అన్వేషించండి

Jr NTR Fan Shyam Death: తారక్ ఫ్యాన్స్‌కు ఇతర హీరోల అభిమానుల సపోర్ట్ - శ్యామ్‌కు న్యాయం చేయాలని డిమాండ్

జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ చనిపోయాడు. నిన్న(జూన్ 26) ఆయన ఆయన సొంతూరు చింతలూరులో కన్నుమూశాడు. అతడి మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని తారక్, ఇతర హీరోల అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా చింతలూరుకు చెందిన శ్యామ్ నిన్న ఉరేసుకుని కనిపించాడు. అయితే, ఆయన మరణంపై సర్వత్రా అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఆయన మృతిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. “శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలిచి వేస్తోంది. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి” చేస్తున్నాను అంటూ ప్రకటన విడుదల చేశారు. తారక్ అభిమాని మరణంపై ఇతర హీరోల అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్యామ్ కుటుంబానికి న్యాయం చేయాలని, పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

శ్యామ్ కు న్యాయం జరగాలంటున్న పవన్ లభిమానులు

జూ. ఎన్టీఆర్ వీరాభిమాని  శ్యామ్ మరణంపై అనుమానాలు రేగడంతో తోటి అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆయన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. అంతేకాదు. శ్యామ్ కు న్యాయం చేయాలని క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. #WeWantJusticeForShyamNTR అనే హ్యాష్ ట్యాగ్ తో కామెంట్స్ పెడుతున్నారు. ఆయన మృతికి అసలు కారణం తెలియాలని పవన్ కల్యాణ్ అభిమానులు సైతం కోరుతున్నారు. శ్యామ్ కు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తేల్చి చెప్తున్నారు. అంతేకాదు, ప్రస్తుతం గోదావరి జిల్లాల్లోనే వారాహి విజయ యాత్ర నిర్వహిస్తున్న పవర్ స్టార్, శ్యామ్ మరణంపైనా స్పందించాలని కోరుతున్నారు. అంతేకాదు, టాలీవుడ్‌లోని ఇతర హీరోల అభిమానులు సైతం తారక్ అభిమానుల డిమాండ్‌కు మద్దతు పలుకుతున్నారు. ఎప్పుడూ తమ హీరో గోప్పా.. మీ హీరో జీరో అంటూ కొట్టుకొనే అభిమానులు.. శ్యామ్ ఘటనపై ఒకే స్వరం వినిపిస్తుండటం గమనార్హం.

‘దాస్ కా ధమ్కీ’ వేదికగా గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్

తూర్పుగోదావరి జిల్లా చింతలూరుకు చెందిన శ్యామ్ ఊహ తెలిసినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమానిగా ఉన్నాడు. కొద్ది  నెలల క్రితం విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శ్యామ్ హల్ చల్ చేసి హైలెట్ అయ్యాడు. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆ సమయంలో తన అభిమాన హీరోను కలుసుకునేందుకు స్టేజి మీదికి దూసుకెళ్లాడు. సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఎన్టీఆర్ వారిని వద్దని వారించారు. శ్యామ్ ను దగ్గరికి పిలిచి ఫోటో దిగి పంపించారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ వీరాభిమానిగా శ్యామ్ ఫేమస్ అయ్యాడు.

శ్యామ్ మరణంపై అనేక అనుమానాలు!

తాజాగా శ్యామ్ ఇంటి దగ్గరే ఉరేసుకుని చనిపోయి కనిపించాడు. అయితే, అతడికి ఉరేసుకుని చనిపోయే కష్టాలు ఏమీ లేవని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అతడిది కచ్చితంగా ఆత్మహత్య కాదంటున్నారు. ఎవరో కావాలనే తనను చంపేసి ఆత్మహత్య చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. ఉరేసుకుని చనిపోతే ఆయన శరీరం మీద గాయాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. చేతుల దగ్గర  కోసిన గుర్తులు ఉన్నాయంటున్నారు. శరీరం మీద కూడా గాయాలు కనిపిస్తున్నట్లు చెప్పారు. శ్యామ్ మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

శ్యామ్ మృతిపై స్పందించిన చంద్రబాబు

ఇప్పటికే శ్యామ్ మృతిపై టీడీపీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్ స్పందించారు. ఈ మేరకు ఇద్దరు ట్వీట్లు చేశారు. శ్యామ్ మరణంపై నిస్పక్షపాతంగా విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్యామ్ మరణంలో చాలా అనుమానం కలిగించే అంశాలు ఉన్నాయని, వెంటనే పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను పట్టుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన వెనుక వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు వ్యక్తుల ప్రమేయం ఉందనే సమాచారం వస్తోందని ఆయన ఆరోపించారు.   

Read Also: సల్మాన్‌ను కచ్చితంగా చంపేస్తాం - ఆ సింగర్ హత్య కేసు నిందితుడు వార్నింగ్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget