అన్వేషించండి

AVS Son Pradeep: మనిషి చనిపోయాక అలా మాట్లాడడం కరెక్ట్ కాదు - నటి జ్యోతిపై ఏవీఎస్ కుమారుడు ఆగ్రహం

AVS Son Pradeep: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో లెజెండరీ కమెడియన్‌పై పేరు తెచ్చుకున్న ఏవీఎస్‌పై నటి జ్యోతి వ్యాఖ్యలు చేశారు. దానిపై తాజాగా ఏవీఎస్ కుమారుడు ప్రదీప్ స్పందించాడు.

AVS Son Pradeep About Jyothi: గత కొన్నేళ్లలో చాలామంది సీనియర్ కమెడియన్లను తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయింది. అందులో ఏవీఎస్ కూడా ఒకరు. అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం అయినా యాక్టర్‌గా అడుగుపెట్టిన తర్వాత ఏవీఎస్ అనే పేరుతోనే ఫేమస్ అయ్యారు. ఇప్పటికీ ఎన్నో తెలుగు సినిమాల్లో ఆయన పాత్రలను, అందులో యాసను ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారంటే ఆయన సంపాదించుకున్న క్రేజ్ అలాంటిది. ఇక ఏవీఎస్ హఠాన్మరణం ఇండస్ట్రీకి ఎంత లోటుగా మిగిలిందో తన కుటుంబానికి కూడా అంతే లోటును మిగిల్చింది. తాజాగా ఏవీఎస్ కుమారుడు ప్రదీప్.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన తండ్రిపై జ్యోతి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

వాళ్లంతా లెజెండ్స్..

ఎక్కువగా ఏవీఎస్.. సినిమాలు, అందులో తన పాత్రలపై మాత్రమే శ్రద్ధపెట్టేవారు. ఆఫ్ స్క్రీన్ కాంట్రవర్సీలకు ఆయన చాలా దూరం. అయినా కూడా నటి జ్యోతి ఒక సందర్బంలో ఆయనపై పలు వ్యాఖ్యలు చేశారు. తనకు నటనే రాదని ఏవీఎస్ అన్నారని ఆరోపణలు చేసింది. ఆ విషయంలో ఇప్పుడు తన కుమారుడు ప్రదీప్ స్పందించారు. ‘‘ఆవిడలో మా నాన్నకు ఆర్టిస్ట్ కనిపించలేదు. ఆవిడకు మా నాన్న జోక్‌లో పంచ్‌లో కనిపించలేదు. అది ఆవిడ సమస్య. అప్పటి కమెడియన్స్ అందరూ లెజెండ్స్. ఎవరో చెప్తే వారు వచ్చి కెమెరా ముందు నిలబడి నటించలేదు. స్వయంకృషి అనేది కరెక్ట్ పదం. అలాంటి వాళ్లు ఇప్పుడు లేరు’’ అంటూ తన తండ్రితో పాటు ఇతర కమెడియన్ల గురించి కూడా గుర్తుచేసుకున్నారు ప్రదీప్.

చనిపోయిన తర్వాత అలా చేయకూడదు..

‘‘మనిషి చనిపోయిన తర్వాత వారి గురించి నెగిటివ్‌గా మాట్లాడేవారిని నేను కనీసం పట్టించుకోను. లేని మనిషి గురించి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు కొంచెం దయ చూపిస్తే బాగుంటుంది. మనిషి లేనప్పుడు ఆయన గురించి మాట్లాడే పద్ధతి వల్లే నీ క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది. కెమెరా ముందు కూర్చొని మాట్లాడడానికి అర్హత లేదు నీకు. ఎవరైనా సరే అలా చేయకూడదు. ఇప్పుడు చెడు మాట్లాడమని ఎవరు చెప్తున్నారు? మరి ఆయన ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు. ఎందుకంటే అప్పుడైతే అక్కడ నుండి కరెక్ట్ సమాధానం వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ సమాధానం ఇవ్వడానికి ఆయన లేరు కాబట్టి మాట్లాడుతున్నారు’’ అంటూ చనిపోయిన వారి గురించి ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని ప్రదీప్ వాపోయారు.

ఆ సినిమా వల్లే..

ఉదయ్ కిరణ్ హీరోగా, వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఏవీఎస్ ఒక చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. అదే ‘ఓరి.. నీ ప్రేమ బంగారంగానూ’ అనే మూవీని చేయాల్సి ఉంది. కానీ అదే సమయంలో ఇద్దరికీ వేరే పెద్ద ప్రాజెక్ట్స్ రావడంతో వాటిని వదులుకోలేక ఈ సినిమా నుండి తప్పుకున్నారు. దీంతో మంచి కథను వదులుకోకూడదు అనే ఉద్దేశ్యంతో ‘ఓరి.. నీ ప్రేమ బంగారంగానూ’ సినిమాను చేశారని, దాని వల్ల ఏవీఎస్ జీరో అయిపోయారని ప్రదీప్ గుర్తుచేసుకున్నారు. తన తండ్రి చాలాసార్లు మధ్యాహ్నం భోజనం చేయకుండా పాన్ వేసుకునేవారని తెలిపారు. ఎప్పుడూ తన కుటుంబాన్ని రిస్క్‌లో పెట్టే పనులు ఏవీఎస్ చేయలేదన్నారు. 

Also Read: పెళ్లిలో అందరినీ చంపేసి బిర్యానీ తిన్నాడు - గోపీచంద్, శ్రీనువైట్ల మూవీ టైటిల్ ఇదే, ఫస్ట్ స్ట్రైక్ వీడియో చూశారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

WhatsApp Governance: దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
Telangana News: రికార్డు వేగంతో కుల గణన,​ సమగ్ర సర్వే- దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
రికార్డు వేగంతో కుల గణన,​ సమగ్ర సర్వే- దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
Sivakarthikeyan Vs Vijay Antony: శివకార్తికేయన్ వర్సెస్ విజయ్ ఆంటోనీ... తమిళ టైటిల్ గొడవ, ఇంతకీ 'పరాశక్తి' ఎవరి సొంతం?
శివకార్తికేయన్ వర్సెస్ విజయ్ ఆంటోనీ... తమిళ టైటిల్ గొడవ, ఇంతకీ 'పరాశక్తి' ఎవరి సొంతం?
YSRCP Leaders : కేసుల్లో మగ్గిపోతున్న లీడర్, క్యాడర్ - వైసీపీ హైకమాండ్ కనీస సాయం చేయడం లేదా ?
కేసుల్లో మగ్గిపోతున్న లీడర్, క్యాడర్ - వైసీపీ హైకమాండ్ కనీస సాయం చేయడం లేదా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISRO 100th Launch Journey | సైకిల్ మీద తిప్పలు, ఎడ్ల బండి మోతలు..అన్నీ దాటి ఈ రోజు సెంచరీ | ABP DesamMaha Kumbh 2025 Prayag Raj Drone VisualsMaha Kumbh 2025 Mouni Amavasya | మౌని అమావాస్య రోజు కుంభమేళాలో మహా అపశృతి | ABP DesamCM Yogi Adityanath Request Devotees | నాలుగు కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్న యోగి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Governance: దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
Telangana News: రికార్డు వేగంతో కుల గణన,​ సమగ్ర సర్వే- దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
రికార్డు వేగంతో కుల గణన,​ సమగ్ర సర్వే- దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
Sivakarthikeyan Vs Vijay Antony: శివకార్తికేయన్ వర్సెస్ విజయ్ ఆంటోనీ... తమిళ టైటిల్ గొడవ, ఇంతకీ 'పరాశక్తి' ఎవరి సొంతం?
శివకార్తికేయన్ వర్సెస్ విజయ్ ఆంటోనీ... తమిళ టైటిల్ గొడవ, ఇంతకీ 'పరాశక్తి' ఎవరి సొంతం?
YSRCP Leaders : కేసుల్లో మగ్గిపోతున్న లీడర్, క్యాడర్ - వైసీపీ హైకమాండ్ కనీస సాయం చేయడం లేదా ?
కేసుల్లో మగ్గిపోతున్న లీడర్, క్యాడర్ - వైసీపీ హైకమాండ్ కనీస సాయం చేయడం లేదా ?
Shruti Haasan : బర్త్​డే ఫోటోలు షేర్ చేసిన శృతి హాసన్.. ఈ ఏడాదితో 39లోకి అడుగుపెట్టేసిందిగా
బర్త్​డే ఫోటోలు షేర్ చేసిన శృతి హాసన్.. ఈ ఏడాదితో 39లోకి అడుగుపెట్టేసిందిగా
AP New DGP:  ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా - 31న ద్వారకా తిరమలరావు రిటైర్
ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా - 31న ద్వారకా తిరమలరావు రిటైర్
Kohli Vs Smith: విరాట్ కంటే స్మిత్ గొప్ప.. అందుకు సాక్ష్యం అవే.. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆసీస్ దిగ్గజం
విరాట్ కంటే స్మిత్ గొప్ప.. అందుకు సాక్ష్యం అవే.. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆసీస్ దిగ్గజం
Telangana News: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్
Embed widget