సందర్భంగా ఈ మూవీని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే, ఇది రీ రిలీజ్ కాదని... రెండు పార్టులను ఒకే పార్టుగా మూవీని తీసుకొస్తున్నట్లు రాజమౌళి ప్రకటించారు. దీనికి 'బాహుబలి: ది ఎపిక్' అని పేరు పెట్టారు. ఫస్ట్ పార్ట్‌ను 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' అనే సస్పెన్స్‌తో ఎండ్ చేయగా... రెండో పార్ట్‌లో దానికి ఆన్సర్ రివీల్ చేస్తూ ముగించారు. ఇప్పుడు రెండు పార్టులు కలిపి వస్తుండడంతో ఏ సీన్స్ ఉంచుతారు? ఏ సీన్స్ తీసేస్తారు? అనేది ఆసక్తిగా మారింది.

ఇటీవలే ఈ మూవీ రన్ టైంపై నెట్టింట ఫన్నీ మీమ్స్ ట్రోలింగ్ కాగా... 'మేం మీ రోజంతా తీసుకోం. ఈ మూవీ ఓ థ్రిల్లింగ్ ఐపీఎల్ మ్యాచ్‌లా ఉంటుంది.' అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే, రన్ టైం ఎంతనే దాన్ని మాత్రం రివీల్ చేయలేదు. కొందరు మాత్రం మూవీ అలానే ఉంచేయాలని కట్ చెయ్యొద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అక్టోబర్ 31న 'బాహుబలి: ది ఎపిక్' ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget