అన్వేషించండి

Vishal: సెన్సార్ బోర్డ్‌కు రూ.6.5 లక్షల లంచం ఇచ్చా - ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నా: విశాల్

కోలీవుడ్ హీరో విశాల్ 'మార్క్ ఆంటోనీ' హిందీ వర్షన్ రిలీజ్ కోసం తన దగ్గర రూ.6.5 లక్షలు లంచం తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేస్తూ సుధీర్ఘ ట్వీట్స్ తో పాటు ఓ వీడియోని రిలీజ్ చేశాడు.

కోలీవుడ్ అగ్ర హీరో విశాల్ తాజాగా ఓ సెన్సార్ అధికారి లంచగొండితనం గురించి సంచలన ఆరోపణలు చేశాడు. ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(CBFC) ఆఫీస్ లో తనకు స్వయంగా ఈ అనుభవం ఎదురయిందని వెల్లడించారు. ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఓ సుదీర్ఘ ట్వీట్ చేస్తూ ఒక వీడియో సైతం రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే పీఎం ప్రధాన మోడీ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తాజా వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"వెండితెరపై కూడా అవినీతి చూపిస్తున్నారు. దీనిని అసలు జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, ముంబైలోని సీ బీఎఫ్ సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) ఆఫీస్ లో ఇంకా దారుణం జరుగుతోంది. నా సినిమా మార్క్ ఆంటోనీ  హిందీ వెర్షన్ రిలీజ్ కోసం రూ.6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి నేనే స్వయంగా రెండు లావాదేవీలు చేశాను. ఒకటి మొదట స్క్రీనింగ్ కోసం మూడు లక్షలు రెండు సర్టిఫికేషన్ కోసం రూ.3.5 లక్షలు చెల్లించాను. నా సినీ కెరీర్లో ఇప్పటివరకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. నా సినిమాని ఎలాగైనా నార్త్ లో రిలీజ్ చేయాలని అనుకున్న నాకు ఈ పరిస్థితి ఎదురవడంతో డబ్బు చెల్లించడం తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు" అని అన్నారు.

"ఈరోజు విడుదలైన సినిమా నుంచి చాలా ఎక్కువ వాటా నా పేరున ఉన్నందున సంబంధిత మధ్యవర్తికి డబ్బు చెల్లించడం తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను ఇలా చేస్తుంది నా కోసం కాదు. భవిష్యత్తులో రాబోయే నిర్మాతల కోసం. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అవినీతికి ఇచ్చే అవకాశం లేదు. ఆ అవినీతిని అందరూ చూడ్డానికి సాక్ష్యం కూడా ఇస్తున్నా. సత్యం ఎప్పటిలాగే గెలుస్తుందని ఆశిస్తున్నాను" అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం విశాల్ ట్వీట్స్ తో పాటు వీడియో సైతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇక 'మార్క్ అంటోనీ' విషయానికి వస్తే.. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో రూపొందింది. విశాల్, రీతు వర్మ జంటగా నటించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15 విడుదలై తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. ఎస్ జె సూర్య, సెల్వ రాఘవన్, సునీల్ వంటి ప్రధాన తారాగణం కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో విశాల్ 3 డిఫరెంట్ వేరియేషన్స్ లో నటించి ఆకట్టుకున్నాడు. మినీ స్టూడియోస్ బ్యానర్ పై వినోద్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీత అందించారు. ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేసేందుకే మూవీ టీం సెన్సార్ కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ కి పంపించగా సర్టిఫికెట్ కోసం సెన్సార్ వాళ్లు 6.5లక్షలు లంచం తీసుకున్నట్లు విశాల్ వెల్లడించడం ఇప్పుడు ఇండస్ట్రీలోనే చర్చనీయాంశంగా మారింది.

Also Read : వామ్మో లేడీ సూపర్ స్టార్, 50 సెకండ్ల యాడ్ కోసం నయన్ అంత తీసుకుంటుందా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mouni Roy Divorce: డబ్బు వాడుకున్నాడు... మోసం చేశాడు... మౌనీ రాయ్ విడాకుల వెనుక కారణాలు అవేనా?
డబ్బు వాడుకున్నాడు... మోసం చేశాడు... మౌనీ రాయ్ విడాకుల వెనుక కారణాలు అవేనా?
Actor Ali: అలీ విశ్వరూపం... చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో కొత్త మూవీ షురూ
అలీ విశ్వరూపం... చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో కొత్త మూవీ షురూ
Nani Paradise: పుకార్లకు చెక్ పెట్టిన ప్యారడైజ్ టీమ్... గట్టిగా ఇచ్చిపడేసిన నాని & కో
పుకార్లకు చెక్ పెట్టిన ప్యారడైజ్ టీమ్... గట్టిగా ఇచ్చిపడేసిన నాని & కో
Sandigdham Movie: 'సందిగ్ధం'లో ఎంత మంది ఆర్టిస్టులున్నారో చూశారా? జబర్దస్త్ నుంచి ఎవరెవరున్నారంటే?
'సందిగ్ధం'లో ఎంత మంది ఆర్టిస్టులున్నారో చూశారా? జబర్దస్త్ నుంచి ఎవరెవరున్నారంటే?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget