అన్వేషించండి

Biggboss: బిగ్ బాస్ వల్ల ఎవరికి ఉపయోగం... బ్యాన్ చేయాలంటున్న నారాయణ

బిగ్ బాస్ షో పై మండిపడ్డారు నారాయణ. ఈ షో వల్ల ఉపయోగం లేదని, నిషేధించాలని డిమాండ్ చేశారు.

బిగ్ బాస్ ప్రారంభమయ్యాక ప్రతి సీజన్లోను సీపీఐ నాయకులు నారాయణ ఆ కార్యక్రమాన్ని నిషేధించాలని కోరుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా బిగ్ బాస్ షో మొదలై వారం రోజులు అయ్యిందో లేదో... నారాయణ ఆ షోను, ప్రసారం చేస్తున్న ఛానెల్ ను కూడా నిషేధించాలని అన్నారు. ‘బిగ్ బాస్ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందా... సమాజానికి ఇలాంటి షోల వల్ల ఏం ఉపయోగం’అంటూ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి షోలకు ఎందుకు అనుమతిస్తున్నాయని ప్రశ్నించారు. బిగ్ బాస్ షో ఒక బూతుల ప్రపంచమని, దాన్ని వ్యాపార నిమిత్తం వాడుకుంటున్నారని అన్నారు. షోలో ఉన్న వారి తిట్లు, కొట్లాటలు చాలా అనైతికంగా అనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ షోపై కోర్టులో వ్యాజ్యం వేసినా పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ తనకు సహకరించలేదని తెలిపారు. 

గతంలో కూడా నారాయణ బిగ్ బాస్ షోను ఆపాలంటూ డిమాండ్ చేశారు. యువతీ యువకులను వంద రోజులకు పైగా ఒక ఇంట్లో ఉంచి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ఆయన అడిగారు. గతేడాది బిగ్ బాస్ 4 సీజన్ లో హోస్ట్ నాగార్జునపై కూడా మండి పడ్డారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను మంట గలుపుతున్నారని బిగ్ బాస్ నిర్వాహకులు, నాగార్జునపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళామతల్లికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 

ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 నడుస్తోంది. 2021 సెప్టెంబరు 5న షో మొదలైంది. మొత్తం 19 మందిని హౌస్లోకి పంపించారు. ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. నిజానికి సీజన్ 5 ఈ ఏడాది జూన్ నెలలోనే ప్రారంభమవ్వాల్సి ఉంది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సీజన్లో యాంకర్ రవి, యానీ మాస్టర్, సింగర్ శ్రీరామ చంద్ర, సీరియల్ హీరోలు మానస్, సన్నీ, ఆర్జే కాజల్, ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్, సీనియర్ నటీమణులు ప్రియ, ఉమా, కమెడియన్ లోబో, యూట్యూబ్ స్టార్లు సిరి హనుమంత్, షణ్ముక్ జస్వంత్, మోడల్ జెస్సీ లాంటి వారు ఉన్నారు.

Also read: రోజుకు నాలుగైదు వేరు శెనగపలుకులు తినండి చాలు... ఆ జబ్బులకు దూరంగా ఉండొచ్చు
Also read: ముల్లంగి తినడం లేదా... మీకే నష్టం
Also read: ఆమె చదివింది ఎమ్మెస్సీ... చేసేది రోడ్లు ఊడ్చేపని

Also read: జైల్లోకి జెస్సీ, నా కొడుకు మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యాడు సపోర్ట్ చేయండంటూ జస్వంత్ పడాల తల్లి భావోద్వేగం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
Embed widget