Spirit Movie Update: డార్లింగ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ - 'స్పిరిట్' మూవీపై డైరెక్టర్ సందీప్ వంగా బిగ్ అప్డేట్
Sandeep Reddy Vanga: ప్రభాస్ స్పిరిట్ మూవీపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే బీజీఎం వర్క్స్ స్టార్ట్ చేశామని త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని తెలిపారు.

Director Sandeep Reddy Vanga About Spirit Movie: డార్లింగ్ ఫ్యాన్స్కు నిజంగా ఇది అదిరిపోయే న్యూస్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతోన్న మూవీ 'స్పిరిట్'. సెట్స్పైకి వెళ్లక ముందే ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ మూవీపై షాకింగ్ అప్డేట్ ఇచ్చారు సందీప్.
70 శాతం కంప్లీట్
ఓ టీవీ ఈవెంట్లో పాల్గొన్న డైరెక్టర్ సందీప్ ప్రభాస్ స్పిరిట్పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ బీజీఎం పనులు 70 శాతం కంప్లీట్ చేసినట్లు చెప్పారు. 'స్పిరిట్ మూవీ షూటింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 70 శాతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పూర్తి చేశాం. గతంలో యానిమల్ మూవీ టైంలో కూడా ముందే దాదాపు 80 శాతం బీజీఎం వర్క్ కంప్లీట్ చేసి సెట్స్పైకి వెళ్లాం. దీంతో సీన్ అవుట్ పుట్ ఏంటి అనేది ముందే తెలిసిపోతుంది.
ఈ వర్క్ వల్ల టైంతో పాటు ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా వరకూ తగ్గుతుంది. ప్రభాస్తో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. పాన్ ఇండియా రేంజ్ స్టార్ అనే ఫీలింగ్ ఆయనలో కనిపించదు. నేను ఊహించిన దాని కంటే ఆయన ఎక్కువగానే ఈ సినిమాకు సహకరించారు. త్వరలోనే ప్రభాస్తో కలిసి వస్తాం.' అంటూ స్పష్టం చేశారు.
"70% of the BGM is already done 🔥💥#Prabhas is a very transparent and very sweet person to work with. We’ll start shooting very soon."
— Whynot Cinemas (@whynotcinemass_) September 6, 2025
- #SandeepReddyVanga | #Spirit
pic.twitter.com/P6nbFGkaPk
Also Read: దేవిశ్రీకి పవన్ కళ్యాణ్ షేక్ హ్యాండ్ - చాలా రోజుల తర్వాత మాంచి డ్యాన్స్ నంబర్… కొట్టండ్రా డప్పులు!
డిఫరెంట్ రోల్స్లో ప్రభాస్
ఈ మూవీలో 2 డిఫరెంట్ రోల్స్లో ప్రభాస్ నటించనున్నారట. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన కనిపించనుండగా... ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాఫియా డాన్గానూ కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీస్తో బాక్సాఫీస్ను షేక్ చేసిన సందీప్ నుంచి 'స్పిరిట్' మూవీ రిజల్ట్ కూడా అలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. హై ఓల్టేజ్ కాప్ యాక్షన్ థ్రిల్లర్గా మూవీని తెరకెక్కించనుండగా... భద్రకాళీ పిక్చర్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ప్రభాస్ సరసన త్రిప్తి దిమ్రి నటిస్తున్నారు. తొలుత బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ను అనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించారు.
ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్షన్లో 'ది రాజా సాబ్' మూవీతో పాటు హను రాఘవపూడి 'ఫౌజీ' మూవీస్ షూటింగ్స్ శరవేగంగా సాగుతున్నాయి. వీటి తర్వాతే 'స్పిరిట్' ట్రాక్లోకి ఎక్కే ఛాన్స్ ఉంది. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మరో సినిమా చేయకూడదన్న సందీప్ కండీషన్కు ప్రభాస్ ఓకే చెప్పడంతో దానికి తగ్గట్లుగానే షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక 'ది రాజా సాబ్' మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.






















