Bigg Boss OTT Finale: మిత్రా ఎలిమినేషన్ - కన్నీళ్లు పెట్టుకున్న ఆమె స్నేహితుడు
బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో మిత్రాశర్మ ఎలిమినేట్ అయింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఈరోజు ఫినాలే ఎపిసోడ్ తో ముగియనుంది. హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు, ఎక్స్ హౌస్ మేట్స్ తో మాట్లాడారు. టాప్ 2 అండ్ 3లో ఎవరు ఉంటారో చెప్పమని అడిగారు. దీంతో ఒక్కొక్కరూ వారి అభిప్రాయాలను తెలిపారు. అనంతరం టాప్ 7 కంటెస్టెంట్స్ తో మాట్లాడారు. ఆ తరువాత ఇద్దరు కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేశారు. ముందుగా అనిల్ ని, ఆ తరువాత బాబా భాస్కర్ ని ఎలిమినేట్ చేశారు.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ కి, ఎక్స్ హౌస్ మేట్స్ కి అవార్డ్స్ ఇవ్వడానికి 'మేజర్' టీమ్ ని స్టేజ్ పైకి పిలిచారు నాగార్జున. అడివి శేష్, శోభితా, సయీ మంజ్రేకర్ వచ్చి తమ సినిమా గురించి మాట్లాడారు. ఆ తరువాత హౌస్ మేట్స్ కి తమ క్యారెక్టర్ ని బట్టి ఫన్నీ అవార్డ్స్ ఇచ్చారు. అషురెడ్డికి బకెట్, నటరాజ్ మాస్టర్ కి కొరడా.. ఇలా ఫన్నీ అవార్డ్స్ ప్రకటించారు.
ఆ తరువాత టాప్ 5లో ఒకరిని ఎలిమినేట్ చేసే సమయం వచ్చిందని చెప్పారు నాగార్జున. హౌస్ లో ఉన్నవారిని గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్పారు. అనంతరం ఫ్లాగ్స్ తో వారు సేఫా..? కాదా..? అనేది చెప్పారు. ఈ క్రమంలో మిత్రాశర్మకి రెడ్ ఫ్లాగ్ రావడంతో ఆమె ఎలిమినేట్ అయిందని ప్రకటించారు. దీంతో ఆమె స్నేహితుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ మిత్రా మాత్రం చాలా ఎగ్జైటెడ్ గా స్టేజ్ పైకి వచ్చి నాగార్జునతో మాట్లాడింది.
Also Read: టాప్ 7 కంటెస్టెంట్స్ లో ఒకరు ఔట్ - ఎవరంటే?
Also Read: బాబా భాస్కర్ ను ఎలిమినేట్ చేసిన సత్యదేవ్
View this post on Instagram
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















