అన్వేషించండి

Jithender Reddy Glimpse: ఉద్యమంతో ఒక తరాన్ని మేల్కొల్పిన నాయకుడి కథ

Rakesh Varre New Movie: 'ఉయ్యాల జంపాల', 'మజ్ను' ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో 'బాహుబలి', 'ఎవరికీ చెప్పొద్దు' ఫేమ్ రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి'. తాజాగా గ్లింప్స్ విడుదల చేశారు.

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విరించి వర్మ. రొమాంటిక్ లవ్ స్టోరీలు తీసిన ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'జితేందర్ రెడ్డి'. ఇందులో 'బాహుబలి'లో కీలక పాత్రతో పాటు 'ఎవరికీ చెప్పొద్దు'లో హీరోగా నటించిన రాకేష్ వర్రె టైటిల్ రోల్ చేశారు. ముదుగంటి క్రియేషన్స్ పతాకంపై ముదుగంటి రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలంగాణలో 1980వ కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన పొలిటికల్ డ్రామా ఇది. తాజాగా గ్లింప్స్ విడుదల చేశారు.

మిమ్మల్ని క్షమించడం అహింస కాదు... అధర్మం!
Jithender Reddy Glimpse Review: 'జితేందర్ రెడ్డి' గ్లింప్స్ విషయానికి వస్తే... ఓ  వ్యక్తి ఆత్మహత్యతో మొదలైంది. ఆ తర్వాత మరొకరి మరణాన్ని చూపించారు. అవి చూసిన ఓ బాలుడితో 'నీ ఉద్యమంతో ఒక తరాన్ని మేల్కొల్పాలి' అని సుబ్బరాజు చెబుతారు. పెరిగి పెద్దయిన తర్వాత ఆ బాలుడు ఏం చేశాడు? అనేది కథగా తెలుస్తోంది. 

'మిమ్మల్ని క్షమించడం అహింస కాదు... అధర్మం' అంటూ రాకేష్ వర్రె ఎవరినో షూట్ చేసే డైలాగుతో గ్లింప్స్ ఎండ్ చేశారు. అయితే... ఈ గ్లింప్స్ అంతటా కెమెరా వర్క్ హైలైట్ ఉందని చెప్పాలి. వీఎస్ జ్ఞానశేఖర్ ఒక మూడ్ సెట్ చేశారు. హీరో చేతికి రుద్రాక్ష మాల, రైతు ఉద్యమం, అన్నల పోరాటం కూడా టచ్ చేసినట్టు తెలుస్తోంది. మే 3న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

Also Read: 'ఫ్యామిలీ స్టార్' ఫస్ట్ రివ్యూస్ వచ్చేశాయ్ - 'దిల్' రాజు భార్య, విజయ్ దేవరకొండ తండ్రి సినిమా చూసి ఏమన్నారంటే?

'జితేందర్ రెడ్డి' సినిమా గురించి నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... ''ప్రజలు తెలుసుకోవాల్సిన చరిత్ర జితేందర్ రెడ్డి జీవితం. ఆయన గురించి తెలిసి ఈ సినిమా చేస్తానని విరించి వర్మ ముందుకు వచ్చారు. జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రె జీవించారు. మొదట షార్ట్ ఫిలిం చేయాలనుకున్నా. కానీ, జితేందర్ చేసిన మంచి, ప్రజలకు చేసిన సేవ తెలియాలని సినిమా చేశాం. భగత్ సింగ్, అల్లూరి తరహాలో సినిమా విడుదలైన తర్వాత జితేందర్ రెడ్డి కూడా ప్రజలకు గుర్తు ఉంటారు'' అని చెప్పారు. తాను పోలీసుగా పలు సినిమాల్లో నటించినా... ఈ సినిమాలో గుర్తుండిపోయే పోలీస్ రోల్ చేశానని నటుడు రవిప్రకాష్ చెప్పారు.

Also Readవిజయ్ దేవరకొండది బలుపా... పొగరా? కాన్ఫిడెన్సా? ఆయన బిహేవియర్ మీద డీటెయిల్డ్ అనాలసిస్

Jithender Reddy Glimpse: ఉద్యమంతో ఒక తరాన్ని మేల్కొల్పిన నాయకుడి కథ
హీరో రాకేష్ వర్రె మాట్లాడుతూ... ''నేను 'మిర్చి', 'బాహుబలి'తో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు దగ్గరయ్యా. 'ఎవరికీ చెప్పొద్దు'తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా. నన్ను ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ గారు రిఫర్ చేశారు. ఆయనతో పాటు నిర్మాత రవీందర్ రెడ్డి గారు, దర్శకుడు విరించి వర్మ, ఉమా & వాణి గారు లేకపోతే సినిమా లేదు. ఈ కథ నచ్చడంతో అప్పటికే ఓకే చేసిన రెండు సినిమాలు పక్కనపెట్టి ఈ సినిమా చేశా. ప్రేక్షకులు అందరికీ సినిమా నచ్చుతుంది'' అని చెప్పారు.


''గతంలో నేను చేసిన సినిమాలు హ్యూమర్ టచ్ ఉన్న లవ్ స్టోరీస్. హ్యూమరే కాదు, హ్యూమన్ ఎమోషన్స్, డ్రామా కూడా నాకు ఇష్టం. జ్ఞాన శేఖర్ గారు ఫోన్ చేసి 'ఒక కథ ఉంది. నువ్వు డైరెక్ట్ చేయాల'ని చెప్పారు. కథ వినడానికి వెళ్ళినప్పుడు బుక్ ఇచ్చి చదువుకోమన్నారు. కథ చదివా. జితేందర్ రెడ్డి గారిది పవర్ఫుల్ క్యారెక్టర్. నేను కూడా కొంత రీసెర్చ్ చేశా. అందరికీ నచ్చే చిత్రమిది'' అని చెప్పారు.


రాకేష్ వర్రే హీరోగా, రియా సుమన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో 'ఛత్రపతి' శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వాణిశ్రీ పొడుగు, సహ నిర్మాత: ఉమ రవీందర్, ఛాయాగ్రహణం: విఎస్ జ్ఞానశేఖర్, సంగీతం: గోపి సుందర్, నిర్మాణం: ముదుగంటి రవీందర్ రెడ్డి, దర్శకత్వం: విరించి వర్మ.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
YS Jagan: బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
YS Jagan: బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Embed widget