అన్వేషించండి

8 ఏళ్ల తర్వాత మరోసారి ప్లాప్ డైరెక్టర్‌తో గోపిచంద్ సినిమా?

సుమారు 8 ఏళ్ల క్రితం వచ్చిన ' జిల్' తర్వాత డైరెక్టర్ రాధాకృష్ణతో గోపీచంద్ మరో సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తోంది. UV క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు సమాచారం.

మ్యాచో స్టార్ గోపీచంద్ సినీ కెరియర్ ప్రస్తుతం డైలమాలో పడింది. దానికి కారణం గత కొంతకాలంగా ఈ హీరో వరుస అపజయాలు ఎదుర్కోవడమే. 'లౌక్యం' తర్వాత మళ్లీ గోపీచంద్ కి ఆ రేంజ్ హిట్టు పడలేదు. మధ్యలో 'జిల్', 'గౌతమ్ నంద', 'పక్కా కమర్షియల్', ‘సీటీమార్' సినిమాలకు మంచి టాక్ వచ్చినా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాయి. ఇక రీసెంట్ గా వచ్చిన 'రామబాణం' అయితే గోపీచంద్ కెరీర్ లోనే బిగ్గెస్,ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. రొటీన్ కమర్షియల్ ఫార్మేట్ ఉన్న కథలకే గోపీచంద్ ప్రాధాన్యత ఇవ్వడం అతని కెరియర్ కు మైనస్ గా మారింది. ప్రస్తుతం ఓ కన్నడ దర్శకుడితో 'భీమా'(Bheema) అనే యాక్షన్ ఎంటర్టైనర్ ని చేస్తున్న గోపీచంద్ ఇప్పుడు మరో ప్లాప్ డైరెక్టర్ తో సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తోంది.

సాధారణంగా సక్సెస్ ఉన్న డైరెక్టర్స్ తోటే సినిమాలు చేసేందుకు హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ గోపీచంద్ మాత్రం రివర్స్ లో వెళ్తున్నారు. రీసెంట్ గానే శ్రీను వైట్లతో సినిమా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. వరుస డిజాస్టర్స్ తో శ్రీను వైట్ల కెరియర్ కు గ్యాప్ వచ్చింది. అయినా సరే ఆయనతో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మరో డిజాస్టర్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు రాధాకృష్ణ కుమార్. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ఈ దర్శకుడు తెరకెక్కించిన 'రాదే శ్యామ్' గత ఏడాది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ మూవీ భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్ అందుకుంది. అంతేకాదు సుమారు రూ.100 కోట్లకు పైనే నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. దాంతో రాధాకృష్ణ ఇప్పటివరకు ఏ హీరో తో నెక్స్ట్ మూవీ ని కన్ఫర్మ్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం గోపీచంద్ తో ఈయన నెక్స్ట్ మూవీ ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఈ డైరెక్టర్ కి మొదటినుంచి ప్రభాస్ సపోర్ట్ ఉండటంతో UV క్రియేషన్స్ బ్యానర్లో గోపీచంద్ హీరోగా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాధాకృష్ణ వినిపించిన కథ గోపీచంద్ కి నచ్చడం జరిగిందని, త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు వీరిద్దరి కాంబినేషన్లో 2015 లో 'జిల్' అనే సినిమా వచ్చింది.

UV క్రియేషన్స్ బ్యానర్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ముఖ్యంగా సినిమాలో గోపీచంద్ ని దర్శకుడు రాధాకృష్ణ చూపించిన విధానం ఆకట్టుకుంది. ఇక మళ్లీ 8 ఏళ్ల గ్యాప్ తర్వాత వీరి కాంబో సెట్ అవ్వడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది చివర్లో సినిమాను లాంచ్ చేసి 2024 ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోపిచంద్ 'భీమా' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కే.కే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ స్వరాలు సమకూరుస్తున్నారు. మలయాళ దర్శకుడు హర్ష డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో గోపీచ చాలా కాలం తర్వాత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

Also Read : మాస్ మహారాజ రవితేజతో రష్మిక - పాన్ ఇండియా సినిమా కోసం!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget