Peddi Overseas Rights: 'గేమ్ ఛేంజర్' vs 'పెద్ది'... డిజాస్టర్ తర్వాత ఓవర్సీస్లో రామ్ చరణ్ క్రేజ్ ఎలాగుంది?
Ram Charan Peddi Update: ఏప్రిల్ 30న 'పెద్ది' రిలీజ్ కానుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయ్యింది. కొన్ని ఏరియాల డీల్స్ క్లోజ్ చేశారు. 'గేమ్ ఛేంజర్'తో కంపేర్ చేస్తే బిజినెస్ ఎలాగుందో చూడండి.

Peddi Movie Release Date: మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కు వెళ్ళింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా 'పెద్ది'. ఆల్రెడీ విడుదలైన 'చికిరి చికిరి...' సాంగ్ చార్ట్ బస్టర్ అవ్వడం, 'ఉప్పెన' తర్వాత దర్శకుడు సానా బుచ్చిబాబు తీస్తున్న సినిమా కావడం, 'రంగస్థలం' తరహాలో రామ్ చరణ్ రగ్గడ్ లుక్లో కనిపించడంతో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తే ఆ సంగతి అర్థం అవుతోంది. ఆల్రెడీ ఓవర్సీస్ డీల్ క్లోజ్ చేశారు.
'గేమ్ ఛేంజర్' వర్సెస్ 'పెద్ది'...
రామ్ చరణ్ క్రేజ్ పెరిగిందబ్బా!
సాధారణంగా డిజాస్టర్ సినిమా తర్వాత వచ్చే సినిమాకు మార్కెట్టులో కొంచెం క్రేజ్ తగ్గుతుంది. డిస్ట్రిబ్యూటర్లు తక్కువ రేట్లకు సినిమాను అడుగుతారు. బట్ ఫర్ ఏ ఛేంజ్... రామ్ చరణ్ క్రేజ్ పెరిగింది. కానీ తగ్గలేదు.
'పెద్ది' ఓవర్సీస్ (అమెరికా) రైట్స్ 40 కోట్లకు అమ్మినట్టు తెలిసింది. దీనికి ముందు రామ్ చరణ్ నుంచి వచ్చిన 'గేమ్ ఛేంజర్' సినిమా ఓవర్సీస్ రైట్స్ 25 కోట్ల రూపాయలు మాత్రమే. సినిమా మీద ఉన్న హైప్ చూస్తే... ఆ అమౌంట్ రావడం కష్టం ఏమీ కాదు. నార్త్ అమెరికాలో ఈ సినిమా 6 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుందని అంచనా. 'ఆర్ఆర్ఆర్' తర్వాత అందులో మరో హీరో ఎన్టీఆర్ నుంచి వచ్చిన 'దేవర' సినిమా ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ 27 కోట్లు.
ట్విన్స్ జన్మించడంతో సంతోషంలో...
ట్విన్స్ జన్మించడంతో రామ్ చరణ్ & మెగా ఫ్యామిలీ సంతోషంగా ఉన్నారు. కొన్ని రోజులు చిత్రీకరణ నుంచి విరామం తీసుకున్నారు. వెంటనే మళ్ళీ షూట్ చేయడం స్టార్ట్ చేశారు. మార్చి నుంచి రామ్ చరణ్ ఫుల్ ఫ్లెజ్డ్ షూటింగ్ చేస్తారని టాక్.
మార్చి నెలాఖరుకు చిత్రీకరణ పూర్తి చేసేలా 'పెద్ది' టీమ్ ప్లాన్ చేసింది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టింది. ఏప్రిల్ రెండో వారానికి ఫస్ట్ కాపీ రెడీ చేయాలనేది ప్లాన్. రెండు వారాలు పూర్తిగా ప్రచారానికి సమయం కేటాయించి పాన్ ఇండియా లెవల్ పబ్లిసిటీ చేయనున్నారు.
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న 'పెద్ది'లో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకం మీద వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.























