అన్వేషించండి

Vyooham Censor: ఆర్జీవీ 'వ్యూహం'కి షాకిచ్చిన సెన్సార్ - అభ్యంతరాలు ఇవే!

ఆర్జీవి 'వ్యూహం' సినిమాకు సెన్సార్ బోర్డ్ భారీ షాక్ ఇచ్చింది. సినిమాలో ఉన్న సన్నివేశాలన్నీ వ్యక్తిగత వ్యవహారాలు, మనోభావాలు కించపరిచే విధంగా ఉన్న కారణంగా సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది.

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెన్సార్ బోర్డు భారీ షాక్ ఇచ్చింది. ఆయన తెరకెక్కించిన 'వ్యూహం' (Vyooham) మూవీకి తాజాగా సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సినిమాలోని పాత్రలకు నిజ జీవితంలోని నేతల పేర్లను పెట్టడంపై సెన్సార్ బోర్డ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే జరుగుతున్న కాలానికి సంబంధించిన అంశాలనే కథగా తీసుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ‘వ్యూహం’ చిత్రానికి సెన్సార్ టీం సర్టిఫికెట్ ఇచ్చేది లేదంటూ వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవిత ఆధారంగా రాంగోపాల్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'వ్యూహం'(Vyooham).

ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా అందరూ ఊహించిన విధంగానే వైయస్ జగన్ ని హైలైట్ చేస్తూ వైఎస్సార్సీపీకి అనుకూలంగానే ఈ సినిమాని తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమైపోయింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్, చంద్రబాబులను టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో సెటైరికల్ గా వారి పాత్రలను ఈ సినిమాలో చిత్రీకరించారు వర్మ. 'వ్యూహం'తో పాటు పార్ట్-2 ని 'శపథం' పేరుతో వర్మ రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాల విడుదల తేదీలను ముందుగానే ప్రకటించారు.

ఈ క్రమంలోనే 'వ్యూహం' సినిమాని నవంబర్ 10న, 'శపథం' మూవీని జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైయస్ జగన్ జీవితంలోని కొన్ని ప్రత్యేక ఘటనలను ఈ రెండు సినిమాల్లో చూపెట్టబోతున్నారు ఆర్జీవి. వైయస్సార్ మరణం అనంతరం వైయస్ జగన్ జైలుకు వెళ్లడం, బయటికి రావడం, సొంత పార్టీ పెట్టి ఓదార్పు యాత్రలు, ఆ తర్వాత పాదయాత్ర చేపట్టి అధికారాన్ని తెచ్చుకోవడం, చంద్రబాబు అరెస్టు తదితర అంశాలన్నింటినీ ఈ సినిమాల్లో చూపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సెన్సార్ టీం భారీ షాక్ ఇచ్చింది. ‘వ్యూహం’ చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు నిరాకరించింది.

సినిమాలోని కొన్ని సన్నివేశాలు, వ్యక్తిగత వ్యవహారాలు, మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డ్ సభ్యులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ కారణంగా సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాకు పర్మిషన్ పై రివైజింగ్ కమిటీ దరఖాస్తు చేయాలని నిర్ణయించారు మేకర్స్. ఇదే విషయంపై వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ స్పందిస్తూ..' సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలపై రీవైజింగ్ కమిటీ దరఖాస్తు చేసినట్లు' చెప్పారు. ఇక ఈ సినిమాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను తమిళన నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. జగన్ భార్య వైయస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనుంది. రామదూత బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

Also Read : బాబోయ్ మాళవిక, కొండమల్లిగా వణుకు పుట్టిస్తోందిగా!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rashmika Mandanna : రష్మిక నోట బూతు పదం.. వెంటనే సారీ - అన్ కంఫర్టబుల్ ఫీలైన నేషనల్ క్రష్... ఎందుకంటే?
రష్మిక నోట బూతు పదం.. వెంటనే సారీ - అన్ కంఫర్టబుల్ ఫీలైన నేషనల్ క్రష్... ఎందుకంటే?
Pawan Kalyan : పవన్ కల్యాణ్ గొప్ప లీడర్ - పవర్ స్టార్‌పై అడివి శేష్ ప్రశంసలు
పవన్ కల్యాణ్ గొప్ప లీడర్ - పవర్ స్టార్‌పై అడివి శేష్ ప్రశంసలు
Karuppu Movie : త్రిష మూవీలో విజయ్ గెస్ట్ రోల్? - ఆ సీన్ వైరల్
త్రిష మూవీలో విజయ్ గెస్ట్ రోల్? - ఆ సీన్ వైరల్
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో మూవీస్ ఫెస్టివల్ - ఒకే రోజు 8 సినిమాలు
ఈ వారం ఓటీటీల్లో మూవీస్ ఫెస్టివల్ - ఒకే రోజు 8 సినిమాలు

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dollar vs Indian Rupee: డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
Supreme Court: హైదరాబాద్‌లోని KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
Supreme Court: హైదరాబాద్‌లోని KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
Viral News: చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
India Hottest Cities: భగభగ మండుతున్న భారత్.. భూమిపై 50 వేడినగరాలు మనదేశంలోనే...!
భగభగ మండుతున్న భారత్.. భూమిపై 50 వేడినగరాలు మనదేశంలోనే...!
Indian Student Dies In US: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Agri Gold Scam: ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!
6 నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!
Embed widget