అన్వేషించండి

60 Crore Fraud Case: రూ.60 కోట్ల మోసం కేసులో బిపాసా, నేహా ధూపియా పేర్లు చెప్పిన రాజ్ కుంద్రా!

Raj Kundra: రాజ్ కుంద్రా 60 కోట్ల మోసం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ డబ్బులో కొంత మొత్తం బిపాసా, నేహా ధూపియాకు ఫీజుగా ఇచ్చానని చెప్పాడు..

Raj Kundra 60 Crore Fraud Case:   బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాపై నమోదైన రూ. 60 కోట్ల మోసం కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది, బాలీవుడ్ హీరోయిన్లు బిపాషా బసు, నేహా ధూపియాకు ఫీజుగా కొంత మొత్తం చెల్లించానిని వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చెప్పినట్టు సమాచారం. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW)కి ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన ఈ విషయం చెప్పారు.

సోర్సెస్ ప్రకారం.. ఈ కేసులో కొంత డబ్బును బిపాషా, నేహాకు ఫీజుగా చెల్లించానని కుంద్రా పేర్కొన్నారు. అయితే ఐదు గంటల పాటు జరిగిన విచారణలో ఆయన పలు కీలక అంశాలపై మౌనం వహించడంతో EOW మరింత లోతుగా ప్రశ్నించాలని యోచిస్తోంది.

నివేదికల ప్రకారం, శిల్పా శెట్టి, బిపాషా బసు, నేహా ధూపియా సహా నలుగురు హీరోయిన్ల అకౌంట్స్ లోకి నేరుగా కంపెనీ ఖాతాల నుంచి నిధులు బదిలీ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అదనంగా, బాలాజీ ఎంటర్టైన్మెంట్ కు కూడా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇప్పటివరకు, EOW దాదాపు 25 కోట్లు నేరుగా బదిలీ అయినట్లు గుర్తించింది.

నోట్ల రద్దు సమయంలో కంపెనీ ఆర్థిక లావాదేవీలపై నగదు కొరత ప్రభావం చూపిందని, ఆ సమయంలో కొన్ని అనుమానాస్పద నిధులు ఇతర ఖాతాలకు బదిలీ అయ్యాయని దర్యాప్తులో తేలింది. ఈ బదిలీలకు సంబంధించిన ఆధారాలను EOW సేకరించింది. కొన్ని కంపెనీల్లో రూ.60కోట్లు పెట్టుబడులుగా పెట్టినట్లు విచారణ సమయంలో రాజ్ కుంద్రా అంగీకరించినట్టు తెలుస్తోంది..అయితే వాటిని నిజంగానే సంబంధిత కంపెనీలకు మళ్లించారా లేదంటే ఇతర వ్యక్తిగత ఖర్చులకు వినియోగించారా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. వీటితో పాటూ రాజ్ కుంద్రా ఇతర వ్యాపారాలపై, అద్దెకు తీసుకున్న కార్యాలయాలకు సంబంధించిన చెల్లింపులపైనా సమాచారం సేకరిస్తున్నారు.

"బెస్ట్ డీల్" కోసం రూపొందించిన వీడియోలను సమర్పించాలని కుంద్రాను కోరారు. వీటిని ఇప్పటికే ఆస్తి విభాగం అధికారులకు అందజేసినట్లు ఆయన పేర్కొనగా, మరింత పరిశీలన కోసం వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది ... మరికొన్ని పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను కూడా రాబోయే రోజుల్లో విచారణకు పిలిపించే అవకాశం ఉంది.

ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ఇటీవల రూ. 60 కోట్ల మోసం కేసులో రాజ్ కుంద్రా వాంగ్మూలం నమోదు చేసింది. ఈ కేసులో ముంబై పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ: "నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై రూ. 60 కోట్ల మోసం కేసులో దర్యాప్తు జరుగుతోంది. ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం రాజ్ కుంద్రాకు సమన్లు ​​జారీ చేసింది. విచారణ కోసం పోలీసుల ఎదుట హాజరు కావాలని కోరారు."

(ఈ నివేదిక ఆటో-జనరేటెడ్ సిండికేట్ వైర్ ఫీడ్లో భాగంగా ప్రచురితమైంది. హెడ్లైన్లు మినహాయించి, ABP లైవ్ ద్వారా కాపీలో ఎటువంటి మార్పులు చేయలేదు.)

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
Advertisement

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Embed widget