అన్వేషించండి

Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!

Indias spending: దేశంలో ఎక్కువగా వినియోగవస్తువులపై ఎక్కువగా ఖర్చు పెట్టే రాష్ట్రాల జాబితాలో ఏపీ ముందు ఉంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల వారి కన్నా ఏపీ ప్రజలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు.

Southern states dominate Indias spending surge: గృహ వినియోగ వ్యయ సర్వే 2023-24 ప్రకారం నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో దక్షిణ భారతదేశం దేశంలోని మిగిలిన ప్రాంతాలను మించిపోయింది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి ఐదు దక్షిణాది రాష్ట్రాలు జాతీయ సగటు కంటే ఎక్కువ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రజల సగటు ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా రాష్ట్రాల ప్రజలు కూడా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని అనుకోవచ్చు. 

ఏపీ ప్రజలు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు !
 
కేరళలో గ్రామీణ కుటుంబాలు నెలకు రూ.6,611, పట్టణ కుటుంబాలు రూ.7,834 ఖర్చు చేస్తుండగా, జాతీయ సగటు రూ.4,122, రూ.6,996తో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5,872, పట్టణ ప్రాంతాల్లో రూ.8,325తో తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉంది. తెలంగాణలో వరుసగా రూ.5,675, రూ.9,131 ఖర్చు పెడుతున్నారు.  దక్షిణాదిలో అత్యధి  వినియోగ ఖర్చు ఆంధ్రప్రదేశ్ నమోదు చేసింది. ఏపీల గ్రామీణ కుటుంబాలు రూ.6,107, పట్టణ కుటుంబాలు రూ.9,877 ఖర్చు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5,068, పట్టణ ప్రాంతాల్లో రూ.8,169తో కర్ణాటక మొదటి ఐదు స్థానాల్లో ఉంది. ఏ విధంగా చూసినా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఆహారం కోసం..  మెరుగైన జీవన ప్రాణాల కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. 

Also Read: Racist comments on Sriram Krishnan: మన శ్రీరామ్‌ కృష్ణన్ అమెరికన్లకు బటన్ చికెన్‌లా ఉన్నాడట - ట్రంప్ సలహాదారుడికే తప్పని వివక్ష !

గుజరాత్, మహారాష్ట్ర వంటి పారిశ్రామిక రాష్ట్రాల ఖర్చు జాతీయ సగటుకు అటూ ఇటూగా ఉంది.  ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్,  రాజస్థాన్ వంటి  ఉత్తరాది రాష్ట్రాల ప్రజల ఖర్చు జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.  గ్రామీణ, పట్టణ వ్యయంలో పశ్చిమ బెంగాల్ కూడా సగటు కంటే తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా తీవ్ర వ్యత్యాసాలను ఈ సర్వే గుర్తించింది. సిక్కింలో  గ్రామీణ కుటుంబాలు రూ .9,377, పట్టణ కుటుంబాలు రూ .13,927 ఖర్చు చేస్తున్నాయి. చత్తీస్ గఢ్ లో అత్యల్పంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,739, పట్టణ ప్రాంతాల్లో రూ.4,927 ఖర్చు చేస్తున్నాయి. సిక్కిం అతి చిన్న ఈశాన్య రాష్ట్రం కాబట్టి పెద్ద రాష్ట్రాలతో పోల్చలేము కానీ అక్కడి ప్రజలు దేశంలో అందరి కన్నా ఎక్కువ ఖర్చుపెడుతున్నారు. 

Also Read:  యూకే స్టుడెంట్‌ వీసా రూల్స్ మారాయి - మీ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉండాలో తెలుసా?

గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల్లో ఖర్చుల మధ్య తేడా  

గ్రామీణ-పట్టణ అసమానతలను కూడా ఈ సర్వే వెల్లడించింది. 104% గ్రామీణ-పట్టణ వ్యత్యాసంతో మేఘాలయ అగ్రస్థానంలో ఉండగా, జార్ఖండ్ 83%, చత్తీస్గఢ్ 80% తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 28 రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ కేటగిరీల్లో 9 ఎంపీసీఈ స్థాయిలు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఆగస్టు 2023 నుండి జూలై 2024 వరకు నిర్వహించిన గృహ వినియోగ వ్యయ సర్వే ఖర్చు ధోరణులు, పేదరికం, అసమానతలు వంటి వాటిని వెల్లడించింది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Telangana News: భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక   
భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక  
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sobhan Babu House Vlog | చిన నందిగామ లో నటభూషణ్  కట్టిన లంకంత ఇల్లు | ABP DesamKondapochamma Sagar Tragedy | కొండపోచమ్మసాగర్ లో పెను విషాదం | ABP DesamNagoba Jathara Padayathra | ప్రారంభమైన మెస్రం వంశీయుల గంగాజల పాదయాత్ర | ABP DesamPawan Kalyan vs BR Naidu | టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు కోరేలా చేసిన డిప్యూటీ సీఎం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Telangana News: భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక   
భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక  
Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
CM Chandrababu: సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Kondapochamma Sagar Dam: సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం - సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకుల దుర్మరణం, సెల్ఫీ కోసం ఒకరినొకరు పట్టుకుంటూ..
సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం - సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకుల దుర్మరణం, సెల్ఫీ కోసం ఒకరినొకరు పట్టుకుంటూ..
Three Gorges Dam in space: అంతరిక్షంలో త్రీ గోర్జెస్ డ్యామ్- మైండ్‌ బ్లోయింగ్‌ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్న చైనా
అంతరిక్షంలో త్రీ గోర్జెస్ డ్యామ్- మైండ్‌ బ్లోయింగ్‌ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్న చైనా
Embed widget