అన్వేషించండి

Prudhvi Raj: ఆర్జీవీ సినిమాలు ఎవరూ చూడరు, ఎవరూ పట్టించుకోరు - ‘వ్యూహం’పై ఫృథ్విరాజ్ సెటైర్లు

నటుడు పృథ్విరాజ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలు రాజకీయాలు వేరని అయినా.. ఆర్జీవిను ఆయన సినిమాలను సీరియస్ గా తీసుకునే ఖాళీ ఎవరికీ లేదన్నారు.

Prudhvi Raj: టాలీవుడ్ లో నటుడు పృథ్వీ రాజ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పృథ్వీ రాజ్ గా కంటే ‘30 ఇయర్స్ పృథ్వీ’ అంటూ వెంటనే గుర్తుపడతారు ఆడియన్స్. సినిమాల్లో ఎక్కువగా కామెడీ పాత్రల్లో కనిపించే పృథ్వీ రాజ్ కు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆయన గత కొంత కాలంగా సినిమాల్లో తక్కువగా రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పలు సార్లు కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు కూడా. మొన్నటి వరకూ వైసిపీ పార్టీలో యాక్టీవ్ గా ఉన్న పృథ్వీ తర్వాత ఆ పార్టీతో విబేధాలు రావడంతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు జనసేన పార్టీలో యాక్టీవ్ గా ఉంటున్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై విమర్శలు గుప్పించారు. 

అవన్నీ జరిగేవి కావు, ఆ సినిమాలు ఎవరూ చూడరు : పృథ్వీ రాజ్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ‘వ్యూహం’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఆ సినిమా ఏపీలో ప్రతిపక్షపార్టీల ఓటమే లక్ష్యంగా తీస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆ సినిమా ఉంటుందని చర్చించుకుంటున్నారు. ఇదే విషయంపై పృథ్వీ రాజ్ ను అడిగితే దానికి ఆయన స్పందిస్తూ.. రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలను అసలు ప్రజలు చూడరని కొట్టిపారేశారు పృథ్వీ. గతంలో కూడా ఆర్జీవి ఇలాంటి సినిమాల తీసారని కాని వాటి ప్రభావం రాజకీయాల్లో ఏ మాత్రం ఉండదని అన్నారు. ఆర్జీవి సినిమాలను సీరియస్ గా ఎవరూ తీసుకోరని చెప్పారు. ప్రతిపక్షాల మీద ప్రజల్లో వ్యతిరేకత తేవడానికే ఇలాంటి సినిమాలు తీస్తున్నారని, కానీ సినిమాలు రాజకీయాలు వేరని చెప్పుకొచ్చారు. ఆర్జీవికు పోటీగా తమ పార్టీ వాళ్లు గానీ, టీడీపీ వాళ్లు గానీ సినిమాలు చేసే ఉద్దేశం ఉండదని, ఎందుకంటే అలాంటి నీచమైన సిద్దాంతాలు ఈ పార్టీల్లో లేవని అన్నారు. అలా చేయాలని అనుకుంటే గతంలో వై ఎస్ జగన్ పాద యాత్ర చేసి ఉండేవాడా అని ప్రశ్నించారు. సినిమాలు తీయాలి అనుకుంటే వాళ్లు ఈ నాలుగేళ్లలో చేసిన పనుల గురించి సినిమాలు చేసుకుంటే బాగుంటుందని, అంతేగాని ఇలా ప్రతిపక్షాల మీద కక్షతో సినిమాలు చేయడం వలన ఒరిగేది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. 

రాజకీయాలే లక్ష్యంగా ఆర్జీవి సినిమాలు..

రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా రాజకీయాలను లక్ష్యంగా చేసుకొని పొలిటికల్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన గతంలో 2019 ఎన్నికల సమయంలో కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ వంటి సినిమాలను తెరకెక్కించారు. ఆ తర్వాత కూడా ఒకటి రెండు పొలిటికల్ స్టోరీలను ఎంచుకొని సినిమాలు తీశారు. మళ్లీ ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా కూడా ఎన్నికల సమయంలో రాజకీయాలను ఉద్దేశించే తీస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి ఆర్జీవి తీసే సినిమాలు ఏపీ రాజకీయాల్ని ఎంతవరకూ ప్రభావితం చేస్తాయో చూడాలి. 

Also Read: తెలుగు రాష్ట్రాల్లో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ బిజినెస్ - ఎన్ని కోట్లో తెలుసా!

టాప్ హెడ్ లైన్స్

Anil Ravipudi: అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
Namitha New Look : అప్పుడు అలా... ఇప్పుడు ఇలా - స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌లో టాలీవుడ్ హీరోయిన్
అప్పుడు అలా... ఇప్పుడు ఇలా - స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌లో టాలీవుడ్ హీరోయిన్
Mahaprabhu Jagannath Release Date : మహాప్రభు జగన్నాథ్‌ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
మహాప్రభు జగన్నాథ్‌ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Family Stars Season 2 - ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget