అన్వేషించండి

Anasuya Bharadwaj : స్ట్రాంగ్‌గా ఉండాలనుకున్నా కానీ - వెక్కివెక్కి ఏడ్చిన అనసూయ

స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ వెక్కి వెక్కి ఏడ్చారు. సోషల్ మీడియాలో ఆమె భారీ పోస్ట్ ఒకటి చేశారు.

రంగుల ప్రపంచంలో మహిళలపై విమర్శలు చేసే వ్యక్తులు సమాజంలో ఉన్నారు. ఆ విమర్శలను స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) సైతం ఎదుర్కొన్నారు. అయితే... విమర్శలకు ధీటుగా బదులు ఇవ్వడం ఆమె స్టైల్. అటువంటి అనసూయ కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనమైంది. 

'ఫైర్ బ్రాండ్' పదానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు కనిపించే అనసూయ వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో స్వయంగా ఆమె పోస్ట్ చేశారు. దాంతో పాటు నెటిజనులకు భారీ లేఖ కూడా రాశారు.

ప్రస్తుతం బావున్నా... ఐదు రోజుల క్రితం!
అనసూయ ఓ క్లారిటీ ఇచ్చారు. తాను కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఐదు రోజుల క్రితం తీసుకున్న వీడియో అని చెప్పారు. ప్రస్తుతం తాను బావున్నానని తెలిపారు. అయితే... జీవితంలో ఓ దశను గుర్తు పెట్టుకోవడం కోసం, జ్ఞాపకంగా ఉంచుకోవడం కోసం వీడియో రికార్డ్ చేశానని పేర్కొన్నారు. అసలు, ఆమెను అంతగా బాధ పెట్టిన విషయం ఏమిటన్నది మాత్రం చెప్పలేదు. సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల తాను మానసిక క్షోభకు గురి అవుతున్నట్లు తెలిపారు. 

సోషల్ మీడియా ఉద్దేశం ఏమిటి?
ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి?
తాను కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో / పోస్ట్ చూసిన ప్రజలు అందరూ కన్‌ఫ్యూజ్ అయ్యి ఉంటారని తనకు తెలుసునని పేర్కొన్న అనసూయ... ''నాకు తెలిసినంత వరకు ప్రపంచవ్యాప్తంగా ఒకరితో ఒకరు టచ్ లో ఉండటం కోసం సోషల్ మీడియా తీసుకు వచ్చారు. సంస్కృతి, సంప్రదాయాలు, సంతోషాలు, సమాచారం, జీవన విధానాలు... ఒకరితో ఒకరు పంచుకోవడం కోసం సామాజిక మాధ్యమాలను ప్రజల ముందుకు తీసుకు వచ్చారు. అది వాటి ఉద్దేశం. ఇవాళ సోషల్ మీడియాలో అటువంటిది ఉందా?'' అని ప్రశ్నించారు. 

ఫోటోషూట్లు, డ్యాన్సులు, నవ్వులు, స్ట్రాంగ్ కౌంటర్లు, వగైరా వగైరా తన జీవితంలో ఓ భాగం అని అనసూయ తెలిపారు. అవన్నీ నెటిజనులతో పంచుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. జీవితంలో తాను బలహీనంగా ఉన్న క్షణాలు, మానసికంగా ధృడంగా లేని సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు. కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలు ఉన్నాయన్నారు. సెలబ్రిటీ (పబ్లిక్ ఫిగర్)లకు ఇవన్నీ తప్పవని ప్రజలు తెలుసుకోవాలని అనసూయ వ్యాఖ్యానించారు. 

బలంగా ఉండాలని అనుకున్నా...
సోషల్ మీడియాలో కొందరు చేసే కామెంట్స్, ట్రోల్స్ తనపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నట్లు అనసూయ భరద్వాజ్ తెలిపారు. ''బలంగా ఉండాలని, డోంట్ కేర్ యాటిట్యూడ్ తో ముందుకు వెళ్లాలని, న్యూట్రల్ ఫీలింగ్స్ తో ఉండాలని ఎంత ఆలోచించినా... అలా ఉండలేకపోతున్నాను. పైకి బలంగా కనిపిస్తున్నా... నా బలం అది కాదు. నా ఫీలింగ్స్ బయట పెట్టి... మంచిగా ఏడ్చి... రెండు మూడు రోజుల తర్వాత చిరునవ్వుతో ప్రపంచాన్ని ఎదుర్కోవడం... ఇది నా అసలైన బలం'' అని అనసూయ తెలిపారు.

Also Read : అత్తారింట అల్లు అర్జున్‌కు గ్రాండ్ వెల్కమ్ - మామగారి ఫంక్షన్ హాల్ ఓపెనింగ్‌లో...

విశ్రాంతి తీసుకుని, మళ్ళీ బలం పుంజుకుని ముందు వెళ్లడం ముఖ్యమని అనసూయ సందేశం ఇచ్చారు. ఎదుటి వ్యక్తుల మీద ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా... ఏం విసిరినా... వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారని, అందుకని అందరి పట్ల మంచిగా ఉండాలని అనసూయ హితవు పలికారు. ప్రస్తుతం తాను అది బలంగా తెలుసుకుంటున్నాని చెప్పారు. అదీ సంగతి!

Also Read 'భగవంత్ కేసరి' ప్రీ రిలీజ్ బిజినెస్ - బాలకృష్ణ ముందున్న టార్గెట్ ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget