Kalki 2898AD Sequel : కాస్త ఆలస్యమైందా ఆచార్య దేవా! - షూటింగ్లో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడంటే?
Prabhas : నాగ్ అశ్విన్ కల్కి సీక్వెల్ షూటింగ్ సెట్లో ప్రభాస్ పాల్గొనే టైం వచ్చేసింది. ఇప్పటికే షెడ్యూల్ పూర్తి కాగా మరో కీలక షెడ్యూల్ కోసం టీం ప్లాన్ చేస్తోంది.

Prabhas To Join Soon In Kalki 2898AD Shooting : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ టైంలో అందరి మదిలోనూ ఒకటే ప్రశ్న. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతోన్న అవెయిటెడ్ కల్కి 2898AD సీక్వెల్ షూటింగ్లో ఎప్పుడు జాయిన్ అవుతారు. దీనికి ఆన్సర్ దొరికేసింది.
ప్రభాస్ జాయిన్ అయ్యేది అప్పుడే?
ఇప్పటికే కల్కి షూటింగ్ ప్రారంభం కాగా... ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (సుప్రీం యాస్కిన్), బాలీవుడ్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ) లపై కీలక సీన్స్ షూట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ప్రభాస్ పార్ట్ అంతా వదిలేసి రిమెయినింగ్ షూటింగ్ పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే, ప్రధాన షెడ్యూల్ పూర్తి కాగా మరో కీలక షెడ్యూల్ కోసం నాగ్ అశ్విన్ అండ్ టీం ప్లాన్ చేస్తోంది. ఏప్రిల్లో జరగబోయే షెడ్యూల్లో ప్రభాస్ జాయిన్ కానున్నారు. త్వరలోనే దీని పూర్తి డీటెయిల్స్ వెల్లడి కానున్నాయి. ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
Also Read : నాకు పెళ్లికి హడావిడి లేదు - డేటింగ్ రూమర్స్, పెళ్లిపై బాలీవుడ్ బ్యూటీ స్ట్రాంగ్ రియాక్షన్
త్రీ మూవీస్... డిఫరెంట్ క్యారెక్టర్స్
ప్రభాస్కు ఇది నిజంగా బిజీ షెడ్యూలే. మూడు సినిమాలకు మూడు డిఫరెంట్ లుక్స్లో ఆయన కనిపించనున్నారు. హను రాఘవపూడి ఫౌజీ మూవీ షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తైంది. ఈ ఏడాది దసరాకు సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. 1930 టైంలో జరిగిన ఘటనల ఆధారంగా మూవీ తెరకెక్కుతుండగా... డార్లింగ్ ఓ బెటాలియన్ నాయకుడిగా పవర్ ఫుల్ సైనికుడిగా కనిపించనున్నారు. ఇక సందీప్ వంగా స్పిరిట్ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు.
కల్కి విషయానికొస్తే... కర్ణుడిగా... కల్కిగా రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 2024లో వచ్చిన 'కల్కి 2898AD' క్లైమాక్స్లో ఆలస్యమైందా ఆచార్యదేవా? అంటూ అశ్వత్థామను ప్రశ్నించే కర్ణుడి రోల్లో కనిపించనున్నట్లు హింట్ ఇచ్చారు. ఇక కల్కి అవతారంలోనూ కనిపించనున్నట్లు సమాచారం. దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
దీపికా ప్లేస్లో ఎవరు?
ఫస్ట్ పార్ట్లో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ స్థానంలో ఎవరిని తీసుకోబోతున్నారు? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆమె స్థానంలో చాలా పేర్లు వినిపించినా ఎవరనేది ఇంకా ఫిక్స్ కానట్లు తెలుస్తోంది. ఆమె స్థానాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎవరితో భర్తీ చేస్తారో? అసలు ఫస్ట్ పార్ట్లో రోల్ను ఎలా ఎండ్ చేస్తారు? ఆడియన్స్కు ఎలా కన్వే చేస్తారు? అనేది మిలియన్ మార్క్స్ క్వశ్చన్.
ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్లతో పాటు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, శోభన తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వనీదత్ భారీ బడ్జెట్తో మూవీని నిర్మిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ దాదాపు రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించగా రెండో పార్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
























