అన్వేషించండి

Vyooham Censor: ఆర్జీవీ 'వ్యూహం'కి షాకిచ్చిన సెన్సార్ - అభ్యంతరాలు ఇవే!

ఆర్జీవి 'వ్యూహం' సినిమాకు సెన్సార్ బోర్డ్ భారీ షాక్ ఇచ్చింది. సినిమాలో ఉన్న సన్నివేశాలన్నీ వ్యక్తిగత వ్యవహారాలు, మనోభావాలు కించపరిచే విధంగా ఉన్న కారణంగా సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది.

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెన్సార్ బోర్డు భారీ షాక్ ఇచ్చింది. ఆయన తెరకెక్కించిన 'వ్యూహం' (Vyooham) మూవీకి తాజాగా సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సినిమాలోని పాత్రలకు నిజ జీవితంలోని నేతల పేర్లను పెట్టడంపై సెన్సార్ బోర్డ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే జరుగుతున్న కాలానికి సంబంధించిన అంశాలనే కథగా తీసుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ‘వ్యూహం’ చిత్రానికి సెన్సార్ టీం సర్టిఫికెట్ ఇచ్చేది లేదంటూ వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవిత ఆధారంగా రాంగోపాల్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'వ్యూహం'(Vyooham).

ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా అందరూ ఊహించిన విధంగానే వైయస్ జగన్ ని హైలైట్ చేస్తూ వైఎస్సార్సీపీకి అనుకూలంగానే ఈ సినిమాని తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమైపోయింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్, చంద్రబాబులను టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో సెటైరికల్ గా వారి పాత్రలను ఈ సినిమాలో చిత్రీకరించారు వర్మ. 'వ్యూహం'తో పాటు పార్ట్-2 ని 'శపథం' పేరుతో వర్మ రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాల విడుదల తేదీలను ముందుగానే ప్రకటించారు.

ఈ క్రమంలోనే 'వ్యూహం' సినిమాని నవంబర్ 10న, 'శపథం' మూవీని జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైయస్ జగన్ జీవితంలోని కొన్ని ప్రత్యేక ఘటనలను ఈ రెండు సినిమాల్లో చూపెట్టబోతున్నారు ఆర్జీవి. వైయస్సార్ మరణం అనంతరం వైయస్ జగన్ జైలుకు వెళ్లడం, బయటికి రావడం, సొంత పార్టీ పెట్టి ఓదార్పు యాత్రలు, ఆ తర్వాత పాదయాత్ర చేపట్టి అధికారాన్ని తెచ్చుకోవడం, చంద్రబాబు అరెస్టు తదితర అంశాలన్నింటినీ ఈ సినిమాల్లో చూపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సెన్సార్ టీం భారీ షాక్ ఇచ్చింది. ‘వ్యూహం’ చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు నిరాకరించింది.

సినిమాలోని కొన్ని సన్నివేశాలు, వ్యక్తిగత వ్యవహారాలు, మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డ్ సభ్యులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ కారణంగా సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాకు పర్మిషన్ పై రివైజింగ్ కమిటీ దరఖాస్తు చేయాలని నిర్ణయించారు మేకర్స్. ఇదే విషయంపై వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ స్పందిస్తూ..' సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలపై రీవైజింగ్ కమిటీ దరఖాస్తు చేసినట్లు' చెప్పారు. ఇక ఈ సినిమాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను తమిళన నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. జగన్ భార్య వైయస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనుంది. రామదూత బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

Also Read : బాబోయ్ మాళవిక, కొండమల్లిగా వణుకు పుట్టిస్తోందిగా!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Ramba Oorvasi Menaka First Look: ఫాంటసీ కామెడీతో అల్లరోడు... 'రంభ ఊర్వశి మేనక' రిలీజ్ డేట్ ఫిక్స్, ఫస్ట్ లుక్ చూశారా?
ఫాంటసీ కామెడీతో అల్లరోడు... 'రంభ ఊర్వశి మేనక' రిలీజ్ డేట్ ఫిక్స్, ఫస్ట్ లుక్ చూశారా?
NTR x Trivikram: తెలుగు వర్సెస్ తమిళ్... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాపై కాంట్రవర్సీ... ఏమైందో తెల్సా?
తెలుగు వర్సెస్ తమిళ్... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాపై కాంట్రవర్సీ... ఏమైందో తెల్సా?
Maa Inti Bangaram Collections Day 11: సెకండ్ వీకెండ్ తర్వాత సడన్‌గా పడిన బంగారం... సోమవారం సమంత సినిమాకు షాక్
సెకండ్ వీకెండ్ తర్వాత సడన్‌గా పడిన బంగారం... సోమవారం సమంత సినిమాకు షాక్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
టర్బో పెట్రోల్‌, ADASతో కొత్త Maruti Brezza - ఇంకొన్ని రోజుల్లో భారీ అప్‌డేట్‌తో ఎంట్రీ!
కొత్త కారు కొనేవాళ్లు కాస్త ఓపిక పట్టండి - మారుతి బ్రెజ్జా సరికొత్తగా వస్తోంది
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Embed widget