అన్వేషించండి

Puri Jagannadh - Liger Protest : పూరి జగన్నాథ్ హర్టు - ఒక్క రూపాయి కూడా వెనక్కి ఇచ్చేది లేదట!

'లైగర్' డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్న ధర్నా పట్ల పూరి జగన్నాథ్ హర్ట్ అయినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా వెనక్కి ఇచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం అందుతోంది. 

'లైగర్' డిజాస్టర్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఫిల్మ్ ఛాంబర్ ముందు ఆ సినిమా ఎగ్జిబిటర్లు, బయ్యర్లు ధర్నాకు దిగడంతో చిత్రసీమ ప్రముఖులతో పాటు సగటు ప్రేక్షకుల చూపు కూడా అటు పడింది. గత ఏడాది ఆగస్టు 25న సినిమా విడుదల అయితే... ఇప్పుడు ధర్నాకు దిగడం వెనుక కారణాలు ఏమిటి? అని ఆలోచిస్తే 'డబుల్ ఇస్మార్ట్' కళ్ళ ముందు మెదులుతుంది. 

పూరి కొత్త సినిమా ప్రకటనకు ముందు!
'లైగర్' విడుదలైన తర్వాత రిజల్ట్ ఏమిటనేది పరిశ్రమకు, ప్రేక్షకులు అందరికీ అర్థమైంది. డిజాస్టర్ అని క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత బయ్యర్లు, ఎగ్జిబిటర్లు తమ నష్టాలను భర్తీ చేయాలంటూ పూరి జగన్నాథ్ ముందుకు వచ్చారు. అప్పట్లో కొన్ని చర్చలు జరిగాయి. పోలీస్ కేసుల వరకు వెళ్లారు. మళ్ళీ ఇప్పుడు ధర్నాకు దిగడం ఏమిటి? అంటే... పూరి జగన్నాథ్ కొత్త సినిమా ప్రకటన వస్తుంది కనుక!

'లైగర్' డిజాస్టర్ తర్వాత పూరికి మరో అవకాశం రావడం కష్టం అని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు భావించాయి. ఇటువంటి తరుణంలో రామ్ పోతినేని హీరోగా సూపర్ డూపర్ హిట్ 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' ప్రకటన వచ్చింది. అది కన్ఫర్మ్ అయ్యిందని పక్కా సమాచారంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ధర్నాకు దిగారని ఫిల్మ్ నగర్ ఖబర్. 

నిజం చెప్పాలంటే... 'లైగర్' మీద కోట్లకు కోట్ల రూపాయలు పెట్టడానికి కారణం కూడా 'ఇస్మార్ట్ శంకరే'. అసలు ఎవరూ ఊహించని విధంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ హీరోగా పూరి తీసిన 'లైగర్' మీద అంచనాలు పెరిగాయి. 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్ వస్తుండటంతో ఆ సినిమా రైట్స్ కోసం ఇప్పుడీ ధర్నా అనేది టాక్. 

హర్ట్ అయిన పూరి...
ఒక్క రూపాయి ఇచ్చేది లేదు!
తన ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ధర్నాకు దిగడంతో పూరి జగన్నాథ్ హర్ట్ అయినట్లు తెలిసింది. ఒక్క రూపాయి కూడా వెనక్కి తిరిగి ఇచ్చేది లేదని ఇరు వర్గాల మధ్య రాయబారానికి ప్రయత్నించిన పెద్దలతో చాలా స్పష్టంగా చెప్పేశారని సమాచారం అందింది. గతంలో కూడా ఆయన ఆ మాట చెప్పిన సంగతి తెలిసిందే. అగ్రిమెంట్స్ ప్రకారం కూడా పూరికి, బయ్యర్లు & ఎగ్జిబిటర్లకు మధ్య ఎటువంటి సంబంధం లేదట!

భారీగా నష్టపోయిన వరంగల్ శ్రీను!?
'లైగర్' డిజాస్టర్ కావడంతో అందరి కంటే ఎక్కువగా నష్టపోయినది తానేనని సౌత్ ఇండియా రైట్స్ కొన్న వరంగల్ శ్రీను చెబుతున్నారు. అసలు బలిపశువు తాను అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. సుమారు 60 కోట్ల రూపాయలకు తాను సినిమా రైట్స్ కొన్నానని, డిజాస్టర్ టాక్ రావడంతో ఎగ్జిబిటర్లు ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కి తీసుకున్నారని, అందరి కంటే ఎక్కువ డబ్బులు తనవే పోయాయనేది వరంగల్ శ్రీను వాదన. 

విజయ్ దేవరకొండకు కూడా డబ్బులు ఇవ్వలేదా?
'లైగర్' సినిమాకు గాను హీరో విజయ్ దేవరకొండకు కూడా ముందుగా అనుకున్న రెమ్యూనరేషన్ అందలేదని సమాచారం. కేవలం 25 శాతం మాత్రమే ఇచ్చారట. ఈ విషయం తెలిసి ఆయన్ను బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఏమీ అనడం లేదని టాక్. గతంలో 'ఆచార్య' ఫ్లాప్ అయినప్పుడు చిరంజీవి, రామ్ చరణ్ తమ రెమ్యూనరేషన్స్ వెనక్కి ఇచ్చిన సంగతి తెలిసిందే. ధర్నా చేస్తున్న వాళ్ళకు ప్రముఖ నిర్మాత, నైజాంలో పట్టున్న డిస్ట్రిబ్యూటర్ మద్దతు పలకడంతో ఈ వ్యవహారం ఎటు వైపు వెళుతుందోనని ఇండస్ట్రీ ఆసక్తిగా గమనిస్తోంది.

Also Read గాలి జనార్ధన్ రెడ్డి వర్సెస్ సుంకులమ్మ కథతో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Embed widget