Bhishma Combo Repeat: నితిన్, రష్మిక మూవీకి మెగాస్టార్ క్లాప్ - ‘భీష్మ’ త్రయంపై ఫ్యాన్స్ ఆశలు
హీరో నితిన్, హీరోయిన్ రష్మిక మందన్న కాంబినేషన్ లో మరో సారి సినిమా రాబోతుంది. డైరెక్టర్ వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి పూజా కార్యక్రమం జరగగా..మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు.

హీరో నితిన్, హీరోయిన్- రష్మిక మందన్న కాంబినేషన్ లో మరో సారి సినిమా రాబోతుంది. డైరెక్టర్ వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు పూజా కార్యక్రమం జరగ్గా.. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు.
హీరో నితిన్, హీరోయిన్ రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన 'భీష్మ' ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. నితిన్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'భీష్మ' నిలిచింది. ఇప్పుడు మరోసారి వారిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని నితిన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టడంతో సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది.
హీరోలైనా, హీరోయిన్లైనా.. కొంతమందికి కొందరి కాంబినేషన్ బాగా కలిసొస్తుంది. వారితో చేస్తే మళ్లీ హిట్ ఖాయమని నమ్మేవాళ్లు కూడా లేకపోలేదు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతోంది. గతంలో దర్శకుడు వెంకీ కుడుముల, హీరో నితిన్, హీరోయిన్ రష్మిక మందన్న కాంబినేషన్ లో 'భీష్మ' సినిమా వచ్చింది. అప్పట్లో ఈ మూవీ భారీ హిట్ ను అందుకొని నితిన్ కు మంచి టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇప్పుడు మరోసారి ఈ మ్యాజిక్ కాంబో రిపీట్ కాబోతుంది. ఈ మూవీని 'మైత్రీ మూవీ మేకర్స్' సంస్థ నిర్మిస్తోంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు నితిన్, రష్మిక మందన్నతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ ఇవ్వగా.. ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ‘వీరసింహారెడ్డి’ దర్శకుడు గోపీచంద్ మలినేని ఫస్ట్ షాట్కు దర్శకత్వం వహించారు. ఇక దర్శకులు హను రాఘవపూడి, బుచ్చిబాబు సానా స్క్రిప్ట్ను చిత్ర యూనిట్కు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను మైత్రి మూవీ మేకర్స్ తో పాటు, హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
A special film made even more special by our dearest Megastar @KChiruTweets Garu ❤️
— nithiin (@actor_nithiin) March 24, 2023
Thank you sir for blessing our #VNRTrio. It means the world to us.@iamRashmika @VenkyKudumula @gvprakash @MythriOfficial pic.twitter.com/zyz5RbhU49
ఇక నితిన్ నటించబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించున్నారని సమాచారం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు సాయి శ్రీరామ్ కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా ఉండనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్, రిలీజ్ లాంటి మరిన్ని వివరాలను నిర్మాతలు త్వరలోనే వెల్లడించనున్నారు.
2020లో ‘భీష్మ’ సినిమా తర్వాత మళ్లీ అంతటి స్థాయిలో నితిన్ హిట్ ను అందుకోకపోవడం ఆయన ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. చాలా రోజుల తర్వాత నితిన్ సినిమా తెరకెక్కనుండడం.. మళ్లీ ఆ హిట్ కాంబోలో ఈ మూవీ రానుండడంతో అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
Also Read : 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు





















